అమరావతి రాజధాని భూముల కుంభకోణంలో అధికారుల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. మాజీ ఐఏఎస్ సాంబశివరావు, ఐఏఎస్సులు కాంతిలాల్ దండే, కోన శశిధర్లూ అక్రమాలకు సహకరించారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంతిలాల్ దండే, కోన శశిధర్ సీఐడీ విచారణ ఎదుర్కొనే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. రికార్డులను ట్యాంపర్ చేశారని.. తుళ్లూరు మండలంలో అసైన్డ్ రికార్డులను మాయం చేశారని అధికారులపై అభియోగాలు ఉన్నాయి. read also : రూ.879 కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత ఇప్పటికే సీఐడీకి…
నాడు- నేడు పథకంలో భాగంగా అభివృద్ధి చేస్తున్న మౌలిక సదుపాయాల నిర్వహణపై గైడ్ లైన్స్ విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం… ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రులు, అంగన్వాడీ కేంద్రాల్లో గత స్థితి, ఇప్పటి పరిస్థితుల ఫోటోలను ప్రదర్శించాలని సూచించారు.. దీని కోసం పీవీసీ బ్యానర్లు వినియోగించవద్దని స్పష్టం చేసింది సర్కార్.. పాఠశాల, ఉన్నత విద్యాశాఖ, వైద్యారోగ్యశాఖ, సాంఘిక సంక్షేమం, పురపాలక, మహిళా సంక్షేమం తదితర శాఖలు అభివృద్ధి చేసిన మౌలిక సదుపాయాల నిర్వహణకు గైడ్ లైన్స్ విడుదల చేశారు..…
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రారంభం కాబోతున్నది. ముఖ్యమంత్రి సీఎం జగన్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనున్నది. ఈ సమావేశంలో కీలక విషయాలపై చర్చించబోతున్నారు. తెలంగాణతో ఉన్న జలవివాదం గురించి ముఖ్యంగా చర్చించే అవకాశం ఉన్నది. పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకంపై కూడా చర్చించే అవకాశం ఉన్నది. ఏపీలో ప్రాజెక్టులు అక్రమంగా నిర్మిస్తున్నారని తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఎంతో కాలంగా రెండు రాష్ట్రాల మధ్య జలవివాదం నడుస్తున్నది. …
ఆనందయ్య మందును పంపిణీ చేసేందుకు ఏపీ హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తక్షణమే కరోనా బాదితులకు మందును పంపిణీ చేయాలని ఆదేశించింది. ఇక కంటి చుక్కల మందుపై రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 21 వ తేదీకి వాయిదా వేసింది హైకోర్ట్. ఇక ఇదిలా ఉంటే, ఇప్పటికే ఆనందయ్య మందును ఈరోజు నుంచి పంపిణీ చేస్తున్నారు. మొదటగా సర్వేపల్లి నియోజక వర్గంలోని ప్రజలకు అందించబోతున్నారు. ఆ…
మరో రెండు వారాల పాటు కర్ఫ్యూ పొడిగించే ఆలోచనలో ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఈ నెల 31వ తేదీన రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులపై సమీక్ష నిర్వమించనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఈ సమీక్షా సమావేశంలోనే కర్ఫ్యూ పొడగింపుపై నిర్ణయం తీసుకుంటారు. కొన్ని రోజులుగా ఉభయగోదావరి, చిత్తూరు జిల్లాలు మినహా మిగతా జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి.. మే 31 తర్వాత క్రమంగా కొన్ని మినహాయింపులు ఇవ్వడం లేదా యథాస్థితిని కొనసాగించడమా? అనే దానిపై సోమవారం…
ఆంధ్రప్రదేశ్లో కరోనా నివారణ కోసం గ్రూప్ అఫ్ మినిస్టర్స్ సమావేశం అయ్యారు.. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం ఆళ్ల నాని అధ్యక్షతన జరిగిన జీఎంవో సమావేశానికి మంత్రులు బొత్స సత్యనారాయణ, మేకతోటి సుచరిత, కన్నబాబు, ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనిల్ కుమార్ సింఘాల్, డీజీపీ, ఇతర అధికారులు హాజరయ్యారు.. కరోనా నియంత్రణ, బ్లాక్ ఫంగస్ నివారణకు తీసుకోవలసిన చర్యలు, వ్యాక్సిన్, ఆక్సిజన్ బెడ్స్, బ్లాక్…
కరోనా కల్లోలం సమయంలో నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య పంపిణీ చేసిన కరోనా మందు.. ఎంతో మందికి నయం చేసిందని చెబుతున్నారు.. అయితే, దీనిపై అధ్యయనం చేసేందుకు మందు పంపిణీని నిలిపివేసింది ప్రభుత్వం.. ఓవైపు దీనిపై అధ్యయనం జరుగుతుండగా.. మరోవైపు.. ఆనందయ్య కరోనా మందు పంపిణీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టులో రెండు హౌస్ మోషన్ పిటిషన్లు దాఖలు అయ్యాయి.. అయితే, ఆ రెండు పిటిషన్ల విచారణకు హైకోర్టు అనుమతించింది.. ఈ నెల 27న విచారణ చేపట్టనుంది…
టిడిపి అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణకు దిమ్మతిరిగే షాక్ తగిలింది.అసైన్డ్ భూముల జీవో కేసులో చంద్రబాబుపై మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేయాలంది సీఐడీ. ఈ మేరకు హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది సీఐడీ. అమరావతిలో అసైన్డ్ భూముల కోసం చట్ట వ్యతిరేకంగా జీఓ 41 తీసుకువచ్చారన్న సీఐడీ..ఈ జీవో ఏపీ అసైన్డ్ భూముల బదిలీ నిషేధ చట్టం, ఏపీ సీఆర్డీఏ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నదని పేర్కొంది. చంద్రబాబు పిటిషన్ కొట్టేయాలని కోరింది సీఐడీ. అసైన్డ్ భూముల విషయంలో…