Air India: మరోసారి నిబంధనల ఉల్లంఘనలో ఎయిర్ ఇండియాకు జరిమానా పడింది. ఇప్పటికే పలుమార్లు ఈ అగ్రశ్రేణి ఎయిర్ లైనర్కి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) జరిమానా విధించింది. తాజాగా ఫ్లైట్ డ్యూటీ టైమ్ రెగ్యులేషన్స్ (ఎఫ్డిటిఎల్), ఫెటీగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఎఫ్ఎంఎస్) నిబంధనలను ఉల్లంఘించినందుకు ఎయిర్ ఇండియాకు డీజీసీఏ రూ. 80 లక్షల భారీ జరిమానా విధించింది.
Air India Saftey Mudras: విమానం బయలుదేరే ముందు ఎయిర్ హోస్టెస్లు మైక్రోఫోన్ల ద్వారా ప్రయాణీకులకు భద్రతా సూచనలను అందిస్తారు. సీట్ బెల్ట్ ఎలా పెట్టుకోవాలి..
విమానాల్లో అనేక అవకతవకలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో భద్రతా నిబంధనలను ఉల్లంఘించినందుకు ఎయిర్ ఇండియాకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) రూ.1.10 కోట్ల భారీ జరిమానా విధించింది.
Air India: టాటా చేతిలోకి వచ్చిన తర్వాత ఎయిర్ ఇండియా రూపురేఖలు మారిపోతున్నాయి. ఇప్పటికే భారీ సంఖ్యలో ఎయిర్బస్, బోయింగ్ సంస్థలకు విమానాల ఆర్డర్లను ఇచ్చింది. ఇదిలా ఉంటే శనివారం రోజు ఎయిర్ ఇండియా చేతికి మొట్టమొదటి వైబ్ బాడీ క్యారియర్ ఎయిర్బస్ A350-900 అందింది. ఫ్రాన్స్ లోని ఎయిర్బస్ ఫెసిలిటీ నుంచి బయలుదేరిన ఈ విమానం ఈ రోజు మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకుంది. ఈ తరహా విమానం కలిగిన తొలి భారతీయ ఎయిర్ లైనర్గా ఎయిర్…
శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో అయ్యప్ప భక్తులు పడిగాపులు కాస్తున్నారు. శబరిమల అయ్యప్ప దర్శనం కోసం వెళ్లనున్న భక్తులు నానా తిప్పలు పడుతున్నారు. అయితే భక్తులు మధ్యాహ్నమే కొచ్చికి బయలుదేరాల్సి ఉండగా.. ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపంతో ఇంకా వెళ్లలేదు. దీంతో మధ్యాహ్నం నుంచి 64 మంది అయ్యప్ప భక్తులు ఎయిర్ పోర్ట్ లోనే పడిగాపులు గాస్తున్నారు. ఇదే విషయమై ఎయిర్ పోర్టు అధికారులను అడిగితే.. ఎలాంటి స్పందన ఇవ్వడం లేదని చెబుతున్నారు. కాగా.. తాము వెళ్లాల్సిన కనెక్టింగ్…
Air India: టాటా గ్రూపు సొంతం చేసుకున్న తర్వాత ఎయిరిండియా రూపు రేఖలు మారిపోతున్నాయి. ఇప్పటికే భారీ సంఖ్యలో కొత్త విమానాలకు ఆర్డర్ చేసిన టాటా, ఇప్పుడు తన పైలట్లు, సిబ్బందికి కొత్త యూనిఫాంని ఈ రోజు విడుదల చేసింది. 1932లో స్థాపించిబడిన ఈ ఎయిర్లైన్ తన యూనిఫామ్ని మార్చడం ఇదే తొలిసారి. ఈ ఏడాది చివరినాటికి విడుదల కానున్న కొత్త యూనిఫామ్ ‘‘ఎయిరిండియా గొప్ప చరిత్ర, ఉజ్వల భవిష్యత్తుకు వాగ్దానం’’ అంటూ ట్వీట్ చేసింది.
Air India Issues: ఎయిరిండియా విమానం పై నుంచి నీరు లీకేజీ అయిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారడంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
Canada: ఖలిస్తాన్ ఉగ్రవాది, సిక్ ఫర్ జస్టిస్(ఎస్జేఎఫ్) చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూ ఇటీవల భారత్ను బెదిరిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. నవంబర్ 19న ఎయిరిండియా విమానాల్లో సిక్కులు ఎవరూ ప్రయాణించొద్దని, ప్రయాణిస్తే ప్రాణాలకు భద్రత ఉండదని, ప్రపంచవ్యాప్తంగా ఆ విమానాలను ఎక్కడా అనుమతించబోమని హెచ్చరించారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయం మూతపడుతుందని, దాని పేరు మారుస్తామని హెచ్చరించారు.