తెలుగు సినీ అభిమానులే కాదు… యావత్ భారతదేశంలోని సినిమా అభిమానులు మార్చి నెల కోసం ఎంతగానో ఎదురుచూశారు. కొన్నేళ్ళుగా వాళ్లు భారీ ఆశలు పెట్టుకున్న పాన్ ఇండియా సినిమాలు ఈ నెలలో విడుదల కాబోతుండమే అందుకు కారణం. అయితే కారణాలు ఏవైనా ఆ సినిమాలు వారిని తీవ్ర నిరాశకు గురిచేశాయి. మార్చి నెలలో తెలుగులో మొత్తం 18 సినిమాలు విడుదలయ్యాయి. అందులో స్ట్రయిట్ సినిమాలు 13 కాగా, 5 డబ్బింగ్ మూవీస్. ఈ నెల ప్రారంభమే తమిళ…
Rashmika Mandanna ఇటీవల “ఆడవాళ్లు మీకు జోహార్లు” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఆ సినిమాతో ఆమె ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం ‘పుష్ప 2’ చిత్రీకరణకు సిద్ధమవుతన్న ఈ బ్యూటీ మరో యంగ్ హీరోతో రొమాన్స్ చేయబోతోందని బజ్. రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను ఒక సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ మీద శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈ సినిమా రామ్ కి 20వ సినిమా. ఈ సినిమా అధికారిక ప్రకటన…
(మార్చి 6న శర్వానంద్ పుట్టినరోజు)ఎక్కడ పోగొట్టుకుంటామో అక్కడే వెదుక్కోవాలని సామెత! యువ కథానాయకుడు శర్వానంద్ సినిమాపై మనసు పారేసుకున్నాడు. దాంతో చిత్రసీమలోనే పారేసుకున్న మనసును సంతృప్తి పరచడానికి పరితపించాడు. మొత్తానికి అనుకున్నది సాధించాడు. నవతరం కథానాయకుల్లో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నాడు శర్వానంద్. శర్వానంద్ మైనేని 1984 మార్చి 6న విజయవాడలో జన్మించాడు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో చదివాడు. తరువాత సికిందరాబాద్ వెస్లీ డిగ్రీ కాలేజ్ లో బి.కామ్, పూర్తి చేశాడు శర్వానంద్. కాలేజ్ లో…
శర్వానంద్ నటించిన ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ ఇటీవల ఆడియన్స్ ముందుకు వచ్చింది. అయితే శర్వా ఆశించిన ఫలితాన్ని మాత్రం ఇవ్వలేక పోయింది. దాంతో రాబోయే ‘ఒకే ఒక జీవితం’ సినిమా పై ఆశలు పెట్టుకన్నాడు శర్వానంద్. ఇదిలా ఉంటే శర్వానంద్ డ్యాన్స్ మాస్టర్ రాజు సుందరం దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు వినిపిస్తోంది. శర్వానంద్తో పలు సినిమాల్లో చిందులు వేయించిన రాజుసుందరం చాలా కాలం క్రితం యువి క్రియేషన్స్ వారికి ఓ కథ చెప్పాడు. శర్వాతో సినిమా…
శర్వానంద్ ఏ ఒక్క జానర్కు ఫిక్స్ కాకుండా విభిన్న కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం అతను ‘ఒకే ఒక జీవితం’ మూవీలో చేస్తున్నాడు. అందులో శర్వా తల్లిగా అమల నటిస్తుంటే, రీతువర్మ హీరోయిన్ గా చేస్తోంది. ఇదిలా ఉంటే శర్వానంద్ నటిస్తున్న మరో సినిమా ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ విడుదల తేదీ కన్ ఫర్మ్ అయ్యింది. ఫిబ్రవరి 25న విడుదల కావాల్సిన పాన్ ఇండియా మూవీ ‘విక్రాంత్ రోణ’ వాయిదా పడటంతో అదే రోజున శర్వానంద్…
యంగ్ బ్యూటీ రష్మిక మందన్న సౌత్ బిజీ హీరోయిన్లలో ఒకరు. స్టార్ హీరోయిన్ల రేసులో కొనసాగుతున్న ఈ బ్యూటీ ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్లో కలిపి 4 అద్భుతమైన ప్రాజెక్ట్లలో పని చేస్తోంది. దసరా పండుగ సందర్భంగా రష్మిక హీరోయిన్ గా నటించిన తెలుగు రొమాంటిక్ ఎంటర్టైనర్ “ఆడవాళ్ళూ మీకు జోహార్లు” అనే సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ పోస్టర్కు అభిమానుల నుండి మంచి స్పందన లభించగా, ట్విట్టర్లో కొంతమంది మాత్రం ట్రోలింగ్ చేశారు. అందులో…
శర్వానంద్, సిద్ధార్థ్ ప్రధాన పాత్రలు పోషించిన ‘మహా సముద్రం’ చిత్రం దసరా కానుకగా ఈనెల 14న విడుదలైంది. ఇక 15వ తేదీ శర్వానంద్ కొత్త సినిమా ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ కు సంబంధించిన పోస్టర్ ను దర్శక నిర్మాతలు కిశోర్ తిరుమల, సుధాకర్ చెరుకూరి విడుదల చేశారు. హీరో శర్వానంద్ ఏ ఒక్క జానర్ కో పరిమితం అయిపోకుండా, డిఫరెంట్ స్టోరీస్ ను ఎంపిక చేసుకుంటున్నాడు. అలా ప్రస్తుతం ఈ కుటుంబ కథా చిత్రాన్ని చేస్తున్నారు. ఈ…