అమరావతి కేసులపై విచారణ షురూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ రాజధానికి సంబంధించిన కేసులపై హైకోర్టు ఇవాళ విచారణ జరపనుంది . సీఆర్డీ యే రద్దు చట్టం , పాలనా వికేంద్రణ లపై దాఖలైన పిటీషన్లపై త్రిసభ్య ధర్మాసనం రోజువారీ విచారణ కొనసాగించనుంది. ప్రస్తుతం 90కి పైగా పిటీషన్లు దాఖలు చేశారు . ఈ ఏడాది ఆగస్టులో విచారణ జరిపిన ధర్మాసనం నేటికి వాయిదా వేసింది.
రాజధాని తరలింపు, పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టంపై దాఖలైన వ్యాజ్యాలపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. రైతులు, నేతలు 90కి పైగా వ్యాజ్యాలు దాఖలు చేశారు. అన్ని పిటిషన్లనూ నూతన సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర ఆధ్వర్యంలోని త్రిసభ్య బెంచ్ విచారణ చేపట్టనుంది. వ్యాజ్యాలపై రోజువారీ విచారణ జరగనుంది. కొవిడ్ నేపథ్యంలో హైబ్రిడ్ పద్ధతుల్లో కేసులను విచారిస్తున్నారు.
Also Read
- Indian Crew Tanker Incident: భారత్ నౌకపై దాడి.. మృతుల్లో విశాఖ వాసి
- AP DSC Recruitment: మరో డీఎస్సీ.. నిరాశ చెందిన అభ్యర్థులకు గుడ్న్యూస్
- MLA Chirri Balaraju: పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కార్యాలయంలో ఉద్రిక్తత..
- Rajya Sabha Elections: ఏపీ నుంచి రాజ్యసభకు నలుగురు సభ్యులు ఏకగ్రీవ ఎన్నిక.. అధికారిక ప్రకటన
గతేడాది జనవరిలో సీఆర్డీఏ రద్దు, పాలనా వికేంద్రీకరణపై మొదటిసారి జస్టిస్ జేకే మహేశ్వరీ ఆధ్వర్యంలో త్రిసభ్య బెంచ్ ఏర్పాటు చేశారు. ఆ బెంచ్ ముందు రైతుల తరఫు న్యాయవాదుల వాదనలనును పూర్తిగా వినిపించారు. అనంతరం ప్రభుత్వం తరఫు న్యాయవాదుల వాదనలు వినిపించారు. జస్టిస్ జేకే మహేశ్వరీ ఈ ఏడాది జనవరిలో బదిలీ కావటంతో విచారణ నిలిచిపోయింది. తర్వాత హైకోర్టు సీజేగా అరూప్ కుమార్ గోస్వామి రావటంతో మరోసారి ఆయన ముందుకు విచారణకు వచ్చాయి. ఈ ఏడాది ఆగస్టు 13న విచారించారు. నవంబర్ 15 తదుపరి విచారణ వాయిదా వేశారు. దీంతో నేటి నుంచి రోజువారీ విచారణను ప్రారంభించనున్నారు.
సీఆర్డీఏ రద్దు, కార్యాలయాల తరలింపు అంశాలపై రైతులు 697 రోజుల నుంచి దీక్ష చేపడుతున్నారు. గతంలో విచారణ జరిగిన తర్వాత అనుబంధ పిటిషన్లను ధర్మాసనం కొట్టేసింది. అంశాల వారీగా పిటీషన్లను విచారించాలని గతంలోనే ధర్మాసనం నిర్ణయించింది. రైతుల తరపు న్యాయవాదులు ఒక్కొక్కరు ఒక్కో అంశంపై వరుసగా వాదనలు వినిపించారు. ప్రస్తుతం ఇదే పద్ధతిని అనుసరించే అవకాశం ఉంటుంది. ఈ రోజు రైతుల తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది శ్యాందివాన్ వాదనలు వినిపించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Riyan Parag: గాయంతో పోరాటం.. కన్నీళ్లు దాచుకుంటూ సర్జరీ బెడ్పై నుంచి రియాన్ పరాగ్ ఎమోషనల్ వర్డ్స్..
-
Vishal: ఒళ్లు గగుర్పొడిచేలా విశాల్ ‘మకుటం’ టీజర్
-
Tilak Varma: మా కొంప ముంచింది అదొక్కటే.. ఓటమిపై కీలక వ్యాఖ్యలు చేసిన తిలక్ వర్మ..
-
EPFO New Rules: ఉద్యోగులకు శుభవార్త.. 100 శాతం PF విత్డ్రా చేయొచ్చు..! ఎప్పుడంటే..?
-
Trump: ఈ రాత్రి ఇరాన్ను ఊహించలేని దెబ్బ కొడతాం.. ఖర్గ్ కూడా స్వాధీనం చేసుకుంటాం.. ట్రంప్ వార్నింగ్
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!