అనంతపురం శివారులో రాజహంస విల్లాస్లో భారీ చోరీ జరిగింది. రియల్ ఎస్టేట్ వ్యాపారి శివారెడ్డి ఇంట్లో రూ. 3.5 కోట్ల విలువైన బంగారు నగలను దుండగులు అపహరించారు. కూతురు వివాహం కోసం దాచి వుంచిన నగలు, నగదు ఎత్తుకెళ్లారు. ఇంట్లో నుంచి దాదాపు రూ. 20 లక్షలు తీసుకు వెళ్లారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
గాడ్ ఆఫ్ మాస్ నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘డాకు మహారాజ్’. భారీ బడ్జెట్ పై హై యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాలో శ్రద్దా శ్రీనాధ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించగా బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా కీలక పాత్రలో మెప్పించింది. ఈ సినిమా తొలి ఆట నుండే సూపర్ హిట్ తో దూసుకెళుతూ వందకోట్ల క్లబ్ లో చేరింది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రం…
మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డికి చెందిన ట్రావెల్స్ బస్సు మంటల్లో పూర్తిగా దగ్ధమైంది. అనంతపురంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని జేసీ దివాకర్ ట్రావెల్స్ కార్యాలయం వద్ద ఈరోజు తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. ట్రావెల్స్ కార్యాలయం వద్ద మొత్తం నాలుగు బస్సులను నిలిపి ఉంచగా.. ఇందులో ఒకటి పూర్తిగా దగ్ధమైంది. మరో బస్సు పాక్షికంగా కాలిపోయింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. జేసీ ట్రావెల్స్ బస్సు దగ్ధంపై పోలీసులు…
కర్నూలు, కడప, అనంతపురం-హిందూపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలపై ఫోకస్ పెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. అందులో భాగంగా ఈ రోజు కర్నూలు, కడప, అనంతపురం-హిందూపురం యూడీఏలపై సమీక్ష నిర్వహించారు మంత్రి నారాయణ.. ఆయా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల (యూడీఏ) పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ది కార్యక్రమాలపై సంబంధిత అధికారులకు దిశానిర్ధేశం చేశారు మంత్రి నారాయణ..
అనంతపురం జిల్లా కుందుర్పి మండలం రుద్రంపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. మండలంలోని రుద్రంపల్లి గ్రామంలో పాత మిద్దె కూలి ముగ్గురు మృతి చెందారు. వర్షానికి నాని పాత మిద్దె కూలినట్లు స్థానికులు చెబుతున్నారు.
అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం తలగాసిపల్లి క్రాస్ వద్ద శనివారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, ఆటో ఢీ కొన్నాయి.. ఈ ఘటనలో అక్కడికక్కడే నలుగురు మృతి చెందగా.. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో.. వెంటనే స్థానికులు, పోలీసులు క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే చికిత్స పొందుతూ ముగ్గురు చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య ఏడుకు చేరింది.
దుష్ట శిక్షణ.. శిష్ట రక్షణ.. రెండూ ఉండాలి అంటూ డ్రైనింగ్ పూర్తి చేసుకున్న డీఎస్పీలకు సూచించారు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల రావు.. ఇదే సమయంలో.. శాంతి భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత.
అనంతపురం కలెక్టరేట్లో వెపన్ మిస్ ఫైర్ ఘటన కలకలం సృష్టించింది. తెల్లవారుజామున 5:30 గంటల సమయంలో కలెక్టరేట్లో గార్డు డ్యూటీలో ఉన్న (1996 బ్యాచ్ AR HC 2242) సుబ్బరాజు 303 వెపన్ క్లీన్ చేస్తుండగా మిస్ ఫైర్ అయింది. ఛాతీలో నుంచి బుల్లెట్ బయటకు వెళ్లిపోయింది. త్రీవంగా గాయపడిన సుబ్బరాజును అక్కడే ఉన్న గార్డు సిబ్బంది చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆస్పుత్రికి తరలించారు. Also Read: Ind vs NZ: టాస్ గెలిచి బ్యాటింగ్…
తుఫాన్ కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో తీవ్ర వర్షాలు కురుస్తున్నాయి. మరి ముఖ్యంగా రాయలసీమలోని అనంతపురం జిల్లాలో తుఫాను దాటికి వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. అనంతపురంలోని వరద కారణంగా రాకపోకలు నిలిచిపోయాయి. కాగా టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున ఈ వరదల్లో చిక్కుకున్నారు. కింగ్ నాగార్జున ప్రముఖ జ్యువెల్లరీ సంస్థ కళ్యాణ్ జువెల్ర్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా గత కొన్నేళ్లుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. Also Read : AlluArjun : మతి పోగొడుతున్న…
గంజాయి అమ్మేవారికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు జేసీ ప్రభాకర్ రెడ్డి... గంజాయి అమ్మేవారిపై పోలీసుల సహకారంతో పీడీ యాక్ట్ నమోదు చేసి గ్రామ బహిష్కరణ చేస్తామని హెచ్చరించారు..