Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Senior Journalist Telakapalli Ravi Analysis By Amaravati Land Scam Case

తెలకపల్లి రవి: అమరావతి భూముల కేసు.. హైకోర్టులోనే విచారణకు ప్రభుత్వ మొగ్గు

Published Date :July 14, 2021 , 10:15 pm
By ramakrishna
తెలకపల్లి రవి: అమరావతి భూముల కేసు.. హైకోర్టులోనే విచారణకు ప్రభుత్వ మొగ్గు
  • Follow Us :
  • google news
  • dailyhunt

చంద్రబాబు ప్రభుత్వ హయాంలో అమరావతి భూముల ఇన్‌సైడ్‌ట్రేడిరగ్‌ జరిగిందనే ఆరోపణలను కోర్టులు కొట్టివేశాయనే ప్రచారం జరుగుతున్నా వాస్తవంలో అవి ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఇందుకు సంబంధించి మాజీ అడ్వకేట్‌ జనరల్‌ దమ్మాలపాటిపై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌ వాజ్యం సాక్షాత్తూ అత్యున్నత న్యాయస్థానంలోనే తేలవలసి వుంది. జులై 13న సుప్రీం కోర్టులో జస్టిస్‌ వినీత్‌ శరణ్‌, దినేశ్‌ మహేశ్వరితో కూడిన ధర్మాసనం ముందు ఈ కేసు విచారణకు వచ్చినప్పుడు ఆసక్తికరమైన చర్చ జరిగింది. కేసు మంచి చెడ్డలతోపాటు ఎక్కడ విచారణ జరగాలనేదానిపైనా వాదనలు వినిపించాయి.

అడ్వకేట్‌ జనరల్‌గా తనకున్నముందస్తు సమాచారం ఉపయోగించి బినామి పేర్లతో భూములు కొని తర్వాత కొన్ని ఇతరులకు బదలాయించారనేది మాజీ ఎజిపై ఆరోపణ.ఈ బదలాయింపు జరిగిన వారిలో ఒక న్యాయమూర్తి కుటుంబ సభ్యుల పేర్లు కూడా వుండటం సంచలనం కలిగించింది.ఐపిసి సెక్షన్ల కింద ఎప్‌ఐఆర్‌ నమోదు చేశారు. దానిపై ఎపి హైకోర్టులో దమ్మాలపాటి పిటిషన్‌ వేయడం,కోర్టు దాన్ని స్వీకరించడమే గాక స్టే ఉత్తర్వు ఇస్తూ ఈ ఎఫ్‌ఐఆర్‌లో వివరాలు మీడియాలో రాకుండా ఉత్తర్వులు ఇవ్వడం మరో వివాదమైంది. సుప్రీం కోర్టు లో ఎపి ప్రభుత్వం దీనిపై అప్పీలు చేయగా మీడియా ప్రచురణ చేయరాదనే నిషేదాన్ని ఎత్తివేసింది. అదే సమయంలో హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేయకుండా కేసును వాయిదా వేసింది. ఇప్పుడు కేసు విచారణ సమయంలో ప్రభుత్వ తరపు న్యాయవాది సీనియర్‌అడ్వకేట్‌ రాజీవ్‌ ధావన్‌ వాదిస్తూ ఇది ఎలాటి కక్షసాధింపుతో చేసిన పని కాదని తప్పు జరిగింది గనకనే చర్య తీసుకోవలసి వచ్చిందని పేర్కొన్నారు. మరోవైపున దమ్మాలపాటి తరపు న్యాయవాది హరీశ్‌ సాల్వే ఇది ముమ్మాటికి కక్షసాధింపేనన్నారు. ఈ కేసును ఇలాగే సాగదీయకుండా సుప్రీం కోర్టులోనే విచారించాలని ఆయన కోరారు.ఇక్కడ ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను కొట్టివేయాలి లేదా విచారించాలి, కాదంటే హైకోర్టులోనైనా విచారణ కొనసాగాలి అని సాల్వే వాదించారు.ఒకే కేసులో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులోనూ ఇక్కడా కూడా ఏకకాలంలో వాదించడం సరికాదని అన్నారు.

