జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు కెఎస్.జవహర్ రెడ్డి. ప్రస్తుతం టీటీడీ ఈవోగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న డా.జవహర్ రెడ్డిని జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అమరావతిలో ఈరోజు జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు జవహర్ రెడ్డి. ప్రస్తుతం డిప్యుటేషన్పై దేవదాయ శాఖలో ఉన్న ఆయన్ను వెనక్కు తీసుకుని జలవనరుల శాఖకు స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నియమించింది. అయితే ఈవో స్థానంలో మరొకరిని నియమించేవరకూ…
అమరావతి రాజధాని కేసులపై హైకోర్టులో విచారణ ప్రారంభం అయింది. రాజధాని కేసుల నుంచి న్యాయమూర్తులు సత్యనారాయణ మూర్తి, సోమయాజులను తప్పించాలని ప్రభుత్వం తరపు న్యాయవాది దుష్యంత్ దవే పిటిషన్ వేశారు. రాజధానిలో ఆ ఇద్దరు న్యాయమూర్తులకు భూములున్నాయని.. వారిని ధర్మాసనం తప్పించాలని కోరారు దుష్యంత్ దవే. గతంలో ఇవే పిటిషన్లపై విచారణ చేపడుతోన్నప్పుడు ఎందుకు అభ్యంతరం తెలపలేదని హైకోర్టు ప్రశ్నించింది. న్యాయమూర్తులపై ప్రభుత్వ అభ్యంతర పిటిషన్ని కొట్టేసింది హైకోర్టు. తాము అభ్యంతరం తెలిపామనే విషయాన్ని తీర్పులో ప్రస్తావించాలని…
ఏపీ రాజధానికి సంబంధించిన కేసులపై హైకోర్టు ఇవాళ విచారణ జరపనుంది . సీఆర్డీ యే రద్దు చట్టం , పాలనా వికేంద్రణ లపై దాఖలైన పిటీషన్లపై త్రిసభ్య ధర్మాసనం రోజువారీ విచారణ కొనసాగించనుంది. ప్రస్తుతం 90కి పైగా పిటీషన్లు దాఖలు చేశారు . ఈ ఏడాది ఆగస్టులో విచారణ జరిపిన ధర్మాసనం నేటికి వాయిదా వేసింది. రాజధాని తరలింపు, పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టంపై దాఖలైన వ్యాజ్యాలపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. రైతులు, నేతలు…
ఏపీలో రాజకీయం వేడిమీద వుంది. ఒక వైపు స్థానిక ఎన్నికలు, మరోవైపు అమరావతి పాదయాత్రలతో మరింతగా హాట్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఏపీ మంత్రి జయరాం కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, టీడీపీపై విమర్శలు చేశారు. టీడీపీ భూస్థాపితం అవుతుందని, అమరావతి రైతుల మహాపాదయాత్ర కు దర్శకుడు, నిర్మాత చంద్రబాబే అన్నారు. ఈ పాదయాత్ర న్యాయస్థానం టు దేవస్థానం కాదు. మోసం టు మోసం టైటిల్ పెడితే బాగుంటుందని ఎద్దేవా చేశారు. పాదయాత్ర కు ఆదరణ లేదని రైతు…
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ అమరావతి రైతులు చేపట్టిన న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్ర కొనసాగుతోంది. ఇవాళ్టికి పన్నెండవ రోజు ప్రకాశం జిల్లా ఒంగోలుకు చేరింది. రైతులు తలపెట్టిన పాదయాత్రకు ఒంగోలు నగరంలో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అమరావతి రైతులకు ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్, జనసేన,సీపీఐ, సీపీఎం పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఆనాడు అమరావతిని శాశ్వత రాజధానిగా ఉంచుతామనే హామీవల్లే తమ విలువైన భూములు ఇచ్చామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ కు మూడు…
