Navjot Sidhu: రాహుల్ నేతృత్వంలో విప్లవం వచ్చింది.. జైలు నుంచి విడుదల కాగానే బీజేపీకి సిద్ధూ స్ట్రాంగ్ మెసేజ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Navjot Sidhu: 34 ఏళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో ఒకరి మరణానికి కారణం అయిన కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ 10 నెలల తర్వాత ఈ రోజు పాటియాలా జైలు నుంచి విడుదలయ్యారు. విడుదల కాగానే బీజేపీ, ప్రధాని మోదీ టార్గెట్ గా స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చాడు. ప్రజాస్వామ్యం సంకెళ్లలో ఉందని అంటూ విమర్శించారు. పంజాబ్ దేశానికి రక్షణ కవచం, ఈ దేశంలో నియంతృత్వం వచ్చినప్పుడు.. రాహుల్ గాంధీ నేతృత్వంలో విప్లవం వచ్చింది అంటూ సిద్ధూ కామెంట్స్ చేశారు.
Also Read
- Karnataka: ఘోర విషాదం.. గుడికెళ్లి వస్తుండగా ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి
- Supreme Court: సుప్రీం కోర్టు పొదుపు మంత్రం.. ఇకపై వర్చువల్ విచారణకు ఆదేశం
- Iran-US Mediation: పాక్పై నమ్మకం లేదు.. ఇరాన్ యుద్ధంలో భారత్నే నమ్ముతున్న రష్యా
- Bhojshala Case: "భోజ్శాల హిందువులదే".. ఆలయం ఎలా మసీదుగా మారింది, చరిత్ర ఏం చెబుతోంది.?
బీజేపీకి ప్రత్యర్థి ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధికారంలో ఉన్న రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్రం భావిస్తోందని ఆయన ఆరోపించారు. సిక్కు వేర్పాటువాద నేత అమృత్ పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసులు వెతుకుతున్న సందర్భంలో ఈయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అమృత్ పాల్ సింగ్ ప్రైవేట్ సైన్యం రాష్ట్రంలో సమస్యలు సృష్టించడానికి, శాంతిభద్రతలకు భంగం కలిగించడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. పంజాబ్లో రాష్ట్రపతి పాలన విధించేందుకు కుట్ర జరుగుతోందని, పంజాబ్ ను నిర్వీర్యం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ, ప్రతీ కాంగ్రెస్ కార్యకర్తతో కలిసి నేను గోడలా నిలుస్తానని అన్నారు.
పంజాబ్ ప్రజలను ఎందుకు మోసం చేశావని సీఎం భగవంత్ మాన్ ను ప్రశ్నించారు. ఎన్నికల ముందు పెద్దపెద్ద వాగ్థానాలు చేశారు, జోకులు పేల్చారు, కానీ మీరు ఇప్పుడు కాగితంపై మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారని ఆరోపించారు. గతేడాది పంజాబ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోయింది. ఆ తరువాత రోడ్ రేజ్ కేసులో సిద్ధూకు ఒక ఏడాది కఠిన కారాగార శిక్ష విధించింది కోర్టు. పంజాబ్ ఓటమి అనంతరం సిద్దూ తన పీసీసీ పదవికి రాజీనామా చేశారు.
తాజావార్తలు
-
Karnataka: ఘోర విషాదం.. గుడికెళ్లి వస్తుండగా ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి
-
T20 Captain: భారత టీ20 కెప్టెన్గా కొత్త సారథి.. సంజూ శాంసన్కు అవకాశం..?
-
JioStar vs Zee: కోర్టుకెక్కిన బాలీవుడ్ సినిమాల వివాదం.. రూ.250 కోట్ల నష్టపరిహారం?
-
Supreme Court: సుప్రీం కోర్టు పొదుపు మంత్రం.. ఇకపై వర్చువల్ విచారణకు ఆదేశం
-
Iran-US Mediation: పాక్పై నమ్మకం లేదు.. ఇరాన్ యుద్ధంలో భారత్నే నమ్ముతున్న రష్యా
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!