అమరావతి కేసులపై విచారణ షురూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ రాజధానికి సంబంధించిన కేసులపై హైకోర్టు ఇవాళ విచారణ జరపనుంది . సీఆర్డీ యే రద్దు చట్టం , పాలనా వికేంద్రణ లపై దాఖలైన పిటీషన్లపై త్రిసభ్య ధర్మాసనం రోజువారీ విచారణ కొనసాగించనుంది. ప్రస్తుతం 90కి పైగా పిటీషన్లు దాఖలు చేశారు . ఈ ఏడాది ఆగస్టులో విచారణ జరిపిన ధర్మాసనం నేటికి వాయిదా వేసింది.
రాజధాని తరలింపు, పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టంపై దాఖలైన వ్యాజ్యాలపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. రైతులు, నేతలు 90కి పైగా వ్యాజ్యాలు దాఖలు చేశారు. అన్ని పిటిషన్లనూ నూతన సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర ఆధ్వర్యంలోని త్రిసభ్య బెంచ్ విచారణ చేపట్టనుంది. వ్యాజ్యాలపై రోజువారీ విచారణ జరగనుంది. కొవిడ్ నేపథ్యంలో హైబ్రిడ్ పద్ధతుల్లో కేసులను విచారిస్తున్నారు.
Also Read
- Off The Record : జోగి రమేష్కు అనవసరంగా మైలేజ్ ఇస్తున్నారా? వైసీపీ, టీడీపీలో చర్చలు?
- Off The Record : సిక్కోలు నేతలకు సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారా?
- TDP Mahanadu 2026: మహానాడులో 20 కీలక తీర్మానాలు.. తెలంగాణ నుంచి 4 ప్రత్యేక ప్రతిపాదనలు!
- CM Chandrababu: తీరం మనదే.. బోటు మనదే.. వేట కూడా మనదే.. ఎవరైనా వస్తే వేటాడుతాం.. వెంటాడుతాం..
గతేడాది జనవరిలో సీఆర్డీఏ రద్దు, పాలనా వికేంద్రీకరణపై మొదటిసారి జస్టిస్ జేకే మహేశ్వరీ ఆధ్వర్యంలో త్రిసభ్య బెంచ్ ఏర్పాటు చేశారు. ఆ బెంచ్ ముందు రైతుల తరఫు న్యాయవాదుల వాదనలనును పూర్తిగా వినిపించారు. అనంతరం ప్రభుత్వం తరఫు న్యాయవాదుల వాదనలు వినిపించారు. జస్టిస్ జేకే మహేశ్వరీ ఈ ఏడాది జనవరిలో బదిలీ కావటంతో విచారణ నిలిచిపోయింది. తర్వాత హైకోర్టు సీజేగా అరూప్ కుమార్ గోస్వామి రావటంతో మరోసారి ఆయన ముందుకు విచారణకు వచ్చాయి. ఈ ఏడాది ఆగస్టు 13న విచారించారు. నవంబర్ 15 తదుపరి విచారణ వాయిదా వేశారు. దీంతో నేటి నుంచి రోజువారీ విచారణను ప్రారంభించనున్నారు.
సీఆర్డీఏ రద్దు, కార్యాలయాల తరలింపు అంశాలపై రైతులు 697 రోజుల నుంచి దీక్ష చేపడుతున్నారు. గతంలో విచారణ జరిగిన తర్వాత అనుబంధ పిటిషన్లను ధర్మాసనం కొట్టేసింది. అంశాల వారీగా పిటీషన్లను విచారించాలని గతంలోనే ధర్మాసనం నిర్ణయించింది. రైతుల తరపు న్యాయవాదులు ఒక్కొక్కరు ఒక్కో అంశంపై వరుసగా వాదనలు వినిపించారు. ప్రస్తుతం ఇదే పద్ధతిని అనుసరించే అవకాశం ఉంటుంది. ఈ రోజు రైతుల తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది శ్యాందివాన్ వాదనలు వినిపించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!