రోజురోజుకు సైబర్ నేరగాళ్ల ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో ఓ వ్యక్తి సైబర్ నేరగాళ్ల వలలో పడి దాదాపుగా రూ.లక్ష నగదును పోగొట్టుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే… జీడిమెట్లకు చెందిన చంద్రమోహనేశ్వర్రెడ్డి కుమార్తె అమెరికాలో ఉన్నత చదువులను అభ్యసిస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా నుంచి కొన్ని పేపర్లను ఫెడెక్స్ కొరియర్ ద్వారా పంపించింది. అయితే తన కుమార్తె పేపర్లు పంపి చాలా రోజులు గడుస్తున్నా… ఇంకా పేపర్లు తనకు చేరకపోవడంతో గూగుల్లో కొరియర్ సంస్థ కస్టమర్ కేర్…
అమెరికాలో మరోసారి తుపాకీ పేలింది. న్యూఇయర్ వేడుకల్లో దుండగులు కాల్పుడు జరిపారు. న్యూఇయర్ వేడుకలకు వచ్చిన దుండగులు వేడుకలను మొదలైన కాసేపటికి కాల్పులు జరిపారు. ఒక్కసారి తుపాకీ పేలిన శబ్దం వినడంతో వేడుకల్లో ఉన్న జనం పరుగులు పెట్టారు. అమెరికాలోని మిసిసిపీ గల్ఫ్పోర్ట్లో నిర్వహించిన నూతన సంవత్సరం వేడుకల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. దుండగుల కాల్పుల్లో మగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. అంతేకాకుండా మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.…
క్యాస్టింగ్ కౌచ్పై ప్రముఖ యాంకర్ లాస్య మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. అమెరికాలో తనకు వికృత అనుభవం ఎదురైందని.. ఓ ఈవెంట్ కోసం అమెరికా వెళ్లిన తనను ఓ వ్యక్తి తనతో పడుకోమని అడిగాడని ఆరోపించింది. చాలా ఉన్నతమైన స్థాయిలో న్యూ జెర్సీలో స్థిరపడిన ఓ వ్యక్తి తనకు ఫోన్ చేసి చాలా పచ్చిగా అడిగాడని.. కానీ తాను కుదరదు అని చెప్పేశానని లాస్య తెలిపింది. ‘నాతో పెద్దపెద్ద యాంకర్లే పడుకున్నారు.. నువ్వెంత?’ అంటూ ఆ వ్యక్తి…
అమెరికా వంటి దేశాలలో మన తెలుగు వారు చాలా కీలకపాత్ర పోషిస్తున్నారు. అమెరికాలో తెలుగువారు లేని రాష్ట్రం లేదంటే అతిశయోక్తి లేదు. అమెరికాకు భారతీయురాలు ఉపాధ్యక్షురాలు కావడం అంటే మన దేశం ప్రజల ప్రాముఖ్యత ఏమిటో అర్థమవుతుంది. మన తెలుగు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా మాతృ దేశానికి సేవలు చేస్తున్నారు. ఆటా సంస్థ సేవా కార్యక్రమాలు అభినందనీయం అన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఎక్కడ ఏం సంపాదించినా చివరకు మిగిలేది చేసే సేవా కార్యక్రమాలు మాత్రమే. ప్రజలకు…
ఎలాన్ మస్క్ కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ వాహనాల్లో కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. ఈవీ వాహనాలు రన్నింగ్లో వున్నప్పుడు వీడియో గేమ్స్,డ్యాష్ బోర్డ్ స్ర్కీన్స్ వాడకంపై ఆంక్షలు విధించింది. ఇవి వాడడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, అందుకే కార్లు నడుస్తున్నప్పుడు వీటిని తాత్కాలికంగా ఆపేలా టెక్నాలజీ తీసుకువస్తోంది. అమెరికాకి చెందిన నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టే అడ్మినిస్ట్రేషన్ (ఎన్హెచ్ టీఎస్ఏ)తో జరిగిన ఒప్పందం ప్రకారం పాసింజర్ ప్లే గేమ్ వల్ల ప్రమాదాలు సంభవిస్తున్నాయని, దీనిని నిషేధించాలని నిర్ణయానికి…
