ఎలాన్ మస్క్ కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ వాహనాల్లో కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. ఈవీ వాహనాలు రన్నింగ్లో వున్నప్పుడు వీడియో గేమ్స్,డ్యాష్ బోర్డ్ స్ర్కీన్స్ వాడకంపై ఆంక్షలు విధించింది. ఇవి వాడడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, అందుకే కార్లు నడుస్తున్నప్పుడు వీటిని తాత్కాలికంగా ఆపేలా టెక్నాలజీ తీసుకువస్తోంది. అమెరికాకి చెందిన నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టే అడ్మినిస్ట్రేషన్ (ఎన్హెచ్ టీఎస్ఏ)తో జరిగిన ఒప్పందం ప్రకారం పాసింజర్ ప్లే గేమ్ వల్ల ప్రమాదాలు సంభవిస్తున్నాయని, దీనిని నిషేధించాలని నిర్ణయానికి…
అమెరికాలో ఒమిక్రాన్ కారణంగా మొదటి మరణం నమోదైంది. టెక్సాస్ లోని హారిస్ కౌంటి లో సోమవారం ఓ వ్యక్తి మరణించినట్లు కౌంటీ ఆరోగ్య శాఖ పేర్కొంది. అయితే.. సదరు వ్యక్తి ఇప్పి వరకు టీకా తీసుకోలేదని.. అతని వయసు 50 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉంటుందని తెలుస్తుంది. ఇప్పటికే రెండు సార్లు కరోనా బారీన అతడు పడినట్లు సమాచారం అందుతోంది. ఇక ఒక మరణం సంభవించడంతో… అమెరికా అప్రమత్తమైంది. అటు.. యూకేలో ఒమిక్రాన్ మరణాల సంఖ్య…
అమెరికా లోని లాస్ ఏంజిల్స్ లో జరిగిన ఒక మ్యూజిక్ లైవ్ షూ లో దారుణం చోటు చేసుకోంది. మరి కొద్దిసేపట్లో స్టేజిపైకి రావాల్సిన ర్యాపర్ ని కొంతమంది గుర్తు తెలియని దుండగులు కిరాతకంగా కత్తితో పొడిచి పొడిచి హతమార్చారు. స్థానికంగా ఈ ఘటన సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే.. ‘ర్యాపర్ డ్రాకియో ద రూలర్’గా పేరుగాంచిన 28 ఏళ్ళ యువకుడు ఇటీవల్ ఒక మ్యూజిక్ కాన్సర్ట్ ని ఏర్పాటు చేశాడు. సంగీత అభిమానులందరూ ఆ ప్రాగణంలోకి…
టెస్లా అధినేత ఎలన్ మస్క్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంపన్నుల జాబితాలో ఆయన ఒకరు. ఈ మేరకు ఆయన ఏడాదికి ఎంత పన్ను కడతారో తెలుసుకోవాలని చాలా మందికి ఆసక్తి ఉంటుంది. ఈ నేపథ్యంలో తాను ఈ ఏడాది 11 బిలియన్ డాలర్లను పన్నుగా చెల్లించనున్నట్లు ఎలన్ మస్క్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. భారత కరెన్సీలో ఆయన కట్టే పన్ను విలువ రూ.85వేల కోట్లు అన్నమాట. దీంతో అమెరికా…
అమెరికాలోని ఫ్లోరిడాలో విచిత్రం చోటుచేసుకుంది. ఫోర్ట్ లౌడెర్డేల్ విమానాశ్రయం నుంచి విమానం బయలుదేరేందుకు సిద్ధంగా ఉన్న సమయంలో ఓ ప్రయాణికుడు కొంటెపనికి పాల్పడ్డాడు. విమానం టేకాఫ్కు సిద్ధమవుతున్న సమయంలో ఆడమ్ జేన్ (38) అనే వ్యక్తి మహిళ అండర్వేర్ను మాస్కుగా ధరించడాన్ని చూసి విమాన సిబ్బంది ఆశ్చర్యపోయారు. దానిని తొలగించి సాధారణ మాస్కు ధరించాలని కోరారు. అందుకు ఆడమ్ జేన్ నిరాకరించారు. Read Also: అలర్ట్: చలికాలంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి విమాన సిబ్బంది ఎంత చెప్పినా…