దీనికి ప్రభుత్వం తరపున రాజీవ్‌ధావన్‌ ఇచ్చిన సమాధానం కూడా ఆసక్తికరంగానే వుంది.ఈ కేసులో ఏవైనా ఉత్తర్వులు వచ్చేవరకూ ఎలాటి బలప్రయోగచర్యలకు పాల్పడబోమని గతంలోనే అంగీకరించాము,విచారణ ఇక్కడే జరగాలని చెప్పగల స్తితిలో నేను లేను. నాకు అందిన సూచనల ప్రకారం ఈ కేసును హైకోర్టులో వివరంగావిచారించవచ్చునని కోరారు. ఒక మాజీహైకోర్టు జడ్జి కేసు పురోగతిని పర్యవేక్షించవచ్చు,సిబిఐ విచారించినా మాకు అభ్యంతరం లేదు అని తెలిపారు.లోగడే ఎపిహైకోర్టుపై అనేక ఫిర్యాదుల చేసిన వైసీపీ ప్రభుత్వం అక్కడే విచారణ జరిగితే మంచిదని చెప్పడం ఇందులో విశేషం. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం కేసును జులై22కువాయిదావేసింది.

ఇది ఇలా వుంటే అసలు ఎపి రాజధాని ఏదన్న విషయంలో కేంద్రం దాగుడుమూతలు సాగిస్తూనే వుంది.కొద్ది రోజుల కిందట ఆర్‌టిఐ కింద దాఖలైన ప్రశ్నకు సమాధానమిస్తూ ఎపి శాసనసభమూడు రాజధానులకై వికేంద్రీకరణ బిల్లు ఆమోదించిందని ఇందులో ఏదిరాజధాని అన్నది తెలియదని చెప్పింది. తర్వాత కొన్నాళ్లుగా ఎపికి ఢల్లీి వర్తమానాలు హైదరాబాద్‌ చిరునామాకు రావడం,వాటిని అమరావతికి మళ్లించడం పరిపాటి అయింది. ఏదిరాజధాని అన్నదితెలియదని కేంద్ర హొంశాఖ సమాధానమివ్వడంపై ఫిర్యాదురాగా సవరించుకుని ఇప్పుడు మళ్లీ కొత్త జవాబు చెప్పింది, రాజదాని వికేంద్రీకరణ బిల్లు ప్రస్తుతం కోర్టు పరిధిలో వుందని హోంశాఖ సిఇవో రేణు శరీన్‌ వివరణ ఇచ్చారు. ఇంతకూ కేంద్రం ఇన్నివిధాల మల్లగుల్లాలు ఎందుకు పడుతుందో మాత్రం అర్థం కాదు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Amaravati
  • Amaravati land scam case
  • Andhra Pradesh
  • high court
  • senior journalist telakapalli ravi

తాజావార్తలు

  • Sanju Samson: ఆయన్ను కలిశా, సెంచరీ చేశా.. ప్రతి మ్యాచ్‌కు ముందు కలిస్తే బాగుండు!

  • Story Board: మమత మరోసారి సీఎం అవుతారా..? బీజేపీ గెలుపు ఉట్టి కొడుతుందా?

  • Asha Bhosle: లెజెండరీ సింగర్ ఆశా భోస్లేకు గుండెపోటు.. బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో 92 ఏళ్ల సింగర్!

  • Ayush Mhatre ‘రిటైర్డ్ ఔట్’.. CSK వ్యూహం వెనుక అసలు కారణం ఇదే..!

  • Telangana : MPTC, ZPTC ఎన్నికల షెడ్యూల్ ఇంకెప్పుడు.?

ట్రెండింగ్‌

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • Kitchen Tips : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • Headache in Sunlight: ఎండలోకి వెళ్తే మీకు తలనొప్పి వస్తుందా.? అయితే.. మీకు ఈ సమస్య ఉన్నట్లే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions