Thiruvananthapuram: తిరువనంతపురం ఎయిర్పోర్టులో ఎమర్జెన్సీ విధింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thiruvananthapuram: కేరళ రాజధాని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఫుల్ ఎమర్జెన్సీని విధించారు అధికారులు. కాలికట్ నుంచి సౌదీ అరేబియాలోని డమ్మామ్ వెళ్లాల్సిన విమానంలో హైడ్రాలిక్ వైఫల్యం తలెత్తినట్లు తెలుస్తోంది. దీంతో ఈ విమానాన్ని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి డైవర్ట్ చేశారు. 182 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ఐఎక్స్ 385 విమానం శుక్రవారం ఉదయం కాలికట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టును నుంచి టేకాఫ్ అయ్యే సమయంలో రన్ వేను ఢీకొట్టింది. టేకాఫ్ అయ్యే సమయంలో విమానం తోకభాగం రన్ వేను బలంగా ఢీకొట్టింది. దీంతో హైడ్రాలిక్ సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది.
Read Also: PM Narendra Modi: ఈశాన్య రాష్ట్రాలను కాంగ్రెస్ ఏటీఎంగా వాడుకుంది.
Also Read
- TMC: హెడ్ క్వార్టర్స్ కోల్పోయిన మమతా బెనర్జీ.. తృణమూల్ సంక్షోభం తీవ్రం..
- Mohan Bhagwat: ప్రవర్తనతో భారతీయ కుటుంబాలు ప్రపంచానికి ఆదర్శంగా ఉండాలి
- India On Indus Waters: ఎంత మొత్తుకున్నా నీళ్లు ఇయ్యం.. పాక్కు భారత్ స్పష్టీకరణ..
- US Woman Shocked: అమెరికాలో రూ.85 వేలు, భారత్లో రూ.35 మాత్రమే.. మందుల ధరలపై మహిళ షాక్..
ఇదిలా ఉంటే తిరువనంతపురానికి మళ్లించిన విమానం, ఎలాంటి ప్రమాదం జరగకుండా నిండుగా ఉన్న ఇంధనాన్ని అరేబియా సముద్రంలో డంప్ చేశారు. దీని తర్వాత సురక్షితంగా మధ్యాహ్నం 12.15 గంటలకు విమానం ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయింది. దీంతో అధికారులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. దీని కారణంగానే ఎయిర్ పోర్టు యాజమాన్యం విమానం ల్యాండ్ అయ్యేంత వరకు పూర్తి ఎమర్జెన్సీ ప్రకటించింది.
అంతకుముందు అమెరికా నెవార్క్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిరిండియా విమానంలో ఆయిల్ లీకేజీ కారణంగా స్వీడన్ లోని స్టాక్ హోమ్ లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. విమానం రెండో ఇంజిన్ లో ఆయిల్ లీకేజీని గుర్తించారు. 300 మంది ప్రయాణికలు ఉన్న విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు పైలెట్లు.
తాజావార్తలు
-
TMC: హెడ్ క్వార్టర్స్ కోల్పోయిన మమతా బెనర్జీ.. తృణమూల్ సంక్షోభం తీవ్రం..
-
Khamenei: ఖమేనీ అంత్యక్రియల్లో హృదయ విదారక దృశ్యం.. 14 నెలల మనవరాలి పార్థివదేహం
-
OTR: తాండూరు కాంగ్రెస్లో గ్రూప్ వార్.. ఎమ్మెల్యే vs ఎమ్మెల్సీ పోరు ముదిరిందా?
-
OTR: వైజాగ్ పాలిటిక్స్లో తన ముద్ర కోసం శ్రీభరత్ తిప్పలు.?
-
OTR: ఇక నుంచి సీఎం రేవంత్ సభల్లో కీలక మార్పులు
ట్రెండింగ్
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్లో లాంచ్..!