ఏసీబీ అధికారులంటే టక్ చేసుకుని, హుందాగా ప్రభుత్వ కార్యాలయాల్లోని అవినీతి అధికారుల భరతం పడతారు. కానీ ఆ అధికారులు మాత్రం రొటీన్ కి భిన్నంగా వ్యవహరించారు. అవినీతి అధికారుల గుండెల్లో రైళ్ళు పరిగెత్తించారు. జస్ట్ ఫర్ ఏ ఛేంజ్ అంటూ రైతుల వేషంలో లుంగీలతో మార్కెట్ యార్డులోకి ఎంటరయ్యారు. అక్కడ జరుగుతున్న తంతు అంతా స్కాన్ చేశారు. ఆ తర్వాత రికార్డులు, నగదును పట్టుకోవడంతో వచ్చింది ఎవరనేది వారికి అర్థమయింది. అనంతపురం మార్కెట్ యార్డులోకి ముగ్గురు వ్యక్తులు…
చెక్ పోస్ట్లు అవినీతికి కేరాఫ్ అడ్రస్గా మారుతున్నాయి. పలమనేరు ఆర్టీవో చెక్ పోస్ట్ పై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించడం కలకలం రేపింది. పలమనేరు కేటిల్ ఫామ్ వద్దనున్న ఆర్టీవో చెక్ పోస్ట్ పై దాడులు చేశారు. తిరుపతికి చెందిన ఏసీబీ అధికారులు నిన్న రాత్రి నుండి తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం, చిత్తూరు జిల్లా నరహరి పేట,పలమనేరు ఆర్టీఓ చెక్ పోస్ట్,లపై ఏకకాలంలో సోదాలు నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది, ఈ తనిఖీల్లో నరహరి పేట చెక్ పోస్ట్…
అధికారం చేతిలో వుంటే అవినీతి ఇంటికి నడుచుకుంటూ వచ్చేస్తుందంటారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెడుతూ అవినీతి సమ్రాట్లుగా ఎదిగిపోతున్నారు కొందరు ప్రభుత్వ ఉద్యోగులు. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం సబ్ రిజిస్ట్రార్ జేవీవీ ప్రసాదరావు భారీగా ఆస్తులు కూడబెట్టారు. ఆదాయానికి మించి ఆస్తులు వున్నాయన్న ఫిర్యాదుతో రంగంలోకి దిగారు ఏసీబీ అధికారులు. ఉదయం నుంచి సబ్ రిజిస్ట్రార్ జేవీవీ ప్రసాదరావు ఇంటిపై, కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో భారీగానే ఆస్తులు, నగదు లభించినట్టు తెలుస్తోంది.…
విశాఖ జిల్లాలో ఏసీబీ దాడులు కలకలం రేపాయి. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో గిరిజన సంక్షేమ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె.వి.ఎస్.ఎన్.కుమార్ పై దాడులు చేశారు ఏసీబీ అధికారులు. ఆయన్ని అరెస్ట్ చేశారు. పాడేరు ఐటీడీఏ లో ఇఇ గా పని చేస్తున్నారు కె.వి.ఎస్.ఎన్.కుమార్. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని ఫిర్యాదు రావడంతో నిన్న ఎనిమిది చోట్ల సోదాలు చేశారు. ప్రభుత్వ విలువ ప్రకారం రెండు కోట్ల అరవై లక్షల విలువ చేసే ఆస్తులు స్వాధీనం…
గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్న రీతిలో.. కానిస్టేబుల్ను పట్టుకుందామని వచ్చిన ఏసీబీ అధికారులకు ఓ అవినీతి ఎస్సై దొరికిపోయాడు. వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని తుముకూరు గుబ్బిన్ తాలూకాలో పోలీసులు ఓ కేసు నిమిత్తం చంద్రన్న అనే వ్యక్తి వాహనాన్ని సీజ్ చేశారు. అయితే రూ.28 వేలు లంచం తీసుకుని వాహనాన్ని వదిలిపెట్టాలని ఎస్సై సోమశేఖర్.. కానిస్టేబుల్ నయాజ్ అహ్మద్కు సూచించాడు. దీంతో బాధితుడు చంద్రన్న ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో కానిస్టేబుల్ కోసం…
సంగారెడ్డి భూకొలతల శాఖ ఏడీ మధుసూదన్రావు ఇళ్లలో ఏసీబీ దాడులు చేసింది. సోదాల్లో కోటి మూడు లక్షల నగదు, 3కేజీల బంగారం,కోటి విలువైన ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఒక భూమిని సర్వే చేసి నివేదిక ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేసారు మధుసూధన్. ఏడీ మధుసూదన్రావుతో పాటు మరో జూనియర్ ను 20 వేల లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. ఉప్పల్ లో ఉన్న మధుసూధన్ ఇంటి పై దాడులు నిర్వహించిన ఏసీబీ… మేడ్చల్ మల్కాజ్…
భూ లావాదేవీల్లో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై మంత్రి పదవి కోల్పోయిన ఈటల రాజేందర్.. ఆ తర్వాత టీఆర్ఎస్, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.. ఇక, ఆయన మంత్రిగా ఉన్న సమయంలో.. నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా పనిచేశారు.. గత ఆరేళ్లుగా ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా కొనసాగిన ఆయన.. తాజా పరిణామాల తర్వాత ఆ పదవికి కూడా రాజీనామా చేశారు. అయితే, ఇవాళ నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తున్నారు అవినీతి నిరోధక…