Navjot Sidhu: రాహుల్ నేతృత్వంలో విప్లవం వచ్చింది.. జైలు నుంచి విడుదల కాగానే బీజేపీకి సిద్ధూ స్ట్రాంగ్ మెసేజ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Navjot Sidhu: 34 ఏళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో ఒకరి మరణానికి కారణం అయిన కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ 10 నెలల తర్వాత ఈ రోజు పాటియాలా జైలు నుంచి విడుదలయ్యారు. విడుదల కాగానే బీజేపీ, ప్రధాని మోదీ టార్గెట్ గా స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చాడు. ప్రజాస్వామ్యం సంకెళ్లలో ఉందని అంటూ విమర్శించారు. పంజాబ్ దేశానికి రక్షణ కవచం, ఈ దేశంలో నియంతృత్వం వచ్చినప్పుడు.. రాహుల్ గాంధీ నేతృత్వంలో విప్లవం వచ్చింది అంటూ సిద్ధూ కామెంట్స్ చేశారు.
Also Read
- Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
- Arunachal Pradesh: ‘‘అరుణాచల్ ప్రదేశ్ మాదే’’.. చైనా అభ్యంతరాలపై భారత్ స్ట్రాంగ్ రిఫ్లై..
- Pakistan: భారత్ నుంచి పాకిస్తాన్ను ‘‘బాగ్దాద్ ఒప్పందం’’ కాపాడలేదు.. ఇప్పుడు ‘‘ఇస్లామిక్ నాటో’’ పరిస్థితి కూడా అంతేనా?
- Rahul Gandhi: రాహుల్ గాంధీ, మహిళ ఫొటోపై బీజేపీ ప్రశ్నలు.. అసలు విషయం చెప్పిన కాంగ్రెస్
బీజేపీకి ప్రత్యర్థి ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధికారంలో ఉన్న రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్రం భావిస్తోందని ఆయన ఆరోపించారు. సిక్కు వేర్పాటువాద నేత అమృత్ పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసులు వెతుకుతున్న సందర్భంలో ఈయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అమృత్ పాల్ సింగ్ ప్రైవేట్ సైన్యం రాష్ట్రంలో సమస్యలు సృష్టించడానికి, శాంతిభద్రతలకు భంగం కలిగించడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. పంజాబ్లో రాష్ట్రపతి పాలన విధించేందుకు కుట్ర జరుగుతోందని, పంజాబ్ ను నిర్వీర్యం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ, ప్రతీ కాంగ్రెస్ కార్యకర్తతో కలిసి నేను గోడలా నిలుస్తానని అన్నారు.
పంజాబ్ ప్రజలను ఎందుకు మోసం చేశావని సీఎం భగవంత్ మాన్ ను ప్రశ్నించారు. ఎన్నికల ముందు పెద్దపెద్ద వాగ్థానాలు చేశారు, జోకులు పేల్చారు, కానీ మీరు ఇప్పుడు కాగితంపై మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారని ఆరోపించారు. గతేడాది పంజాబ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోయింది. ఆ తరువాత రోడ్ రేజ్ కేసులో సిద్ధూకు ఒక ఏడాది కఠిన కారాగార శిక్ష విధించింది కోర్టు. పంజాబ్ ఓటమి అనంతరం సిద్దూ తన పీసీసీ పదవికి రాజీనామా చేశారు.
తాజావార్తలు
-
Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
-
Arunachal Pradesh: ‘‘అరుణాచల్ ప్రదేశ్ మాదే’’.. చైనా అభ్యంతరాలపై భారత్ స్ట్రాంగ్ రిఫ్లై..
-
Raghunandan Rao: తెలంగాణలో రూ.200 కోట్ల సోలార్ స్కామ్.?.. రఘునందన్ రావు సంచలన ఆరోపణలు
-
Pocharam Srinivas Reddy: పోచారం సంచలన వ్యాఖ్యలు.. రేవంత్పై ఫైర్, బాన్సువాడలో మళ్లీ మనమే
-
Yashasvi Jaiswal: 29 టెస్టులు.. 29 వేదికలు.. ఇదెక్కడి వింత రికార్డు భయ్యా..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..