Pro-Khalistan Elements Misusing Asylum Policy, India Tells UK: ఖలిస్తానీ వేర్పాటువాద నేత అమృత్ పాల్ సింగ్ కోసం ఇంకా వేట కొనసాగిస్తున్నారు పంజాబ్ పోలీసులు. ఈ విషయం తెలిసిన విదేశాల్లోని ఖలిస్తానీవాడులు భారత రాయబార కార్యాలయాలే టార్గెట్ గా దాడులకు తెగబడ్డాయి. ముఖ్యంగా యూకే, కెనడా, అమెరికా, ఆస్ట్రేలియాల్లో ఖలిస్తానీవాదులు భారత సార్వభౌమాధికారాన్ని సవాల్ చేస్తూ.. ఇండియన్ ఎంబసీ, కాన్సులేట్స్ పై దాడులు చేయడాన్ని భారత్ తీవ్రంగా ఆక్షేపిస్తోంది.
Punjab High Alert: పంజాబ్ పోలీసులు రాడికల్ ఖలిస్తానీ వేర్పాటువాద నేత అమృత్ పాల్ సింగ్ కోసం వేట కొనసాగిస్తున్నారు. అతడిని పట్టుకునేందుకు మార్చి 18న పంజాబ్ పోలీసులు, సెంట్రల్ టీమ్స్ ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించాయి. అప్పటి నుంచి అతడు తప్పించుకుని తిరుగుతున్నాడు. ఇదిలా ఉంటే పంజాబ్ పోలీసులపై అమృత్ పాల్ సింగ్ ఎఫెక్ట్ పడింది. ఏప్రిల్ 14 వరకు పోలీసులందరికీ సెలవులను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది
Amritpal Singh: ఖలిస్తానీ వేర్పాటువాద నేత, ‘వారిస్ పంజాబ్ దే’ చీఫ్ తప్పించుకుని తిరగుతున్న అమృత్ పాల్ సింగ్ విషయంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒక కుట్ర ప్రకారం ఇండియాలో ఖలిస్తానీ వేర్పాటువాదాన్ని ప్రోత్సహించేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇతడికి, ఇతని సన్నిహితులకు పాకిస్తాన్ గూఢాచర్య సంస్థ ఐఎస్ఐతో సంబంధం ఉన్నట్లు, విదేశాల్లోని ఖలిస్తానీ వేర్పాటువాద సంస్థల నుంచి ఆర్థిక సాయం అందినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు తేల్చాయి.
Himanta Biswa Sarma: అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మకు ఖలిస్తానీ ఉగ్రవాది నుంచి బెదిరింపులు ఎదురయ్యాయి. ఖలిస్తానీ ఉగ్రవాది, సిక్ ఫర్ జస్టిస్ సంస్థ నేత అయిన గురుపత్వంత్ సింగ్ పన్నూ బెదిరింపులకు పాల్పడ్డాడు. అస్సాం జర్నలిస్టులకు బెదిరింపు కాల్ చేసి, సీఎంను బెదిరించే ప్రయత్నం చేశారు. అస్సాంలో ఖైదీలుగా ఉన్న ఖలిస్తాన్ అనుకూల మద్దతుదారులు హింసించబడుతున్నారని, సీఎం శర్మ జాగ్రత్తగా వినండి.. ఇది ఖలిస్తాన్ అనుకూల సిక్కులు, భారత ప్రభుత్వానికి మధ్య పోరాటం అని…
Navjot Sidhu: 34 ఏళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో ఒకరి మరణానికి కారణం అయిన కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ 10 నెలల తర్వాత ఈ రోజు పాటియాలా జైలు నుంచి విడుదలయ్యారు. విడుదల కాగానే బీజేపీ, ప్రధాని మోదీ టార్గెట్ గా స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చాడు. ప్రజాస్వామ్యం సంకెళ్లలో ఉందని అంటూ విమర్శించారు. పంజాబ్ దేశానికి రక్షణ కవచం, ఈ దేశంలో నియంతృత్వం వచ్చినప్పుడు.. రాహుల్ గాంధీ నేతృత్వంలో విప్లవం వచ్చింది అంటూ సిద్ధూ…
ఖలిస్తాన్ వేర్పాటువాద నేత అమృతపాల్ సింగ్ పై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్లు 'హిందూ రాష్ట్రం' అనే పదాలను తరచుగా పల్లవిస్తుండటంతో వారిస్ పంజాబ్ డి చీఫ్ అమృతపాల్ సింగ్ ఖలిస్తాన్ గురించి మాట్లాడే ధైర్యం చేశారని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అన్నారు.
అమృత్ పాల్ సింగ్ కోసం పంజాబ్ రాష్ట్ర పోలీసులు వేట ముమ్మరం చేశారు. గురువారం డ్రోన్ కెమెరాతో రంగంలోకి దిగారు. హోషియార్ పూర్ జిల్లాలోని మర్నాయిన్ గ్రామంలో.. చుట్టుపక్కల ప్రాంతాల్లో డ్రోన్ తో గాలింపు చర్యలు చేపట్టారు.
Amritpal Singh:పరారీలో ఉన్న ఖలిస్తాన్ వేర్పాటువాద నేత అమృత్ పాల్ సింగ్ లొంగిపోయేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికే ఢిల్లీ నుంచి పంజాబ్ కు అతడు వచ్చినట్లు పోలీసుల వద్ద సమాచారం ఉంది. అమృత్ సర్ స్వర్ణ దేవాలయం వద్ద అమృత్ పాల్ సింగ్ లొంగిపోయేందుకు వస్తున్నట్టు సమాచారం. మార్చి 18న భారీ ఆపరేషన్ నిర్వహించిన పంజాబ్ పోలీసులు అతడిని పట్టుకునేందుకు గత 12 రోజులగా ప్రయత్నిస్తున్నారు. అయితే హర్యానా మీదుగా ఢిల్లీకి వెళ్లినట్లు తెలుస్తోంది.
Amritpal Singh: ఖలిస్తానీ వేర్పాటువాద నేత, ‘వారిస్ పంజాబ్ దే’ చీఫ్ అమృత్ పాల్ సింగ్ గత పది రోజులుగా తప్పించుకు తిరుగుతున్నాడు. పంజాబ్ లో ఖలిస్తానీ వేర్పాటువాదాన్ని పెంచి పోషించేందుకు దేశ అంతర్గత శక్తులతో కలిసి కుట్ర పన్నాడు. దీంతో పంజాబ్ పోలీసులు అతడిపై అతని అనుచరులపై భారీ ఆపరేషన్ నిర్వహించారు. ఇదిలా ఉంటే అతని అనచరులను ఇప్పటికే పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ అమృత్ పాల్ సింగ్ మాత్రం హర్యానా మీదుగా ఢిల్లీ…