Off The Record: ఏపీలో రెండేళ్ల తర్వాత నిద్రలేచిన అవినీతి నిరోధకశాఖ..! ఇప్పుడే ఎందుకు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: ఎమ్మార్వో ఆఫీసులు.. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు.. ఇతరత్రా గవర్నమెంట్ ఆఫీసులు…ఇలా ఎక్కడైతే ఉద్యోగుల చేతివాటానికి ఆస్కారం ఉంటుందో.. అలాంటి ప్రతి చోట ఏపీ ఏసీబీ విరుచుకుపడుతోంది. సోదాలు నిర్వహిస్తోంది. ఆ దాడులకు భయపడి కొందరు ఉద్యోగులు సెలవులు కూడా పెట్టేశారట. అప్పుడెప్పుడో.. రెండేళ్ళ క్రితం ఇదే తరహాలో హడావుడి చేసిన ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ ఇన్నాళ్ళు ఎందుకు నిద్ర నటించింది? మళ్ళీ ఇప్పుడే ఎందుకు కళ్ళు నులుముకుంటూ లేచిందంటే…దాని వెనక లంబా చౌడా స్టోరీ ఉందట. అదే ఇప్పుడు ఉద్యోగుల్లో హాట్ టాపిక్.
సీఎం జగన్మోహన్రెడ్డి ఇటీవల ఓ సమీక్ష నిర్వహించారు. ఏసీబీ పని తీరు ఏ మాత్రం బాగాలేదని ఆ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. దాని పర్యవసానమేనట ఈ హడావిడి అంతా. ప్రస్తుతం ఏసీబీ… తాత్కాలిక డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాధ్ రెడ్డి ప్రత్యక్ష పర్యవేక్షణలోనే ఉంది. ఇక నుంచి ఆ బాధ్యతలను ఏడీజీ రవిశంకర్ అయ్యన్నార్కు అప్పజెప్పాలని సూచించారు సీఎం. అయితే ఇంకా బాధ్యతల బదిలీ జరగలేదు. ఇటు రవిశంకర్కు గాని, అటు వేరే వారికి కానీ అప్పజెప్పలేదు. ప్రక్రియ ఇంకా కొనసాగుతోందట. ఈలోగా డీజీ రాజేంద్రనాధ్ రెడ్డి ఏసీబీని యాక్టివేట్ చేయడంతో ప్రభుత్వ కార్యాలయాలపై విరుచుకుపడుతున్నారన్నది ఉద్యోగ వర్గాల్లో జరుగుతున్న చర్చ.
Also Read
- యూఎస్ ఓపెన్ 2026 విజేత Alexander Zverev.. తల్లికి భావోద్వేగ నివాళి.!
- Balapur Ganesh 2026: పూరి జగన్నాథ ఆలయాన్ని తలపించేలా భారీ సెట్టింగ్.. బాలాపూర్ గణేశుడి వద్ద కనువిందు
- Ganesh Chaturthi 2026: బంగారు పూతతో మోదక్.. ధర తెలిస్తే షాకే..! వైరల్గా మారిన స్వీట్!
- Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
అయితే ఎవరెవరు.. ఏయే డ్యూటీలు చేయాలి? వారు సక్రమంగా చేస్తున్నారా..? లేదా..? అన్న విషయాలను కూడా నేరుగా ముఖ్యమంత్రే చూడాలా? ఉన్నతాధికారులంతా ఏం చేస్తున్నారన్న ప్రశ్నలు వస్తున్నాయి. అధికారం చేపట్టిన తొలిరోజుల్లోనే.. లైన్ డిపార్ట్మెంట్లు.. ప్రజలతో నేరుగా అనుసంధానం ఉండే శాఖల్ని ఎంపిక చేసి అక్కడ అవినీతికి ఆస్కారం లేకుండా పక్కా ప్రణాళికలు రూపొందించారు. అహ్మదాబాద్ ఐఐఎం నుంచి ఇందుకోసం ప్రత్యేక నివేదికలు కూడా తెప్పించుకుంది ఏపీ సర్కార్. తర్వాత వాటిని పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవట. ఇలా.. సీఎం సంకల్పించి ఆ బాధ్యతలను అధికారులకు అప్పజెప్పినా పూర్తిగా గాలికి వదిలేశారనే చర్చ జోరుగా సాగుతోంది. ఇప్పటికే సవాలక్ష తలనొప్పులతో ఉన్న సీఎం ఇలాంటి విషయాల మీద దృష్టి పెట్టి.. పనితీరు బాగోలేదని చెప్పేంత వరకు ఉన్నతాధికారులు పట్టించుకోకుంటే ఎలా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. సీఎం హెచ్చరించేదాకా కదలరా అనే విమర్శలు వస్తున్నాయి.
ఇదే సందర్భంలో మరో చర్చ కూడా జరుగుతోంది. సీఎం ఆదేశాల మేరకు.. ఏసీబీ బాధ్యతలను రవిశంకర్ అయ్యన్నార్కు కానీ.. వేరే వారికి కానీ అప్పజెప్పాలంటే సాంకేతిక సమస్యలు వస్తున్నాయట. ప్రస్తుతం డీజీపీగా ఉన్న రాజేంద్రనాథ్ రెడ్డి అసలు పోస్టింగ్ ఏసీబీ డీజీ. దాన్ని వేరే వారికి అప్పజెబితే ఎఫ్ఎసీగా కొనసాగడం సాంకేతికంగా ఇబ్బందికర వ్యవహారమట. అసలు పోస్టింగ్ లేకుండా అదనపు బాధ్యతలు చేపట్టడం నిబంధనల ప్రకారం కుదరదు. ఈ క్రమంలో డీజీకి వేరేశాఖనైనా అప్పగించి.. కొనసాగించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు సమాచారం. అలా కాకుండా.. నేరుగా డీజీపీ పదవినే అసలు పోస్టింగ్లా ఇవ్వాలంటే దీనికి డీవోపీటీ అనుమతి కావాలి. అందుకు కసిరెడ్డి సీనియార్టీ అడ్డం వస్తోంది. ఆయనకంటే సీనియర్స్ చాలా మంది డీజీపీ పదవి రేసులో ఉన్నారట. వారిని కాదని రాజేంద్రనాథ్రెడ్డి కోసం అనుమతి సాధించడం సాధ్యం అవకపోవడంతో ఏం చేయాలా అని మల్లగుల్లాలు పడుతున్నారట ప్రభుత్వ పెద్దలు. ఏదేమైనా సీఎం ఆదేశాల తర్వాత ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి పరుల భరతం పట్టే దిశగా పరుగులు పెడుతోంది ఏసీబీ.
తాజావార్తలు
-
Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గణపతి విగ్రహం.. తయ్యారు చేసింది ఎవరో తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!
-
యూఎస్ ఓపెన్ 2026 విజేత Alexander Zverev.. తల్లికి భావోద్వేగ నివాళి.!
-
Balapur Ganesh 2026: పూరి జగన్నాథ ఆలయాన్ని తలపించేలా భారీ సెట్టింగ్.. బాలాపూర్ గణేశుడి వద్ద కనువిందు
-
Assam Shocker: భార్య తల నరికి ఫ్రిజ్లో పెట్టిన నిందితుడు.. పోలీసు వాహనం నుంచి దూకి మృతి
-
Bollywood : సూపర్ హీరో కథలపై బాలీవుడ్ స్టార్ హీరోస్ మోజు
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!