Deputy CM Pawan Kalyan: పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు.. చప్పట్లు, పొగడ్తలు అవసరం లేదు.. పని మాత్రమే కావాలి..
- ఉత్తరాంధ్ర పంచాయతీరాజ్ అధికారుల సమావేశం..
- డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు..
- పొగడ్తలు కాదు.. పని కావాలి..
- నాకు చప్పట్లు, పొగడ్తలు అవసరం లేదు.. పని మాత్రమే కావాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deputy CM Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.. ఉత్తరాంధ్ర పంచాయతీరాజ్ అధికారుల సమావేశంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఘాటు వ్యాఖ్యలు చేశారు. అధికారులకు స్పష్టమైన సందేశం ఇచ్చారు. తనకు చప్పట్లు, పొగడ్తలు అవసరం లేదని, క్షేత్రస్థాయిలో నిజమైన పని మాత్రమే కావాలని తేల్చి చెప్పారు. ఉన్నత స్థాయి అధికారుల నుంచి ఫీల్డ్ అసిస్టెంట్ వరకు ప్రతి ఒక్కరు పూర్తి నిబద్ధతతో పని చేయాలని పవన్ కల్యాణ్ ఆదేశించారు. ఉపాధి హామీ పథకం, జల్ జీవన్ మిషన్ వంటి కీలక పథకాల అమలులో నిర్లక్ష్యం, నిధుల దుర్వినియోగం జరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిర్దేశిత లక్ష్యాలను చేరుకోలేకపోయినా, పనిలో అలసత్వం చూపించినా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.
Read Also: Raipur Central Jail: ఆ కేసులో అరెస్టైన ప్రియుడు.. జైలుకెళ్లి సర్ ప్రైజ్ చేసిన ప్రియురాలు..
Also Read
- Vizag Tragedy: రాఖీ పండుగ రోజే విషాదం.. భార్య, ఇద్దరు చిన్నారులతో సహా ఆటో డ్రైవర్ ఆత్మహత్య
- Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
- Vizag School Tragedy: విశాఖలో దారుణం.. టీచర్ దెబ్బలకు ఆగిన పసి గుండే..! యూకేజీ విద్యార్థి మృతి..
- Vizag Crime: మట్టి కుప్పలో 4 మృతదేహాలు, 9 పుర్రెలు.. విశాఖలో తీవ్ర కలకలం
సోషల్ ఆడిట్ ప్రక్రియను కూడా మొక్కుబడిగా కాకుండా పక్కాగా నిర్వహించాలని సూచించారు. అభివృద్ధి ఫలాలు క్షేత్రస్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరికీ చేరాల్సిందేనని, అలా జరగకపోతే అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు.. ఇక, తన వైపు నుంచి ఎలాంటి రాజకీయ ఒత్తిడులు, సిఫార్సులు ఉండవని పవన్ కల్యాణ్ స్పష్టంగా చెప్పారు. ప్రతి అధికారి నిబంధనల ప్రకారమే పని చేయాలన్నారు. గత ప్రభుత్వంలో పని చేసిన కొంతమంది అధికారులు ఇప్పటికీ పాత నాయకులతో సంబంధాలు కొనసాగిస్తూ ప్రభుత్వ విధానాల అమలులో నిర్లక్ష్యం వహిస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇలాంటి వ్యవహారాలను ఇకపై సహించబోమని హెచ్చరించారు. ఎలాంటి రాజకీయ ప్రలోభాలకు తావులేకుండా నిబంధనల మేరకు మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పనిలో అలసత్వాన్ని అస్సలు సహించబోమని మరోసారి స్పష్టం చేశారు.
ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న పదోన్నతులను ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా పూర్తి చేశామని పవన్ కల్యాణ్ తెలిపారు. ఒకేసారి దాదాపు 10 వేల మందికి ప్రమోషన్లు కల్పించడం ద్వారా ప్రభుత్వ చిత్తశుద్ధిని చాటుకున్నామన్నారు. అధికారులు పొందిన ఈ సంతోషం ప్రజల్లోనూ కనిపించాలన్నారు. ఉమ్మడి కడప జిల్లాలో ఎంపీడీవోపై దాడి ఘటన చోటుచేసుకున్నప్పుడు స్వయంగా అక్కడికి వెళ్లి భరోసా ఇచ్చామని గుర్తు చేశారు. అధికారులు కష్టాల్లో ఉంటే ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం కష్టపడుతోందని పవన్ కల్యాణ్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పెద్దల మద్దతు కూడగట్టి నిధులు సాధిస్తున్నామని చెప్పారు. ఆ కష్టానికి సార్ధకత చేకూరేలా అధికారులు సమర్థంగా పని చేయాలని కోరారు. ప్రజల సంక్షేమం, సంతోషమే లక్ష్యంగా పని చేయాలని, కూటమి ప్రభుత్వ సంకల్పానికి అధికారులు పూర్తి స్థాయిలో తోడుగా నిలవాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
Samantha: పిల్లలు లేకపోయినా ఓకే అనుకున్నాం.. అదే సమయంలో ఈ గుడ్ న్యూస్.. ప్రెగ్నెన్సీపై సమంత షాకింగ్ కామెంట్స్!
-
Amaravati Economic Region Master Plan: అమరావతి ఎకనామిక్ రీజియన్కు కొత్త బ్లూప్రింట్.. పరిశ్రమలు, ఉద్యోగాలపై ఫోకస్
-
Harmanpreet Kaur: ప్రతిసారి నేనున్నానని ముందుకొస్తుంది.. వికెట్స్ తీస్తుంది.. హర్మన్ప్రీత్ సంతోషం!
-
Sanju Samson: సంజు శామ్సన్ ఉదారత.. 1,000 మంది యూపీఎస్సీ అభ్యర్థులకు స్కాలర్షిప్లు..
-
Ravi Mohan: ప్రియురాలిగా వార్తల్లో నిలిచిన కెనీషానే ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్..
ట్రెండింగ్
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్లో 350 పరుగులు.. తొలి బ్యాటర్గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!