ACB: విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మను వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు.. అయితే, ఆలయ అధికారులు వివాదాల్లో ఇరుకున్న సందర్భాలు అనేకమే.. తాజాగా, దుర్గగుడి సూపరింటెండెంట్ నగేష్ ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు ఏసీబీ అధికారులు.. ఆదాయానికి నుంచి ఆస్తులు కలిగి ఉన్నారని ఆరోపణలపై ఈ సోదాలు జరుగుతున్నాయి.. దుర్గగుడి కార్యాలయంతో పాటు విజయవాడలోని నగేష్ నివాసంలో సోదాలు కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది.. ఇదే సమయంలో నగేష్ బంధువులు, సోదరుల ఇళ్లలోనూ ఏసీబీ తనిఖీలు చేస్తోంది.. తూర్పు గోదావరితో పాటు…
Off The Record: ఎమ్మార్వో ఆఫీసులు.. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు.. ఇతరత్రా గవర్నమెంట్ ఆఫీసులు…ఇలా ఎక్కడైతే ఉద్యోగుల చేతివాటానికి ఆస్కారం ఉంటుందో.. అలాంటి ప్రతి చోట ఏపీ ఏసీబీ విరుచుకుపడుతోంది. సోదాలు నిర్వహిస్తోంది. ఆ దాడులకు భయపడి కొందరు ఉద్యోగులు సెలవులు కూడా పెట్టేశారట. అప్పుడెప్పుడో.. రెండేళ్ళ క్రితం ఇదే తరహాలో హడావుడి చేసిన ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ ఇన్నాళ్ళు ఎందుకు నిద్ర నటించింది? మళ్ళీ ఇప్పుడే ఎందుకు కళ్ళు నులుముకుంటూ లేచిందంటే…దాని వెనక లంబా…
ఏపీలో అవినీతి అధికారులపై ఏసీబీ దాడులు నిర్వహించింది. సబ్ రిజిస్టర్ , ఎమ్మార్వో కార్యాలయాల్లో ఏసీబీ తనిఖీలు చేసింది. పలువురు అవినీతి అధికారులను ఏసీబీ అదుపులోకి తీసుకుంది. పలు డాక్యుమెంట్లు , లక్షల్లో నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్లో మరోసారి ఏసీబీ సోదాలు కలకలం రేపాయి. రాష్ట్రంలోని పలు సబ్ రిజిస్ట్రార్, తహసీల్దార్ కార్యాలయాల్లో బుధవారం ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.
కర్ణాటకలో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు పలువురు అధికారుల ఇళ్లపై మూకూమ్మడి సోదాలు నిర్వహించారు. ఏసీబీ అధికారులు ఒకేసారి 80 ప్రాంతాల్లో 21మంది ప్రభుత్వ అధికారుల ఇళ్లల్లో తనిఖీలు నిర్వహించటం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై ఏసీబీ అధికారులు సోదాలను ముమ్మరం చేశారు. Agnipath: గుడ్న్యూస్.. ‘అగ్నిపథ్’ సర్వీస్కు అర్హత వయసు పెంచిన కేంద్రం ఈ దాడుల్లో దాదాపు 300 మంది అధికారులు పాల్గొన్నారు. పలు కీలకమైన పత్రాలను…
ప్రజలను లంచాల కోసం రాబందుల్లా పీక్కుని తింటున్నారు కొంత మంది అధికారులు. ఏ పని చేయాలన్నా చేయి తడవనిదే ప్రారంభించడం లేదు. ఒక్కో పనికి ఒక్కో రేటు అంటూ లంచాలు వసూలు చేస్తున్నాయి కొన్ని డిపార్ట్మెంట్లు. అయితే తాజాగా తనను లంచం కోసం వేధించిన ఇద్దరు ఉద్యోగాలను పట్టించాడు ఓ వ్యక్తి. సనత్ నగర్ విద్యుత్ కార్యాలయంలో ఇద్దరు అధికారులు ఏసీబీ రైడ్స్ లో చిక్కారు. విద్యుత్ కార్యాలయంలో 15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు…
కర్నూలు జిల్లాలో రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో డాక్యుమెంట్ రైటర్లకు నో ఏ ఎంట్రీ నిబంధన వివాదాస్పదంగా మారింది. రిజిస్ట్రేషన్ అధికారులు డాక్యుమెంట్ రైటర్ల ద్వారా అక్రమాలకు పాల్పడుతున్నారని రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతోపాటు డాక్యుమెంట్ రైటర్లకు ఎంట్రీ లేదని చెప్పడం వివాదంగా మారింది. కర్నూలు జిల్లాలో రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో గత నెలలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కర్నూలు, కల్లూరు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లలో దాడులు నిర్వహించి డాక్యుమెంట్ రైటర్ల నుంచి అనధికార…