OnePlus: ఇండియాను వదిలి వెళ్లి పోతున్న వన్ ప్లస్..? క్లారిటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వన్ ప్లస్ (OnePlus) భారతదేశాన్ని వదిలి వెళ్తోందనే పుకార్లు మరోసారి హల్చల్ చేస్తున్నాయి. అయితే.. కంపెనీ ఈ ప్రచారాన్ని ఖండించింది. పేరెంట్ కంపెనీ ‘ఒప్పో’ (Oppo) తన గ్లోబల్ స్మార్ట్ఫోన్ వ్యాపారంలో పెద్ద మార్పులు చేయాలని యోచిస్తోందని బ్లూమ్బెర్గ్ నివేదించడంతో ఈ ఊహాగానాలు మొదలయ్యాయి. అమెరికా, యూరప్ మార్కెట్లలో వన్ ప్లస్ తన కార్యకలాపాలను క్రమంగా తగ్గించుకోనుందని, భవిష్యత్తులో భారత్పైనా దీని ప్రభావం పడవచ్చని ఆ నివేదిక పేర్కొంది.
అయితే.. వన్ ప్లస్ ఇండియా బిజినెస్ వైస్ ప్రెసిడెంట్ రాబిన్ ల్యూ ఈ ప్రచారాన్ని తీవ్రంగా తోసిపుచ్చారు. భారతీయ కస్టమర్ల కోసం ఆయన ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. ‘భారత్ ఎల్లప్పుడూ వన్ ప్లస్ అంతర్జాతీయ మార్కెట్లలో అత్యంత కీలకమైన దేశంగా కొనసాగుతుంది. మా వినియోగదారులు, భాగస్వాములకు మేం ఇచ్చే నిబద్ధతలో ఎలాంటి మార్పు లేదు. భారతదేశంలో సరికొత్త ఆవిష్కరణలు తీసుకురావడానికి మేం నిరంతరం పెట్టుబడులు పెడుతూనే ఉంటాం.’ తమ ఉనికిని మరింత బలోపేతం చేసుకునేందుకు రాబోయే రోజుల్లో ‘వన్ ప్లస్ N6x’ లాంటి కొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ మోడళ్లను భారత మార్కెట్లోకి తీసుకురానున్నట్లు కూడా ఆయన వెల్లడించారు.
Also Read
- AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
- Independence Day TV Offers: బంపరాఫర్.. రూ.11,990కే స్మార్ట్ టీవీ..ఛాన్స్ మిస్ చేసుకోవద్దు!
- 4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
- 9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
UPDATE: OnePlus India has responded to the Bloomberg report about its exit from India in 2027.
“OnePlus India continues to operate its business as usual, with all local operations on track. We urge the media to exercise restraint before amplifying unverified speculation.” https://t.co/ah6lj04BBS
— TrakinTech (@TrakinTech) July 16, 2026
మరోవైపు.. ఒప్పోకు చెందిన ‘రియల్మీ’ చైనా మార్కెట్ నుంచి తప్పుకోవచ్చని, 2027 నాటికి వన్ ప్లస్ పునర్వ్యవస్థీకరణ భారతదేశానికి కూడా విస్తరించవచ్చని నివేదికలు చెబుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఆర్థిక ఇబ్బందులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆపిల్, శామ్సంగ్ కంపెనీల ఆధిపత్యం కారణంగా ఒప్పో తన గ్లోబల్ వ్యూహాలను మార్చుకుంటున్నట్లు సమాచారం. ఏదేమైనా.. ఈ మార్పులపై ఒప్పో ఇంకా అధికారికంగా స్పందించలేదు. కానీ వన్ ప్లస్ మాత్రం భారతదేశంలో తాము సుస్థిరంగా కొనసాగుతామని, మరిన్ని కొత్త ప్రొడక్ట్స్తో అలరిస్తామని భారతీయ వినియోగదారులకు స్పష్టమైన భరోసా ఇచ్చింది.
తాజావార్తలు
-
Parliament Monsoon Session: భయపడొద్దు, పారిపోవద్దు.. అమిత్ షా వస్తున్నాడు..
-
AP Investments : ఏపీకి భారీ పెట్టుబడుల జాతర.. రూ.2.08 లక్షల కోట్లకు SIPB గ్రీన్ సిగ్నల్.!
-
Abhijeet Dipke: త్వరలో జంతర్మంతర్-2 ప్రారంభం.. అభిజీత్ దిప్కే ప్రకటన
-
Police Lathi Testing: పోలీసుల “లాఠీ”లకు ఇన్ని పరీక్షలా.. మనుషుల్ని కొట్టి మరీ పరీక్షిస్తారా.?
-
Doctors Strike : జూనియర్ డాక్టర్ల సమ్మె.. ఏపీ సర్కార్కు వైద్యుల అల్టిమేటం.!
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..