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. సౌతాఫ్రికాలో వెలుగు చూసి క్రమంగా అన్ని దేశాలను చుట్టేస్తోంది.. అగ్రరాజ్యం అమెరికా ఒమిక్రాన్ బారినపడిపోయింది.. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదు అవుతున్నాయి.. 36 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ పాజిటివ్ కేసులను గుర్తించింది అమెరికా.. ఈ నేపథ్యంలో ఆ దేశ పౌరులకు వార్నింగ్ ఇచ్చారు అధ్యక్షుడు జో బైడెన్.. శీతాకాలంలో మహమ్మారి మరణాలు, తీవ్ర అస్వస్ధతతో ఆస్పత్రిలో చేరేవారి సంఖ్య పెరిగిపోవచ్చునని ఆందోళన వ్యక్తం చేసిన ఆయన.. ఇప్పటి వరకు వ్యాక్సిన్…
అమెరికన్ సింగర్ బిల్లీ ఎలిష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘ఓసియన్ ఐస్’, ‘బ్యాడ్ గాయ్’, ‘వెన్ ది పార్టీ ఇస్ ఓవర్’ పాటలతో ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకొని ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఇండియా లో ఎక్కడ విన్నా ఈమె పాటలే వినిపిస్తున్నాయి అంటే అతిశయోక్తి కాదు. ఇక తాజాగా బిల్లీ ఎలిష్ ఒక ఇంటర్వ్యూ లో శృంగారంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది. శృంగార వీడియోలు చూడడంలో తప్పు లేదు.. వాటిని…
సౌతాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ క్రమంగా అన్ని దేశాలను చుట్టేస్తోంది. ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికాను కూడా టెన్షన్ పెడుతోంది ఒమిక్రాన్.. యూఎస్లో శరవేగంగా ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే దాదాపు 30 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ వేరియంట్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.. మరోవైపు.. కరోనా మహమ్మారి అగ్రరాజ్యాన్ని అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే కాగా.. ఇప్పటి వరకు నమోదైన కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 50 మిలియన్లు దాటింది… ఈ విషయాన్ని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ…
అమెరికాలో టోర్నడోలు బీభత్సం సృష్టిస్తున్నాయి. సుడిగాలుల తరహాలో విరుచుకుపడే టోర్నడోల కారణంగా కెంటకీ అనే ప్రాంతంలో ఇప్పటికే 100మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని కెంటకీ రాష్ట్ర గవర్నర్ ఆండీ బెషిర్ వెల్లడించారు. కెంటకీ చరిత్రలోనే ఇది అత్యంత బీభత్సమైన టోర్నడో అని గవర్నర్ తెలిపారు. ఒక్క మేఫీల్డ్ నగరంలోనే కొవ్వత్తుల పరిశ్రమ పైకప్పు కూలి దాదాపు 50 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. Read Also: పాముతో పరాచకాలాడితే ఇలాగే…
అమెరికాలోని మిచిగాన్ రాష్ట్రంలో కాల్పులు కలకలం సృష్టించాయి. డెట్రాయిట్ నగరానికి సమీపంలోని ఓ పాఠశాలలో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో పాఠశాలలోని ముగ్గురు విద్యార్థులు మరణించారు. ఈ ఘటనలో ఓ టీచర్ సహా మరో ఏడుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. Read Also: ఇండో-పాక్ సరిహద్దుకు అమిత్షా సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు పాఠశాలను చుట్టుముట్టారు. అనంతరం 15 ఏళ్ల అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి ఓ తుపాకీని, 15-20 రౌండ్ల బుల్లెట్లను స్వాధీనం…