మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుల్గానాలోని సమృద్ధి ఎక్స్ప్రెస్ వే పై ఐరన్లోడ్ తో వెళ్తున్నలారీ బోల్తా పడింది. ఆ ఘటనలో 13 మంది మృతిచెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. టిప్పర్ లారీపై 16 మంది కూలీలు ఐరల్లోడ్పై కూర్చోని ప్రయాణం చేస్తున్నారు. సడన్గా ఎక్స్ప్రెస్ వే పై అదుపుతప్పడంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. రోడ్డుపై మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోవడంతో ఆ…
మణుగూరు సింగరేణి ఓపెన్ కాస్ట్ 2 లో ప్రమాదం చోటుచేసుకుంది. ఎమర్జెన్సీ కోసం తిరిగే బొలెరో వాహనం మీదకు డంపర్ ఎక్కింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. ప్రమాదం జరిగిన వెంటనే బాధితులను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మగ్గురు మృతి చెందినట్టు సమాచారం. సింగరేణిలో పనిచేస్తున్న ఇద్దరు కార్మికులతో పాటు బొలెరో డ్రైవర్ కూడా మృతిచెందారు. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును అంచనా వేస్తున్నారు. Read: ప్రాణాలకు తెగించి…
మంత్రి కేటీఆర్ మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నాడు. సిద్ధిపేట ఔటర్ బైపాస్ పైన, మెడికల్ కాలేజీ దగ్గరలో నిన్న రాత్రి బైక్ ఆక్సిడెంట్ చోటు చేసుకుంది. బైక్ పై వెళ్తూ ప్రమాదవశాత్తూ డివైడర్ కు ఢీ కొట్టి, తీవ్రంగా గాయపడ్డారు సిద్ధిపేటకు చెందిన ఇద్దరు ముస్లిం వ్యక్తులు. అయితే.. అదే సమయంలో సిరిసిల్ల పర్యటన ముగించుకున్న కేటీఆర్.. అదే మార్గంలో వచ్చారు. read also : మహిళలకు షాక్… మళ్లీ పెరిగిన బంగారం ధరలు ఈ నేపథ్యంలో…
నాగోల్ అల్కాపురి లో గల టాటా షో రూమ్ లో మొదటి అంతస్తు నుంచి కారు కిందపడింది. కారును కొనుగోలు చేసింది మేడిపల్లి కి చెందిన భగవత్ అనే వ్యక్తి. మొదటి అంతస్తులో ఉన్న కారును హైడ్రాలిక్ సిస్టం పై కిందికి తీసుకొనివచ్చి కారు కొనుగోలు చేసిన వ్యక్తికి ఇవ్వాలి షోరూమ్ సిబ్బంది. కానీ మొదటి అంతస్తులో ఉన్న కారును భగవత్ నడిపేందుకు షోరూం సిబ్బంది అనుమతి ఇచ్చారు. కారును స్టార్ట్ చేయడం తో హఠాత్తుగా మొదటి…
పాకిస్తాన్లో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. పంజాబ్ ప్రావిన్స్లో జరిగిన ఈ ప్రమాదంలో 30 మంది మృతి చెందారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. ఈ ప్రమాదంలో 40 మందికి గాయాలయ్యాయి. బక్రీద్ పండుగ సందర్భంగా సుమారు 70మందికి పైగా కార్మికులు సియాల్కోట్ నుంచి రజన్పూర్కు పయనమయ్యారు. వీరు ప్రయాణిస్తున్న వాహనం ముజప్పర్గడ్లోని డేరాఘాజీ ఖాన్ వద్ద ఇండస్ హైవేపై ఎదురుగా వస్తున్న కంటైనర్ను ఢీకొన్నది. ఈ ప్రమాదంలో 30 మంది అక్కడికక్కడే మృతి చెందగా 40…
ఇరాక్లోని ఓ కోవిడ్ ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ అగ్నిప్రమాదంలో 50 మంది మృతి చెందారు. మరణాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. వివరాల్లోకి వెళ్తే…ఇరాక్లోని నసీరియా పట్టణంలోని అల్ హుస్సేన్ అనే కోవిడ్ ఆసుపత్రిలో ఆక్సీజన్ ట్యాంక్ పేలింది. ఈ పెలుడు కారణంగా మంటలు పెద్దఎత్తున వ్యాపించాయి. క్షణాల వ్యవధిలోనే మంటలు కరోనా రోగులు చికిత్స పొందుతున్న కోవిడ్ వార్డుకు వ్యాపించాయి. Read: పుకార్లకు చెక్ పెట్టిన తలైవి…
రంగారెడ్డి : రాజేంద్రనగర్ మైలార్ దేవిపల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మోటర్ సైకిల్ ను సిమెంట్ రెడీ మిక్స్ లారీ ఢీ కొట్టింది. దీంతో మోటర్ సైకిల్ పై ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. లారీ చక్రాల కింద ముగ్గురు యువకులు నలిగిపోయారు. మైలార్ దేవిపల్లి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఈ రోడ్డు ప్రమాదం ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు… హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకున్నారు. అప్పటికే రోడ్డు…
హైదరాబాద్ లో మరో కారు బీభత్సం సృష్టించింది. ప్రేమావతి పేటలో ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడి పైకి దూసుకు వెళ్ళింది కారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కారు బలంగా ఢీ కొట్టడంతో బాలుడు ఒక్కసారిగా గాలిలో ఎగిరి కింద పడ్డాడు. తీవ్రగాయాలు కావడంతో బాలుడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే బాలుడి పరిస్థితి విషమంగా వున్నట్లు వైద్యులు తెలిపారు. బయట పెద్ద శబ్దం రావడంతో ఇంట్లో నుండి రోడ్డు పైకి వచ్చిన కాలనీ వాసులు……
సినీ నటుడు కత్తి మహేష్కు పెను ప్రమాదమే తప్పింది. కత్తి మహేష్ ప్రయాణిస్తోన్న కారు ముందుగా వెళుతున్న లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కత్తి మహేష్కు స్వల్ప గాయాలు అయినట్లు సమాచారం. ఈ ఘటన నిన్న అర్ధరాత్రి చోటుచేసుకుంది. అసలు వివరాల్లోకి వెళితే… నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం జాతీయ రహదారిపై ముందు వెళుతున్న లారీని కత్తి మహేష్ ఇనోవా కారు ఢీకొట్టింది. read also :మరోసారి పెరిగిన పెట్రోల్ , డీజిల్ ధరలు…