న్యాయస్థానం టు దేవస్థానం అని ఒక ముసుగు వేసుకుని అమరావతి రైతులు పాదయాత్ర చేస్తున్నారని వారు ఇకనైనా కళ్లు తెరవాలని వైసీ ఎమ్మెల్యే సుధాకర్బాబు అన్నారు. 157 మంది మాత్రమే పాల్గొంటా మని జాబితా ఇచ్చి కోర్టు నుంచి అనుమతి పొందారని, ఇప్పుడేమో చంద్రబాబు సంఘీభావం పేరుతో రాష్ట్రంలో అలజడికి కుట్రలు పన్నుతున్నడని ఆయన అన్నారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు న్యాయం జరిగింది. రాజధాని రైతులకు ప్యాకేజీ అందిం దని,ఏడాదికి ఒకసారి కౌలు డబ్బులు, ఇతర…
సెక్రటేరియట్లో కొనసాగుతున్న ఉద్యోగ సంఘాల నేతల బైఠాయింపుసీఎస్ నుంచి సమాచారం కోసం ఎదురు చూస్తోన్న ఉద్యోగ సంఘాల ప్రతినిధులు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటు ఉద్యోగ సంఘాల నేతలు ఏపీ సెక్రటేరియట్లో బైఠాయించారు.ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల జేఏసీ నేత బండి శ్రీనివాస్రావు సీఎం జగన్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.కుడి చేత్తో, ఎడం చేత్తో ఓట్లేసి జగన్ ను గెలిపించా మన్నారు. జగన్ను గెలిపించేందుకు మేం ఎంతో ప్రయత్నిం చామ న్నారు. లక్షల మంది ప్రతినిధులమైన మమ్మల్ని ఎందుకు…
శాంతియుతంగా పాదయాత్ర చేస్తున్న మహిళా రైతుల్ని రెచ్చగొట్టడం సరికాదని, పాదయాత్రకి అడ్డంకులు సృష్టించడం సబబు కాదని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. కడుపు మండి ధర్నా చేసే మహిళా రైతుల మాటలను వక్రీకరిస్తూ మాట్లాడటమేంటని ఆమె మండిపడ్డారు. ధర్నా చేస్తున్న మహిళా రైతుల్ని బూటు కాళ్లతో తన్నించడం ఎంత వరకు సమంజసం వైసీపీ నాయకు లను ఆమె నిలదీశారు. రాజధాని రైతులను దుర్భాషలాడితే సహిం చేది లేదని హెచ్చరించారు. నిరసన తెలియజేసినవారికి మద్దతు…
రాజధానిగా అమరావతిని అమలుచేయాలంటూ రైతులు, ప్రజాసంఘాలు చేపట్టిన పాదయాత్రకు కోర్టు అనుమతిచ్చినా పోలీసులు మాత్రం ఆంక్షలు విధిస్తున్నారు. విచ్చలవిడిగా రోడ్లపై రచ్చ చేసే వైసీపీ వాళ్లకు అడ్డురాని కోవిడ్ నిబంధనలు, లౌడ్ స్పీకర్లు రైతుల మహా పాదయాత్రకే అడ్డొచ్చాయా డీజీపీ గారు అంటూ మండిపడ్డారు టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్. వైసీపీ ర్యాలీలకు రెడ్ కార్పెట్ వేస్తున్న పోలీసులు అమరావతి రైతుల మహా పాదయాత్రకు అడ్డంకులు కల్పిస్తూ నోటీసులిస్తున్నారు. అమరావతిని చంపేసి ఉద్యమాన్ని అణిచేయాలనే…
ఏపీ ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రాజధాని రైతులు, మహిళలు చేపట్టిన మహాపాదయాత్ర చేపట్టారు. న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో రైతుల యాత్ర సాగిస్తున్నారు. ఈ యాత్ర ఇవాళ ఆరో రోజు కొనసాగుతోంది. మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దుకు వ్యతిరేకంగా చేస్తున్న యాత్ర పెదనందిపాడులో ప్రారంభమై 14 కి.మీ మేర సాగి ఇవాళ పర్చూరులో ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా పర్చూరు వై జంక్షన్ వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులకు, పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు…