Ashok Gehlot : ఖలిస్తాన్పై అమృతపాల్ ధైర్యం అదే.. కారణం చెప్పిన రాజస్థాన్ సీఎం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఖలిస్తాన్ వేర్పాటువాద నేత అమృతపాల్ సింగ్ పై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్లు ‘హిందూ రాష్ట్రం’ అనే పదాలను తరచుగా పల్లవిస్తుండటంతో వారిస్ పంజాబ్ డి చీఫ్ అమృతపాల్ సింగ్ ఖలిస్తాన్ గురించి మాట్లాడే ధైర్యం చేశారని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అన్నారు. దేశంలో మత రాజకీయాలు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి ఆరోపించారు. డివిజనల్ స్థాయి ఉద్యోగుల సదస్సులో గెహ్లాట్ మాట్లాడారు. “పంజాబ్లో అమృతపాల్లో కొత్త పేరు వచ్చింది. మోహన్ భగవత్, నరేంద్ర మోదీలు హిందూ రాష్ట్రం గురించి మాట్లాడగలిగితే, నేను ఖలిస్తాన్ గురించి ఎందుకు మాట్లాడకూడదు అని అమృతపాల్ సింగ్ అన్నారు. అతని ధైర్యం చూడండి. నువ్వు హిందూ రాష్ట్రం గురించి మాట్లాడినందుకే అతనికి ధైర్యం వచ్చిందా?” అని అన్నారు.
“అగ్నిని ప్రారంభించడం చాలా సులభం, కానీ దానిని ఆర్పడానికి సమయం పడుతుంది. ఇలా జరగడం దేశంలో మొదటిసారి కాదు. ఈ కారణంగానే ఇందిరా గాంధీ హత్యకు గురయ్యారు. ఖలిస్తాన్ను సృష్టించడానికి ఆమె అనుమతించలేదు” అని వ్యాఖ్యానించారు. దేశంలో మతం పేరుతో రాజకీయాలు జరుగుతున్నాయని అశోక్ గెహ్లాట్ అన్నారు. అయితే దేశ హితం కోసం అన్ని మతాలు, కులాలకు చెందిన వారిని వెంట తీసుకెళ్తే ఈ దేశం ఐక్యంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
Also Read:Priyanka Hugs Karan: కరణ్ జోహార్ను కౌగిలించుకున్న ప్రియాంక చోప్రా
Also Read
- Bengaluru: కన్నడ నటి ఇంట్లో వ్యాపారవేత్త మృతి.. మిస్టరీగా మారిన కేసు
- India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
- Ketan Agarwal Case: పెళ్లికి ముందు కేతన్ గురించి సియా ఏం చెప్పిందంటే..! తల్లిదండ్రులు కీలక వ్యాఖ్యలు
- Ketan Agarwal Case: సియా తండ్రికి గుండెపోటు.. కూతురిని ఉరితీయాలని ప్రకటన
కాగా, అమృతపాల్ కోసం పంజాబ్ పోలీసులు అన్వేషిస్తున్నారు. మార్చి 18 నుండి పరారీలో ఉన్నాడు. అమృత్పాల్ మద్దతుదారులు ఫిబ్రవరి 23న అమృత్సర్లోని అజ్నాలా పోలీస్ స్టేషన్ను ముట్టడించిన తర్వాత అతని సన్నిహితులలో ఒకరైన లవ్ప్రీత్ తూఫాన్ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ దాదాపు మూడు వారాలకు పైగా అణిచివేత జరిగింది. ఇటీవల తాను లొంగిపోవడం లేదంటూ అమృతపాల్ సింగ్ ఫుల్ ఓ వీడియో రిలీజ్ చేశాడు. పంజాబీ సిక్కుల కోసం ప్రత్యేక దేశాన్ని సాధించేదాక తన ఉద్యమాన్ని ఆపేది లేదంటూ ఆ వీడియోలో తెలిపాడు.
Also Read:Bride Pulls Off Gun: పాపం పెళ్లి కూతురు ఒకటి అనుకుంటే.. ఇంకోటి అయ్యింది..!
వారిస్ పంజాబ్ దే సంస్థ అధ్యక్షుడిగా ఉంటూ ప్రత్యేక దేశం పేరుతో అమృతపాల్ సింగ్ హింసను ప్రేరేపిస్తున్నాడని పోలీసులు ఆరోపిస్తున్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదులతో అంటకాగుతూ దేశద్రోహానికి పాల్పడుతున్నాడని పేర్కొన్నారు. ఈ క్రమంలో పంజాబ్, కేంద్ర ప్రభుత్వాలు అతడిని అరెస్ట్ చేసేందుకు రంగంలోకి దిగాయి. అయితే అమృతపాల్ సింగ్ రకరకాల మారు వేషాలతో పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్నాడు. ఖలిస్తాన్ సానుభూతిపరుడు అమృతపాల్ సింగ్ మార్చి 21న తూర్పు ఢిల్లీలోని మధు విహార్లో నడుస్తున్నట్లు చూపుతున్న కొత్త సీసీటీవీ ఫుటేజ్ బయటకొచ్చింది. అతను తలపాగా లేకుండా కనిపించాడు. అమృతపాల్ సింగ్ ఢిల్లీ, పంజాబ్, హర్యానా సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
తాజావార్తలు
-
Woman Constable: ఇదేం పద్దతి మేడం.. ఫిర్యాదు కోసం వచ్చిన వృద్ధుడి ఎదుట.. టేబుల్పై కాళ్లు పెట్టిన మహిళా కానిస్టేబుల్
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
-
Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
-
Women’s World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!