3 Indians Died in USA: మంచులో కూరుకుపోయి ముగ్గురు భారతీయుల మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
3 Indians Died in USA: అమెరికాలో ‘బాంబ్ సైక్లోన్’ వణికిస్తోంది. మంచు తుఫాన్ ధాటికి ఇప్పటికే అక్కడ 60 మందికి పైగా మరణించారు. తూర్పు రాష్ట్రాలు ఈ మంచు తుఫాన్ ధాటికి తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి. ముఖ్యంగా న్కూయార్క్ స్టేట్ లో మనుషులు బయటకు వెళ్లే పరిస్థితి లేదు. ఇదిలా ఉంటే మంచు తుఫాన్ ధాటికి ముగ్గురు భారతీయులు మరణించడం విషాదాన్ని నింపింది. ఇందులో ఇద్దరు తెలుగు దంపతులు ఉన్నారు.
Read Also: PM Modi Mother Hiraba: మోడీ తల్లికి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
Also Read
అరిజోనాలో వుడ్స్ కాన్యన్ లేక్ వద్ద ముగ్గురు భారతీయులు మరణించారు. సరస్సులో గడ్డ కట్టిన మంచుపై నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో మంచు పగిలిపోవడంతో నీటిలో మునిగిపోయారు. ముగ్గురు సెంట్రల్ అరిజోనా నగరం అయిన సేసన్ నుంచి 30 మైళ్ల దూరంలోని వుడ్స్ కాన్యన్ సరస్సుకు వచ్చారు. ఈ ప్రమాదంలో మరణించిన బాధితులను నారాయణ ముద్దన(49), గోకుల్ మెడిసేటి, (47), హరిత ముద్దనగా కోకోనినో కౌంటీ షెరీఫ్ కార్యాలయం గుర్తించింది. మృతులంతా అరిజోనాలోని చాండ్లర్ లో నివసిస్తున్నారు. సోమవారం రాత్రి హరిత ముద్దన మృతదేహాన్ని అధికారులు గుర్తించారు.
ఫైర్ డిపార్ట్మెంట్ సిబ్బంది చల్లటి నీటిలో చిక్కకుపోయిన మహిళలను బయటకు తీసి ప్రాణాలు రక్షించేందుకు సీపీఆర్ నిర్వహించారు. అయినా కూడా ప్రాణాలు దక్కలేదు. మంగళవారం మొత్తం ముగ్గురిని గుర్తించి బయటకు తీశారు. ఈ ఏడాది జూన్ నెలలో నారాయణ ముద్దన-హరిత దంపతులు స్వగ్రామం అయిన గుంటూరు జిల్లాలోని పెదనందిపాడు మండలం పాలమర్రుకు వచ్చి వెళ్లారు. ప్రమాదంలో వీరిద్దరు చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
తాజావార్తలు
-
Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
-
Dragon Update: ‘డ్రాగన్’ డెడ్లైన్ మిస్సైతే..!
-
KAAKA: రూమర్స్కి చెక్మెట్.. సంక్రాంతి బరిలో చిరంజీవి ‘కాక’ ఫిక్స్.!
-
Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
-
CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్నాథ్, యోగితో కలిసి..
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!