Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Off The Record About Acb Sudden Raids In Andhra Pradesh

Off The Record: ఏపీలో రెండేళ్ల తర్వాత నిద్రలేచిన అవినీతి నిరోధకశాఖ..! ఇప్పుడే ఎందుకు?

Published Date :April 28, 2023 , 10:15 pm
By Sudhakar Ravula
Off The Record: ఏపీలో రెండేళ్ల తర్వాత నిద్రలేచిన అవినీతి నిరోధకశాఖ..! ఇప్పుడే ఎందుకు?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Off The Record: ఎమ్మార్వో ఆఫీసులు.. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు.. ఇతరత్రా గవర్నమెంట్‌ ఆఫీసులు…ఇలా ఎక్కడైతే ఉద్యోగుల చేతివాటానికి ఆస్కారం ఉంటుందో.. అలాంటి ప్రతి చోట ఏపీ ఏసీబీ విరుచుకుపడుతోంది. సోదాలు నిర్వహిస్తోంది. ఆ దాడులకు భయపడి కొందరు ఉద్యోగులు సెలవులు కూడా పెట్టేశారట. అప్పుడెప్పుడో.. రెండేళ్ళ క్రితం ఇదే తరహాలో హడావుడి చేసిన ఆంధ్రప్రదేశ్‌ అవినీతి నిరోధక శాఖ ఇన్నాళ్ళు ఎందుకు నిద్ర నటించింది? మళ్ళీ ఇప్పుడే ఎందుకు కళ్ళు నులుముకుంటూ లేచిందంటే…దాని వెనక లంబా చౌడా స్టోరీ ఉందట. అదే ఇప్పుడు ఉద్యోగుల్లో హాట్‌ టాపిక్‌.

సీఎం జగన్మోహన్‌రెడ్డి ఇటీవల ఓ సమీక్ష నిర్వహించారు. ఏసీబీ పని తీరు ఏ మాత్రం బాగాలేదని ఆ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. దాని పర్యవసానమేనట ఈ హడావిడి అంతా. ప్రస్తుతం ఏసీబీ… తాత్కాలిక డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాధ్‌ రెడ్డి ప్రత్యక్ష పర్యవేక్షణలోనే ఉంది. ఇక నుంచి ఆ బాధ్యతలను ఏడీజీ రవిశంకర్‌ అయ్యన్నార్‌కు అప్పజెప్పాలని సూచించారు సీఎం. అయితే ఇంకా బాధ్యతల బదిలీ జరగలేదు. ఇటు రవిశంకర్‌కు గాని, అటు వేరే వారికి కానీ అప్పజెప్పలేదు. ప్రక్రియ ఇంకా కొనసాగుతోందట. ఈలోగా డీజీ రాజేంద్రనాధ్‌ రెడ్డి ఏసీబీని యాక్టివేట్‌ చేయడంతో ప్రభుత్వ కార్యాలయాలపై విరుచుకుపడుతున్నారన్నది ఉద్యోగ వర్గాల్లో జరుగుతున్న చర్చ.

Also Read

  • IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
  • Donald Trump: పాకిస్తాన్ మధ్యవర్తిత్వం విఫలం.. ట్రంప్ సంచలన నిర్ణయం..
  • Barrier Free Tolling: భారత్‌లో కొత్త రకం టోల్ విధానం.. వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా...
  • Off The Record : కాకినాడలో 'పేకాట' జోరు.. వెనుక ఉన్నది ఎమ్మెల్యేల అనుచరులేనా?

అయితే ఎవరెవరు.. ఏయే డ్యూటీలు చేయాలి? వారు సక్రమంగా చేస్తున్నారా..? లేదా..? అన్న విషయాలను కూడా నేరుగా ముఖ్యమంత్రే చూడాలా? ఉన్నతాధికారులంతా ఏం చేస్తున్నారన్న ప్రశ్నలు వస్తున్నాయి. అధికారం చేపట్టిన తొలిరోజుల్లోనే.. లైన్‌ డిపార్ట్‌మెంట్లు.. ప్రజలతో నేరుగా అనుసంధానం ఉండే శాఖల్ని ఎంపిక చేసి అక్కడ అవినీతికి ఆస్కారం లేకుండా పక్కా ప్రణాళికలు రూపొందించారు. అహ్మదాబాద్‌ ఐఐఎం నుంచి ఇందుకోసం ప్రత్యేక నివేదికలు కూడా తెప్పించుకుంది ఏపీ సర్కార్‌. తర్వాత వాటిని పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవట. ఇలా.. సీఎం సంకల్పించి ఆ బాధ్యతలను అధికారులకు అప్పజెప్పినా పూర్తిగా గాలికి వదిలేశారనే చర్చ జోరుగా సాగుతోంది. ఇప్పటికే సవాలక్ష తలనొప్పులతో ఉన్న సీఎం ఇలాంటి విషయాల మీద దృష్టి పెట్టి.. పనితీరు బాగోలేదని చెప్పేంత వరకు ఉన్నతాధికారులు పట్టించుకోకుంటే ఎలా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. సీఎం హెచ్చరించేదాకా కదలరా అనే విమర్శలు వస్తున్నాయి.

ఇదే సందర్భంలో మరో చర్చ కూడా జరుగుతోంది. సీఎం ఆదేశాల మేరకు.. ఏసీబీ బాధ్యతలను రవిశంకర్‌ అయ్యన్నార్‌కు కానీ.. వేరే వారికి కానీ అప్పజెప్పాలంటే సాంకేతిక సమస్యలు వస్తున్నాయట. ప్రస్తుతం డీజీపీగా ఉన్న రాజేంద్రనాథ్‌ రెడ్డి అసలు పోస్టింగ్‌ ఏసీబీ డీజీ. దాన్ని వేరే వారికి అప్పజెబితే ఎఫ్‌ఎసీగా కొనసాగడం సాంకేతికంగా ఇబ్బందికర వ్యవహారమట. అసలు పోస్టింగ్‌ లేకుండా అదనపు బాధ్యతలు చేపట్టడం నిబంధనల ప్రకారం కుదరదు. ఈ క్రమంలో డీజీకి వేరేశాఖనైనా అప్పగించి.. కొనసాగించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు సమాచారం. అలా కాకుండా.. నేరుగా డీజీపీ పదవినే అసలు పోస్టింగ్‌లా ఇవ్వాలంటే దీనికి డీవోపీటీ అనుమతి కావాలి. అందుకు కసిరెడ్డి సీనియార్టీ అడ్డం వస్తోంది. ఆయనకంటే సీనియర్స్‌ చాలా మంది డీజీపీ పదవి రేసులో ఉన్నారట. వారిని కాదని రాజేంద్రనాథ్‌రెడ్డి కోసం అనుమతి సాధించడం సాధ్యం అవకపోవడంతో ఏం చేయాలా అని మల్లగుల్లాలు పడుతున్నారట ప్రభుత్వ పెద్దలు. ఏదేమైనా సీఎం ఆదేశాల తర్వాత ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి పరుల భరతం పట్టే దిశగా పరుగులు పెడుతోంది ఏసీబీ.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ACB
  • ACB Raids
  • ACB Sudden Raids
  • Andhra Pradesh
  • off the record

తాజావార్తలు

  • Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!

  • IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..

  • Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!

  • Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు

  • TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions