శంషాబాద్ ఔటర్ రింగు రోడ్డు సర్విస్ రోడ్డుపై కారు భీభత్సం ఇద్దరు యువకులకు గాయాలు హాస్పిటల్ కు తరలించారు పోలీసులు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఔటర్ రింగు రోడ్డు సర్విస్ రోడ్డు చెన్నమ్మ హోటర్ వద్ద బ్రీజా కారు భీభత్సం సృష్టించి కాల్వట్టులోకి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులకు తీవ్రగాయాలు కావడంతో విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని హాస్పిటల్ కు తరలించారు. కారులో ఉన్న ఇద్దరు…
దేశరాజధాని ఢిల్లీలోని ఎయిమ్స్లో అగ్నిప్రమాదం జరిగింది. బుధవారం రాత్రి ఎయిమ్స్లోని తొమ్మిదవ అంతస్తులో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. వెంటనే అధికారులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. 22 ఫైర్ టెండర్స్ తో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. తొమ్మిదవ అంతస్తులో డయాగ్నోస్టిక్ ల్యాబ్లు, పరీక్షా విభాగాలు ఉన్నాయని, కొవిడ్ 19 నమూనాలను సేకరించిన ప్రాంతంలో మంటలు చెలరేగినట్టు అధికారులు పేర్కొన్నారు. అయితే, ఈ అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు.
చైనా పేరు చెబితేనే ప్రపంచం భయపడిపోతున్నది. చైనాలో కొత్తకొత్త వైరస్లు బయటపడుతున్నాయి. రీసెంట్గా మరో నాలుగు కొత్త కరోనా వైరస్లు బయటపడ్డాయి. ప్రపంచం కరోనాతో ఇబ్బందులు పడుతుంతే, చైనా మాత్రం అభివృద్ది దిశగా పరుగులు తీస్తున్నది. ఇక ఇదిలా ఉంటే, ఈ రోజు చైనాలో ఘోరప్రమాదం జరిగింది. చైనాలోని హుబే ప్రావిన్స్ వద్ద గ్యాస్పైప్ లైన్ పేలింది. ఈ పేలుళ్లలో 11 మంది మృత్యవాత పడ్డారు. మరో 37 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదంపై అధికారులు దర్యాప్తు…
నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బస్సులు ఢీకొనడంతో 18 మంది మృతి చేందారు. పలువురికి తీవ్రమైన గాయాలయ్యాయి. నైజీరియాలోని జిగువా ప్రాంతంలో ఎదురెదురుగా వస్తున్న రెండు బస్సులు డీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. రోడ్లు అద్వాన్నంగా ఉండటం, బస్సుల్లో రద్దీ ఎక్కువగా ఉండటంతో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదానికి రాష్ డ్రైవింగ్ కారణం అయి ఉండోచ్చని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో ఓ బస్సు డ్రైవర్ కాలు విరిగిపోయింది. ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు అ…
పాకిస్తాన్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. దక్షిణ పాకిస్తాన్లోని రెతి-దహర్కి స్టేషన్ల మద్య రెండు రైళ్లు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 30 మంది మృతి చెందారు. అనేకమందికి గాయాలయ్యాయి. లాహోర్ వైపు వెళ్తున్న సయ్యద్ ఎక్స్ప్రెస్, కరాచీ నుంచి సర్గోదా వైపు వెళ్తున్న మిల్లత్ ఎక్స్ప్రెస్లు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మిల్లత్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పడం, సయ్యద్ ఎక్స్ప్రెస్ ఢీకొనడంతో ఈ పెను ప్రమాదం జరిగింది. 8 భోగీలు పట్టాలు తప్పాయని,…
కూకట్పల్లి వై జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. మద్యం తాగి ఎదురుగా వస్తున్న బైక్ ను ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు పరిస్థితి తీవ్ర విషమంగా ఉంది. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. అయితే రోడ్డు ప్రమాదానికి ముందు ఒక్క కుక్క రోడ్డు దాటింది. జీబ్రా క్రాసింగ్ మీదుగానే ఆ కుక్క రోడ్డు దాటి వెళ్లిపోయింది. కానీ ఆ యువకుడు మాత్రం రాంగ్ రూట్ లో వెళ్లి ప్రమాదం బారిన పడ్డారు. మద్యం తాగి…
బంగ్లాదేశ్ లో ఓ ఘోర పడవ ప్రమాదం జరిగింది. బంగ్లాదేశ్ లోని పద్మ నదిలో నిత్యం వందలాది మంది పడవలపై ప్రయాణం చేస్తుంటారు. ఇసుక రవాణా అధికంగా ఈ నది గుండా జరుగుతుంది. అయితే, పద్మ నదిలో 30 మంది ప్రయాణికులతో ప్రయాణం చేస్తున్న నౌకను ఇసుక నౌక ఢీకొన్నది. ఈ ప్రమాదంలో 25 మంది మృతి చెందారు. ఐదుగురిని ప్రయాణికులను పోలీసులు రక్షించారు. అయితే, ఇంకా కొంతమంది నదిలో కొట్టుకు పోయారని, వారికోసం గాలిస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. పద్మ…
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆ జిల్లాలోని కోదాడ 65వ జాతీయ రహదారి పై మేళ్లచెరువు ఫ్లైఓవర్ వద్ద ఓ ట్రావెల్ బస్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏకంగా పది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్రమాద సమయంలో 39 మంది బస్సులో ప్రయాణిస్తున్నారు. హైద్రాబాద్ నుండి చెరుకుపల్లి వెళ్తుండగా మధ్యలో కోదాడ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికు చేరుకొని…