Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Anantapur Former Cm Ys Jagans Photo Controversy Anantapur Zp Ceo Transferred

Ex CM Photo Controversy: ఫొటో వివాదం..! జడ్పీ సీఈవోపై వేటు

Published Date :May 23, 2025 , 8:20 pm
By Sudhakar Ravula
  • అనంతపురం జడ్పీ చైర్ పర్సన్ గిరిజమ్మ ఛాంబర్ లో జగన్ ఫొటో..
  • మాజీ సీఎం జగన్ ఫొటోపై వివాదం..
  • జడ్పీ సీఈవో నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడం పై ఎమ్మెల్యేల ఆగ్రహం..
Ex CM Photo Controversy: ఫొటో వివాదం..! జడ్పీ సీఈవోపై వేటు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Ex CM Photo Controversy: అనంతపురం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ ఛాంబర్ లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటో వివాదానికి కారణమైంది… గత సమావేశంలో ఎమ్మెల్యేలు అధికారులు దృష్టికి తీసుకెళ్లిన వారిలో ఏమాత్రం మార్పు రాకపోవడంతో అధికారులపై ఎమ్మెల్యేలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మూడు రోజుల క్రితం జడ్పీ సర్వసభ్య సమావేశం నిర్వహించగా.. అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు హాజరయ్యారు. వారు అటుగా వెళ్తుండగా జడ్పీ చైర్ పర్సన్ గిరిజమ్మ ఛాంబర్ లో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉండటాన్ని గుర్తించారు. అదే సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫోటో స్టోర్ రూమ్ పక్కన ఉంచడంపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే జెడ్పీ డిప్యూటీ సీఈవోని పిలిపించి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ నిబంధన ప్రకారం మాజీ ముఖ్యమంత్రి ఫోటో పెడతారని ప్రశ్నించారు.. జడ్పీ సీఈవో నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడం పై ఎమ్మెల్యేలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

Read Also: AP Crime: ఏపీలో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం, హత్య..!

Also Read

  • Anantapur Honey Trap Case: అనంతపురం హనీ ట్రాప్ కేసులో బిగ్‌ ట్విస్ట్.. వైసీపీ నేత అరెస్ట్..!
  • Keesara Toll Plaza:ఘోర ప్రమాదం.. కారుపై బోల్తా పడ్డ ఆయిల్‌ ట్యాంకర్.. నుజ్జునుజ్జైన BMW కారు.!
  • Rayalaseema Water Project Row: చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌కు చిత్తశుద్ధి ఏది..? సీమవాసులు మీకు పట్టం కడితే.. చేస్తున్నది ఏంటి?
  • CM Chandrababu: నీరు మనందరికీ సర్వస్వం... సంరక్షణ కోసం వంద రోజుల యాక్షన్ ప్లాన్..

కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ ఫొటోలు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అన్ని కార్యాలయాల్లో కూడా ఫొటోలు పెడుతున్నారు. అయితే గత వైసీపీ ప్రభుత్వంలో మున్సిపల్ ఛైర్మన్లుగా, జడ్పీ ఛైర్మన్లుగా గెలిచిన వారంతా అప్పటి ముఖ్యమంత్రి జగన్ ఫొటోలు పెట్టుకున్నారు. ప్రభుత్వం మారినా ఛైర్మన్ల ఛాంబర్లలో జగన్ ఫొటోలే కనిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో అనంతపురం జడ్పీ ఛైర్ పర్సన్ ఛాంబర్ లో జగన్ ఫొటో ఉండడం వివాదాస్పదంగా మారింది.. మరోవైపు జడ్పీ ఛాంబర్‌లో ఎమ్మెల్యేలు ఇలా వ్యవహరించడంపై వైసీపీ నాయకులు మండిపడుతున్నారు. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఒకడుగు ముందుకేసి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశారు. జడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ ఛాంబర్‌లోకి ఎమ్మెల్యేలు దౌర్జన్యంగా వెళ్లి ఆమె ప్రతిష్టను దెబ్బతీసే రీతిలో వ్యవహరించారంటూ ఫైర్ అయ్యారు. అసలు ఆమె అనుమతి లేకుండా ఛాంబర్ లోకి ఎలా వెళ్తారంటూ ప్రశ్నిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఫొటో కిందపడేసి, ధ్వంసం చేశారని, సీఈవోను భయభ్రాంతులకు గురిచేశారని విమర్శించారు. అయితే ప్రోటోకాల్ వివాదం కాస్త రాజకీయ రగడగా మారడంతో జడ్పీ సీఈవోపై బదిలీ వేటు పడింది.. జిల్లా పరిషత్ సీఈవో రామచంద్రారెడ్డి ను జీఏడీకి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Anantapur
  • Andhra Pradesh
  • Ex CM Photo Controversy
  • Jagan photo controversy
  • ys jagan

తాజావార్తలు

  • MI vs SRH: వాంఖడేలో హై-స్కోరింగ్ థ్రిల్లర్.. 243 పరుగులు చేసిన ముంబైకి షాకిచ్చిన సన్‌రైజర్స్

  • Astrology: ఏప్రిల్‌ 30, గురువారం దినఫలాలు.. ఈ రాశులవారికి అనుకోని శుభవార్తలు..

  • LRS Fee : తెలంగాణ ప్రజలకు భారీ ఊరట.. LRS ఫీజుపై ప్రభుత్వం నిర్ణయం..!

  • Story Board : ఇరాన్ యుద్ధం.. గల్ఫ్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా?

  • Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..

ట్రెండింగ్‌

  • Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!

  • Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?

  • Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్‌లో బంధువులు!

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions