భారతదేశానికి చెందిన సర్గం కౌశల్ మిసెస్ వరల్డ్ 2022గా గెలిచి 21 సంవత్సరాల తర్వాత తిరిగి కిరీటాన్ని తెచ్చిపెట్టింది. లాస్ వెగాస్లో జరిగిన గాలా ఈవెంట్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సర్గమ్ కౌశల్ ఈ రోజు మిసెస్ వరల్డ్ కిరీటాన్ని పొందారు.
U19 T20 World Cup: అండర్ 19 మహిళల టీ20 ప్రపంచకప్ వచ్చే నెల 14న దక్షిణాఫ్రికాలో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అండర్ 19 మహిళల ప్రపంచకప్ కోసం అమెరికా 15 మంది సభ్యులతో తన టీమ్ను ప్రకటించింది. అయితే అమెరికా టీమ్ను చూసిన వాళ్లంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అమెరికా టీమ్లో అందరూ భారత సంతతి అమ్మాయిలే ఉన్నారు. మరో విశేషం ఏంటంటే.. ఈ టీమ్లో కెప్టెన్ గీతిక కొడాలి, వైస్ కెప్టెన్…
గత నెలలో ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులతో జరిగిన ఎన్కౌంటర్ తర్వాత భద్రతా దళాలు అమెరికాలో తయారు చేసిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నాయని పోలీసులు ఆదివారం తెలిపారు. నవంబర్ 26న మిర్టూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పొమ్రా అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులను భద్రతా బలగాలు హతమార్చాయని ఒక అధికారి తెలిపారు.
సామూహిక హత్యలు జరిగే దేశాల జాబితాలో వరుసగా మూడోసారి పాకిస్థాన్ అగ్రస్థానంలో నిలిచినట్లు యూఎస్ థింక్ ట్యాంక్ ఎర్లీ వార్నింగ్ ప్రాజెక్ట్ తాజాగా అంచనా వేసింది. తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్(టీటీపీ) ద్వారా పెరుగుతున్న హింసతో సహా పలు భద్రత, మానవ హక్కుల సవాళ్లను పాకిస్థాన్ ఎదుర్కొంటుందని ఎర్లీ వార్నింగ్ ప్రాజెక్ట్ తన 28 పేజీల నివేదికలో పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదులు కలకలం రేపుతున్నాయి.. విజయవాడలోని అక్కినేని ఉమెన్స్ హాస్పిటల్పై ఈడీ రైడ్స్ కొనసాగుతున్నాయి.. ఆస్పత్రిలోపలికి ఎవరూ వెళ్లకుండా సెక్యూరిటీగా సీఆర్పీఎఫ్ సిబ్బందిని ఉంచారు.. ఆస్పత్రి ఫోన్లను స్వాధీనం చేసుకున్న ఈడీ అధికారులు.. ఆస్పత్రి ఛైర్మన్ తో సహా సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు.. ఈ దాడుల్లో మొత్తం 8 మంది ఈడీ అధికారులు పాల్గొన్నట్టుగా తెలుస్తోంది.. అమెరికాలో వైద్యురాలుగా ఉంటూ 21-08-2022 విజయవాడలో అక్కినేని ఉమెన్స్ ఆసుపత్రిని ప్రారంభించారు అక్కినేని మణి.. ఇక, ఈ ఆస్పత్రి…
మోనోపోలీ గేమ్లో తీవ్ర వాగ్వాదం జరిగిన తర్వాత అమెరికాలో ఓ వ్యక్తి కుటుంబ సభ్యులపై కాల్పులకు తెగబడ్డాడు. మారణాయుధంతో దాడి చేసినందుకు అతడిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఆర్టెమిస్-1 యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది.నాసా ఓరియన్ అంతరిక్ష నౌకను శుక్రవారం చంద్ర కక్ష్యలో ఉంచినట్లు అధికారులు తెలిపారు, చాలా ఆలస్యం అయిన మూన్ మిషన్ విజయవంతంగా కొనసాగుతోందని వెల్లడించారు.