OnePlus: ఇండియాను వదిలి వెళ్లి పోతున్న వన్ ప్లస్..? క్లారిటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వన్ ప్లస్ (OnePlus) భారతదేశాన్ని వదిలి వెళ్తోందనే పుకార్లు మరోసారి హల్చల్ చేస్తున్నాయి. అయితే.. కంపెనీ ఈ ప్రచారాన్ని ఖండించింది. పేరెంట్ కంపెనీ ‘ఒప్పో’ (Oppo) తన గ్లోబల్ స్మార్ట్ఫోన్ వ్యాపారంలో పెద్ద మార్పులు చేయాలని యోచిస్తోందని బ్లూమ్బెర్గ్ నివేదించడంతో ఈ ఊహాగానాలు మొదలయ్యాయి. అమెరికా, యూరప్ మార్కెట్లలో వన్ ప్లస్ తన కార్యకలాపాలను క్రమంగా తగ్గించుకోనుందని, భవిష్యత్తులో భారత్పైనా దీని ప్రభావం పడవచ్చని ఆ నివేదిక పేర్కొంది.
అయితే.. వన్ ప్లస్ ఇండియా బిజినెస్ వైస్ ప్రెసిడెంట్ రాబిన్ ల్యూ ఈ ప్రచారాన్ని తీవ్రంగా తోసిపుచ్చారు. భారతీయ కస్టమర్ల కోసం ఆయన ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. ‘భారత్ ఎల్లప్పుడూ వన్ ప్లస్ అంతర్జాతీయ మార్కెట్లలో అత్యంత కీలకమైన దేశంగా కొనసాగుతుంది. మా వినియోగదారులు, భాగస్వాములకు మేం ఇచ్చే నిబద్ధతలో ఎలాంటి మార్పు లేదు. భారతదేశంలో సరికొత్త ఆవిష్కరణలు తీసుకురావడానికి మేం నిరంతరం పెట్టుబడులు పెడుతూనే ఉంటాం.’ తమ ఉనికిని మరింత బలోపేతం చేసుకునేందుకు రాబోయే రోజుల్లో ‘వన్ ప్లస్ N6x’ లాంటి కొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ మోడళ్లను భారత మార్కెట్లోకి తీసుకురానున్నట్లు కూడా ఆయన వెల్లడించారు.
Also Read
- Airtel Perplexity Pro: ఎయిర్టెల్ యూజర్లకు అలర్ట్.. రేపటిలోగా ఈ పని చేయకపోతే ఖాతా నుంచి డబ్బు కట్!
- Vivo T5 Lite: వివో T5 లైట్ 44W 5G ఫోన్ రిలీజ్.. 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, MediaTek Dimensity 6300 ప్రాసెసర్
- 50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
- 144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
UPDATE: OnePlus India has responded to the Bloomberg report about its exit from India in 2027.
“OnePlus India continues to operate its business as usual, with all local operations on track. We urge the media to exercise restraint before amplifying unverified speculation.” https://t.co/ah6lj04BBS
— TrakinTech (@TrakinTech) July 16, 2026
మరోవైపు.. ఒప్పోకు చెందిన ‘రియల్మీ’ చైనా మార్కెట్ నుంచి తప్పుకోవచ్చని, 2027 నాటికి వన్ ప్లస్ పునర్వ్యవస్థీకరణ భారతదేశానికి కూడా విస్తరించవచ్చని నివేదికలు చెబుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఆర్థిక ఇబ్బందులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆపిల్, శామ్సంగ్ కంపెనీల ఆధిపత్యం కారణంగా ఒప్పో తన గ్లోబల్ వ్యూహాలను మార్చుకుంటున్నట్లు సమాచారం. ఏదేమైనా.. ఈ మార్పులపై ఒప్పో ఇంకా అధికారికంగా స్పందించలేదు. కానీ వన్ ప్లస్ మాత్రం భారతదేశంలో తాము సుస్థిరంగా కొనసాగుతామని, మరిన్ని కొత్త ప్రొడక్ట్స్తో అలరిస్తామని భారతీయ వినియోగదారులకు స్పష్టమైన భరోసా ఇచ్చింది.
తాజావార్తలు
-
OnePlus: ఇండియాను వదిలి వెళ్లి పోతున్న వన్ ప్లస్..? క్లారిటీ..
-
Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లు.. మిషన్ 360పై మోడీ సర్కార్ ఫోకస్..
-
Hair Growth Tips: జుట్టు గుత్తులు గుత్తులుగా రాలిపోతోందా?.. ఈ చిట్కాలు చాలు..
-
Sujeeth: సైలెంట్గా పని కానిచ్చేస్తున్న స్టార్ డైరెక్టర్..
-
Supreme Court: 9వ తరగతిలో మూడో భాష రుద్దొద్దు.. కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!