హృదయం బ్రద్ధలైందంటున్న అడివి శేష్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినిమా వాళ్ళు సున్నిత మనస్కులు. చిన్న సంఘటన జరిగినా త్వరగా చెలించిపోతారు. కానీ అలాంటి సినిమా వాళ్ళే ఒక్కోసారి తమ ముందే అతి పెద్ద దారుణం జరిగినా స్పందించారు. ఆ కోవకు తాను చెందనని అంటున్నాడు అడివి శేష్. గత కొన్ని రోజులుగా ఆఫ్ఠనిస్థాన్ లో తాలిబన్లు చేస్తున్న దారుణ మారణ కాండను తెలియచేసే ఓ లేఖను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసి… ఆ లేఖ తన హృదయాన్ని బ్రద్దలు చేసిందని పేర్కొన్నాడు అడివి శేష్. ఆ లేఖ రాసిన యువతి ఆఫ్ఠనిస్థాన్ ఫిల్మ్ మేకర్ సహ్రా కరిమి.
ప్రస్తుతం సినిమా రంగాన్ని, కళలను నమ్ముకున్న వారి స్థితి ఆఫ్ఠనిస్థాన్ లో ఎంత దారుణంగా ఉందో ఆ లేఖలో సహ్రా కరిమి కళ్ళకు కట్టినట్టు తెలిపింది. సినిమా రంగానికి చెందిన రచయితలను, నటులను తాలిబన్లు అతి కిరాతకం చంపేస్తున్నారని, ఎంతో మంది మహిళలను మానభంగం చేశారని, చిన్న పిల్లలను ఎత్తుకెళ్ళి అమ్మేస్తున్నారని వాపోయింది. అతి త్వరలోనే ఆఫ్ఠనిస్థాన్ ను పూర్తిగా వారు ఆక్రమించుకుంటే… తమ నిస్సహాయ స్థితిని ప్రపంచానికి కూడా తెలియచేయలేమని ఆ లేఖలో పేర్కొంది. ప్రపంచంలో సినిమాను ప్రేమించే వారు, సినిమా రంగానికి చెందిన వారు దయచేసి మౌనంగా ఉండకుండా, తమ దీన స్థితిని గుర్తించి, తాలిబన్ల నుండి తమ ప్రజలను, ముఖ్యంగా అక్కడి సినిమా రంగానికి చెందిన వ్యక్తులను కాపాడేందుకు చేస్తున్న ప్రయత్నానికి సహకరించమని సహ్రా కరిమి ఆ లేఖ ద్వారా వేడుకుంది. ఆ లేఖను చదివి వదిలేయకుండా, వీలైనంత మందికి చేరేలా షేర్ చేయమని ప్రార్థించింది. ఓ మానవతా వాదిగా అడివి శేష్ తన హృదయ స్పందనను తెలియచేశాడు. ఆమె లేఖను షేర్ చేశాడు. మరి సాటి మహిళా దర్శకురాలి విన్నపాన్ని ఎంతమంది ఆలకిస్తారో చూడాలి.
Also Read
#Afghanistan This letter broke my heart. https://t.co/sYWzebxNxS
— Adivi Sesh (@AdiviSesh) August 16, 2021
తాజావార్తలు
-
CNG Prices Hike: మరో బిగ్ షాక్.. సీఎన్జీ ధరలు భారీగా పెంపు..
-
Hyderabad Petrol Price: భాగ్యనగరంలో పెట్రోల్ మంట.. దేశంలోనే హైదరాబాద్లో అత్యధిక పెట్రోల్ ధర!
-
RBI Cancels 150 NFBC License: 150 ఎన్బిఎఫ్సి కంపెనీల ఆర్బీఐ కొరఢా.. లైసెన్సులు రద్దు
-
Best Investment: నెలకు రూ.10 వేల పెట్టుబడి.. ఐదేళ్లకు కళ్లు చెదిరే లాభాలు.. చాట్ జీపీటీ చెప్పిన ప్లాన్ ఇదే..
-
Kiara Advani: ప్రతి రిలేషన్ మనకు.. ఏదో ఒక పాఠం నేర్పుతుంది..
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!