US War Cost in Iran: 108 రోజుల భీకర యుద్ధం.. అమెరికా ఎన్ని లక్షల కోట్లు నష్టపోయిందో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US War Cost in Iran: అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన తాజా శాంతి ఒప్పందంతో పశ్చిమాసియాలో గత 100 రోజులకు పైగా సాగుతున్న భీకర పోరాటానికి తెరపడింది. ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్లు జరిపిన దాడితో మొదలైన ఈ యుద్ధం వల్ల అగ్రరాజ్యం అమెరికాకు ఊహించని స్థాయిలో భారీ ఆర్థిక నష్టం వాటిల్లింది. దాదాపు 108 రోజుల పాటు సాగిన ఈ సైనిక చర్యల కోసం అమెరికా కేవలం రక్షణ రంగం పరంగానే సుమారు 113 బిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ. 10.67 లక్షల కోట్లు) ఖర్చు చేయాల్సి వచ్చింది.
సైనిక, రక్షణ వ్యయాల లెక్కలు:
అమెరికా రక్షణ శాఖ (పెంటగాన్) వెల్లడించిన వివరాల ప్రకారం.. యుద్ధం ప్రారంభమైన మొదటి ఆరు రోజుల్లోనే రికార్డు స్థాయిలో 11.3 బిలియన్ డాలర్లు ఖర్చయ్యాయి. అంటే సగటున రోజుకు 1.88 బిలియన్ డాలర్లు అన్నమాట. ఆ తర్వాత రోజువారీ యుద్ధ వ్యయం సగటున 1 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 9,447 కోట్లు) గా నమోదైంది. ఫిబ్రవరి 28 నుంచి జూన్ 16 వరకు జరిగిన పరిణామాల ఆధారంగా ఈ అంచనా వేశారు. యుద్ధం ప్రారంభ దశలోనే ఇరాన్కు చెందిన ‘షాహెద్’ డ్రోన్లను కూల్చివేయడానికి అమెరికా అత్యంత ఖరీదైన పేట్రియాట్ క్షిపణులను ప్రయోగించింది. ఇందులో ఒక్కో క్షిపణి ధర 40 లక్షల డాలర్లు. కేవలం క్షిపణులు, మందుగుండు సామాగ్రి కోసమే ప్రారంభంలోనే 25 బిలియన్ డాలర్లు ఖర్చయ్యాయి. వీటికి తోడు పర్షియన్ గల్ఫ్ రీజియన్లో భారీగా మోహరించిన సైనికుల నిర్వహణ కోసం రోజువారీ ఖర్చులు అదనంగా భరించాల్సి వచ్చింది.
Also Read
అమెరికాపై పడిన మొత్తం ఆర్థిక భారం:
పలువురు ఆర్థిక నిపుణులు, విమర్శకుల అభిప్రాయం ప్రకారం.. అధికారికంగా చూపించిన 113 బిలియన్ డాలర్ల సైనిక వ్యయం చాలా తక్కువ. ఇందులో అమెరికా పరోక్షంగా ఎదుర్కొన్న ఆర్థిక నష్టాలను సైతం కలిపితే మొత్తం భారం 1 ట్రిలియన్ డాలర్ల (రూ.9.43 లక్షల కోట్లు) కు చేరుకుంటుంది. యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు విపరీతంగా పెరగడంతో కేవలం అమెరికా పౌరులే దాదాపు 40 బిలియన్ డాలర్ల అదనపు భారాన్ని మోయాల్సి వచ్చింది. అయితే, డెమొక్రాటిక్ నాయకులు, ప్రముఖ ఆర్థికవేత్తల అంచనా ప్రకారం.. అమెరికా ఆర్థిక వ్యవస్థకు, అక్కడి ప్రజలకు జరిగిన అసలు నష్టం 630 బిలియన్ డాలర్ల నుంచి 1 ట్రిలియన్ డాలర్ల వరకు ఉండవచ్చని తెలుస్తోంది.
ఇరాన్కు భారీ పరిహారం:
ఈ శాంతి ఒప్పందంలో అత్యంత కీలకమైన అంశం ఇరాన్కు చెల్లించాల్సిన నష్టపరిహారం. యుద్ధంలో ఇరాన్ వ్యాప్తంగా ధ్వంసమైన మౌలిక సదుపాయాలు, చమురు శుద్ధి కర్మాగారాలు (రిఫైనరీలు), పవర్ గ్రిడ్ల పునర్నిర్మాణం కోసం సుమారు 300 బిలియన్ డాలర్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఒప్పందం ప్రకారం ఈ 300 బిలియన్ డాలర్ల మొత్తాన్ని ఇరాన్కు ఇవ్వడానికి అమెరికా అంగీకరించింది. అయితే ఈ నిధులు గల్ఫ్ దేశాల (మిత్రదేశాల) నుంచి వస్తాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. దీనితో పాటు, విదేశాల్లో ఫ్రీజ్ చేసిన ఇరాన్ ఆస్తులను సైతం పూర్తిగా విడుదల చేయనున్నారు. ఏదేమైనా, ఈ యుద్ధం వల్ల అటు పశ్చిమాసియా ఛిన్నాభిన్నమవ్వడమే కాకుండా, ఇటు అమెరికా ఆర్థిక వ్యవస్థకు కూడా కోలుకోలేని దెబ్బ తగిలిందని స్పష్టమవుతోంది.
తాజావార్తలు
-
Ram Temple donation theft: అఖిలేష్ యాదవ్తో రామ మందిర చోరీ నిందితుడికి సంబంధాలు.?
-
Mohammad Kaif: ప్రమాదంలో టీమిండియా బ్యాటింగ్.. ముందు ఆ ‘వైభవ్’ను తీసేయండి..
-
Naga Vamsi: పర్సంటేజ్ సిస్టమ్ వెనుక కుట్ర! థియేటర్ల మోసాలను బయటపెట్టిన నిర్మాత నాగవంశీ..
-
Gardening Tips : మీ గులాబీ మొక్కలు వాడిపోతున్నాయా? మీరు చేసే ఈ 4 తప్పులే దానికి కారణం!
-
CM Yogi Adityanath: భారత ఆత్మకు శ్రీరాముడే మూలం..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో వచ్చే రోగాలకు బై..బై.. 5 అద్భుతమైన ఇంటి చిట్కాలు.!
-
IND Playing XI vs ENG: మూడో టీ20లో ఈ ముగ్గురు ఔట్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!
-
Ellyse Perry: లార్డ్స్లో ఇంగ్లండ్ను ఓడించాం.. ఆ మజానే వేరప్ప.. ఆస్ట్రేలియా అందం ఆనందం!
-
డ్యూయల్ 200MP కెమెరాలు, 8500mAh బ్యాటరలతో ఎంట్రీ ఇవ్వనున్న Xiaomi 18 Pro Max..!
-
Akriti Agarwal: చాలాసార్లు మోసపోయా.. ప్రతి రూమర్ నిజమే.. పృథ్వీ షా కాబోయే భార్య సంచలన వ్యాఖ్యలు!