అమెరికాలో ఒమిక్రాన్ కారణంగా మొదటి మరణం నమోదైంది. టెక్సాస్ లోని హారిస్ కౌంటి లో సోమవారం ఓ వ్యక్తి మరణించినట్లు కౌంటీ ఆరోగ్య శాఖ పేర్కొంది. అయితే.. సదరు వ్యక్తి ఇప్పి వరకు టీకా తీసుకోలేదని.. అతని వయసు 50 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉంటుందని తెలుస్తుంది. ఇప్పటికే రెండు సార్లు కరోనా బారీన అతడు పడినట్లు సమాచారం అందుతోంది. ఇక ఒక మరణం సంభవించడంతో… అమెరికా అప్రమత్తమైంది. అటు.. యూకేలో ఒమిక్రాన్ మరణాల సంఖ్య…
అమెరికా లోని లాస్ ఏంజిల్స్ లో జరిగిన ఒక మ్యూజిక్ లైవ్ షూ లో దారుణం చోటు చేసుకోంది. మరి కొద్దిసేపట్లో స్టేజిపైకి రావాల్సిన ర్యాపర్ ని కొంతమంది గుర్తు తెలియని దుండగులు కిరాతకంగా కత్తితో పొడిచి పొడిచి హతమార్చారు. స్థానికంగా ఈ ఘటన సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే.. ‘ర్యాపర్ డ్రాకియో ద రూలర్’గా పేరుగాంచిన 28 ఏళ్ళ యువకుడు ఇటీవల్ ఒక మ్యూజిక్ కాన్సర్ట్ ని ఏర్పాటు చేశాడు. సంగీత అభిమానులందరూ ఆ ప్రాగణంలోకి…
టెస్లా అధినేత ఎలన్ మస్క్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంపన్నుల జాబితాలో ఆయన ఒకరు. ఈ మేరకు ఆయన ఏడాదికి ఎంత పన్ను కడతారో తెలుసుకోవాలని చాలా మందికి ఆసక్తి ఉంటుంది. ఈ నేపథ్యంలో తాను ఈ ఏడాది 11 బిలియన్ డాలర్లను పన్నుగా చెల్లించనున్నట్లు ఎలన్ మస్క్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. భారత కరెన్సీలో ఆయన కట్టే పన్ను విలువ రూ.85వేల కోట్లు అన్నమాట. దీంతో అమెరికా…
అమెరికాలోని ఫ్లోరిడాలో విచిత్రం చోటుచేసుకుంది. ఫోర్ట్ లౌడెర్డేల్ విమానాశ్రయం నుంచి విమానం బయలుదేరేందుకు సిద్ధంగా ఉన్న సమయంలో ఓ ప్రయాణికుడు కొంటెపనికి పాల్పడ్డాడు. విమానం టేకాఫ్కు సిద్ధమవుతున్న సమయంలో ఆడమ్ జేన్ (38) అనే వ్యక్తి మహిళ అండర్వేర్ను మాస్కుగా ధరించడాన్ని చూసి విమాన సిబ్బంది ఆశ్చర్యపోయారు. దానిని తొలగించి సాధారణ మాస్కు ధరించాలని కోరారు. అందుకు ఆడమ్ జేన్ నిరాకరించారు. Read Also: అలర్ట్: చలికాలంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి విమాన సిబ్బంది ఎంత చెప్పినా…
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. సౌతాఫ్రికాలో వెలుగు చూసి క్రమంగా అన్ని దేశాలను చుట్టేస్తోంది.. అగ్రరాజ్యం అమెరికా ఒమిక్రాన్ బారినపడిపోయింది.. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదు అవుతున్నాయి.. 36 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ పాజిటివ్ కేసులను గుర్తించింది అమెరికా.. ఈ నేపథ్యంలో ఆ దేశ పౌరులకు వార్నింగ్ ఇచ్చారు అధ్యక్షుడు జో బైడెన్.. శీతాకాలంలో మహమ్మారి మరణాలు, తీవ్ర అస్వస్ధతతో ఆస్పత్రిలో చేరేవారి సంఖ్య పెరిగిపోవచ్చునని ఆందోళన వ్యక్తం చేసిన ఆయన.. ఇప్పటి వరకు వ్యాక్సిన్…