మితిమీరిన వేగం ఓ మహిళ ప్రాణం తీసింది. నార్సింగి మీర్జాగూడ చౌరస్తాలో రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న మహిళను ఢీ కొట్టిన కారు వేగంగా ముందుకు వెళ్ళబోయింది. స్పాట్ లోనే మృతి చెందింది ఓ మహిళ. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తం అయ్యారు. కారు వదిలేసి పారిపోతున్న డ్రైవర్ ను వెంబడించి పట్టుకున్న స్థానికులు. దేహ శుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. మృతురాలు అదే ప్రాంతానికి చెందిన పద్మగా గుర్తించారు. మితిమీరిన వేగం, నిర్లక్ష్యంగా…
గత నెల 12వ తేదిన విధులు ముగించుకోని ఇంటికి తిరిగివస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు గాయపడిన ఓ మహిళా కానిస్టేబుల్ చికిత్స పొందుతూ మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. జవహార్ నగర్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న జ్యోత్స్న (23)అనే మహిళ కానిస్టేబుల్ సెప్టెంబర్ 12న విధులు ముగించుకొని తన ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలు దేరింది. అయితే మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని మౌలాలి ఫ్లైఓవర్ పైకి రాగానే అనుకోకుండా జ్యోత్స్న నడుపుతున్న…
నేపాల్లో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. దసరా సందర్భంగా వలస కార్మికులు నేపాల్లోని గంజ్ నుంచి ముగు జిల్లాలోని గామ్గధికి వెళ్తుండగా బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 32 మంది మృతి చెందారు. అనేక మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో కొంతమంది పరిస్థితి తీవ్రంగా ఉన్నది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. బస్సు ఛాయనాథ్ రారా పట్టణాన్ని దాటగానే అదుపు తప్పి 300 అడుగుల లోతున్న లోయలో పడింది. దీంతో బస్సు…
దేశంలో రోజు రోజుకు రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు, రూల్స్ తీసుకువచ్చినా.. రోడ్డు ప్రమాదాల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. అతి వేగం, మద్యం సేవించి.. వాహనాలు నడపడం కారణంగా ఈ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక తాజాగా ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బారాబంకిలో బస్సు,ట్రక్కు ఒకదానికొకటి ఢీకొన్నాయ్. ఈప్రమాదంలో 9 మంది దుర్మరణం చెందారు.మరో 27 మందికి తీవ్రగాయాలయ్యాయ్. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. బస్సు ఢిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్లోని…
వినాయక నిమజ్జనం రోజున తెలంగాణ రాష్ట్రంలో విషాదం నెలకొంది. నాగర్ కర్నూల్ జిల్లా లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అయితే… ఈ ఘోర రోడ్డు ప్రమాదం లో నలుగురు వ్యక్తులు మృతి చెందారు. ఈ ఘటన వివరాల్లోకి వెళితే… నాగర్ కర్నూల్ జిల్లా… పదర మండలంలోని మద్ది మడుగు సమీపం లో దేవర కొండ డిపో బస్సును…. ఆటో ఢీ కొట్టినట్లు సమాచారం అందుతోంది. అయితే.. ఈ ఘోర ప్రమాదం లో ఏకంగా నలుగురు వ్యక్తులు…
సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంపై రాయదుర్గం సీఐ రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ… సమాచారం తెలియగానే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే ఆయనను ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించి సీసీ కెమెరా ఫుటేజీని సేకరించాము. ఐపీసీ సెక్షన్లతో పాటు మోటార్ వేహికిల్ యాక్ట్ కింద కేసు నమోదు చేసాము.ఐపీసి సెక్షన్లు 336, 279 లతో పాటు మోటార్ వేహికిల్ యాక్ట్ 184 కింద కేసు నమోదు చేసాము. తేజ్ ప్రయాణం చేసిన బైక్ స్పీడ్ ను ఎస్టిమేట్…
టాలీవుడ్ హీరో కు నిన్న సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. బైక్ పై నుంచి పడిన తేజ్ కు తీవ్ర గాయాలు కావడంతో అతడిని ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ప్రమాదం సమయంలో తేజ్ నడుపుతున్న బండి ‘త్రియంఫ్’ కంపెనీకి చెందింది. దాంతో ఆ బండి షో రూమ్ నిర్వాహకులు ప్రమాదం పై స్పందిస్తూ.. త్రియంఫ్ వెహికిల్ మిస్టేక్ ఏమాత్రం లేదు. ఒక్కో మోడల్.. ఒక్కో రకమైన ప్రత్యేకతతో డిజైన్ అవుతాయి.…
ఏపీఎస్ఆర్టీసీ బస్సు వెనుక చక్రాలు ఒక్కసారిగా ఊడిపోయాయి.. అయితే, ఓ కుదుపు కుదిపి.. ముందుకు దూసుకెళ్లినా.. బస్సులోని ప్రయాణికులు అంతా సురక్షితంగా ఉండడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తూర్పుగోదావరి జిల్లా గోకవరం నుండి మారేడుమిల్లి మీదుగా గుర్తేడు వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు వెనక చక్రాలు ఊడిపోయాయి.. వై. రామవరం మండలం ఎడ్లకొండ వద్దకు బస్సు రాగానే.. రెండు వెనుక చక్రాలు ఒక్కసారిగా బస్సు నుంచి విడిపోయాయి.. పెద్దశబ్దం రావడంతో బస్సులో ఉన్నవారితో పాటు…
నిర్మల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. అందులో ఇటీవలే పెళ్లి అయిన ఓ మహిళ ఉండటం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే…. నిర్మల్ జిల్లా కడెం మండలం పాండవ పూర్ బ్రిడ్జి వద్ద అదుపు తప్పి.. కారు బోల్తా కొట్టింది. అయితే… ఆ కారులో ప్రయాణిస్తున్న పెండ్లి కూతురు మౌనిక మరియు పెండ్లి కూతురు తండ్రి రాజాం అక్కడిక్కడే మృతి చెందారు.…
నల్గొండ జిల్లా మిర్యాలగూడ చింతపల్లి హైవే వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని శ్రీ కృష్ణ ట్రావెల్స్ బస్ ఢీ కొట్టింది. అయితే.. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. మరో పది మంది కి తీవ్ర గాయాలు అయ్యాయి. Ap39x6414 నెంబర్ గల శ్రీ కృష్ణ ట్రావెల్స్ బస్సు ఒంగోలు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇక క్షత గాత్రులను మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు…