నేడు ఏపీ కేబినెట్ భేటీ…వీటిపైనే చర్చ…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రారంభం కాబోతున్నది. ముఖ్యమంత్రి సీఎం జగన్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనున్నది. ఈ సమావేశంలో కీలక విషయాలపై చర్చించబోతున్నారు. తెలంగాణతో ఉన్న జలవివాదం గురించి ముఖ్యంగా చర్చించే అవకాశం ఉన్నది. పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకంపై కూడా చర్చించే అవకాశం ఉన్నది. ఏపీలో ప్రాజెక్టులు అక్రమంగా నిర్మిస్తున్నారని తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఎంతో కాలంగా రెండు రాష్ట్రాల మధ్య జలవివాదం నడుస్తున్నది.
Read: ‘పుష్ప’ నుంచి మొదటి పాట!
Also Read
వైఎస్ జగన్ ఏపీ ముఖ్యమంత్రి అయ్యాక, రెండు రాష్ట్రాల మధ్య కొంత సయోధ్యనెలకొన్నది. వివాదాలు పరిష్కారం అవుతాయని అనుకున్నారు. కానీ, రెండు రాష్ట్రాల మధ్య ఈ జలవివాదం రోజురోజుకు పెరుగుతూనే ఉన్నది. ఈరోజు కేబినెట్ మీటింగ్ రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదంపై దృష్టిపెట్టె అవకాశం ఉన్నది. దీంతో పాటుగా ఐటీ పాలసీపై, ఒంగోలు, విజయనగరం జిల్లాల్లో విశ్వవిద్యాలయాల ఏర్పాటుపై కూడా సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నది.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..