ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ పెట్టిన వాయిదా తీర్మానంపై చర్చించాలని వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. దీంతో వైసీపీ వాయిదా తీర్మానాన్ని మండలి ఛైర్మన్ తిరస్కరించారు. తాము ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చ చేయాల్సిందేనని వైసీపీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.
Off The Record : ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేట…రాజకీయ నేతలకు అదొక సంపన్న నియోజకవర్గం. ఆర్థిక వనరులు ఎక్కువగా ఉండటంతో…ఈ రిజర్వుడు నియోజకవర్గంలో పెత్తనం చేసేందుకు అధికార పార్టీలోని కీలక నేతలు పావులు కదుపుతున్నారట. గత ఎన్నికల్లో వైద్యురాలు నెలవల విజయశ్రి 25వేల మెజార్టీతో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేగా ఆమె ఎన్నికైనా…పెత్తనమంతా వేరొకరి చేతుల్లోకి వెళ్లిపోయినట్లు నియోజకవర్గంలో చర్చించుకుంటున్నారు. విజయశ్రీకి ఆర్థికంగా అండగా నిలబడటంలో, టికెట్ ఇప్పించడంలో ఓ పారిశ్రామికవేత్త కీలకపాత్ర పోషించారు. గెలిచిన తర్వాత…
Off The Record: విజయబగరం జిల్లా శృంగవరపుకోటలో తెలుగుదేశం పార్టీ మూడు వర్గాలు చీలిపోయినట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఓ వైపు ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి వర్గం…మరోవైపు గొంప కృష్ణ కేంద్రంగా రాజకీయాలు సాగుతున్నాయి. తాజాగా ఇటీవల పార్టీలో చేరిన ఇందుకూరి సుబ్బలక్ష్మి నేతృత్వంలో మూడో వర్గం తయారైందట. ఒకప్పుడు రెండు వర్గాలకే పరిమితమైన రాజకీయ సమీకరణాలు…ఇప్పుడు మూడు పవర్ సెంటర్స్గా మారినట్లు తెలుస్తోంది. పార్టీ కార్యక్రమాలైనా, ప్రభుత్వ కార్యక్రమాలైనా…ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు నిర్వహిస్తున్నారు.…
Ambati Rambabu: మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన ఆరోపణలు చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలైన అనంతరం మీడియాతో మాట్లాడుతూ తనను చంపడానికి కూడా ప్రయత్నించారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నన్ను బయటకు రాకుండా అడ్డుకోవాలని చూశారు. ఎన్ని రోజులైనా జైల్లోనే ఉండాలని వెళ్లాను. జైలులో పెడితే భయపడే వ్యక్తిని కాదు అని అంబటి స్పష్టం చేశారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, ఒకవేళ తప్పు చేసినా వెంటనే క్షమాపణలు చెప్పానని తెలిపారు. అయినప్పటికీ…
Ambati Rambabu: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు జైలు నుంచి విడుదలయ్యారు.. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బెయిల్పై విడుదలయ్యారు అంబటి. గత 19 రోజులుగా రిమాండ్లో ఉన్న ఆయన విడుదల కావడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కాగా, 2023లో సత్తెనపల్లిలో సంక్రాంతి సంబరాల పేరుతో లాటరీ నిర్వహించి కోట్ల రూపాయలు వసూలు చేశారనే ఆరోపణలతో నమోదైన కేసులో అంబటి రాంబాబు అరెస్టయ్యారు. ఈ కేసుతో పాటు ముఖ్యమంత్రి…
వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు న్యాయస్థానంలో మరోసారి ఊరట లభించింది. సంక్రాంతి సంబరాల పేరుతో అక్రమ వసూళ్లు చేశారన్న ఆరోపణలపై నమోదైన కేసులో ఆయనకు బెయిల్ మంజూరైంది. 2023లో సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లో నమోదు చేసిన ఈ కేసులో పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ను గుంటూరు జిల్లా కోర్టు బుధవారం తిరస్కరించింది. అంబటి తరపు న్యాయవాదులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై వాదనలు విన్న కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
Off The Record: ఆంధ్రప్రదేశ్ అంతటా ఫ్యాన్ గాలి రివ్వు రివ్వున వీచిన రోజుల్లో కూడా ఇక్కడ చడీ చప్పుడు లేదు. ఇప్పుడైతే ఇక మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదన్నట్టుగా ఉంది… ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి.పార్టీ ఆవిర్భావం నుంచి ఇక్కడ గెలవడం సంగతి పక్కనబెడితే….. కనీసం కార్యకర్తలను కాపాడుకునే ప్రయత్నాలు కూడా జరగట్లేదని అంటున్నారు. అసలు ఉండిలో వైసీపీ బతికే ఉందా అనే అనుమానాలు పెరుగుతున్నాయట ఆ పార్టీ కేడర్లోనే. గెలుపు సంగతి తర్వాత……
Deputy CM Pawan: జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఈరోజు (ఫిబ్రవరి 15న) ఉదయం డిప్యూటీ సీఎం, పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా సభ్యత్వ నమోదుకు రూ.2 కోట్లు విరాళం అందించి, తొలి సభ్యత్వాన్ని తీసుకున్నారు.
Ambati Rambabu Controversy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్ట్.. వరుస కేసుల వ్యవహారం కాక రేపుతోంది.. అయితే, శాసనమండలిలో అంబటి రాంబాబు వివాదంపై తీవ్ర వాగ్వాదం జరిగింది. మంత్రి నారా లోకేష్ మరియు మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ మధ్య మాటల తూటాలు పేలాయి. మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, అంబటి రాంబాబు.. ముఖ్యమంత్రి తల్లిని అవమానించారని ఆరోపించారు. మహిళలను కించపరిచే విధానం సరికాదన్నారు. “ఎవరి తల్లినైనా, మహిళనైనా…