ACB Raids: ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఉద్యోగులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రజలను లంచాల కోసం రాబందుల్లా పీక్కుని తింటున్నారు కొంత మంది అధికారులు. ఏ పని చేయాలన్నా చేయి తడవనిదే ప్రారంభించడం లేదు. ఒక్కో పనికి ఒక్కో రేటు అంటూ లంచాలు వసూలు చేస్తున్నాయి కొన్ని డిపార్ట్మెంట్లు. అయితే తాజాగా తనను లంచం కోసం వేధించిన ఇద్దరు ఉద్యోగాలను పట్టించాడు ఓ వ్యక్తి. సనత్ నగర్ విద్యుత్ కార్యాలయంలో ఇద్దరు అధికారులు ఏసీబీ రైడ్స్ లో చిక్కారు. విద్యుత్ కార్యాలయంలో 15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు ఏఈ అవినాష్, లైన్ ఇన్స్పెక్టర్ కృపానంద రెడ్డి.
వివరాల్లోకి వెళితే.. నగరంలోని మోతీనగర్ లో ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేసేందుకు భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి కాంట్రాక్ట్ తీసుకున్నాడు. అయితే తమకు రూ. 25 వేలు లంచంగా ఇస్తే తప్పా.. అనుమతులు మంజూరు చేయమని భాస్కర్ రెడ్డిని వేధించసాగారు. మూడు నెలలుగా ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాడు బాధితుడు. కాగా ఈ నెల 18న భాస్కర్ రెడ్డి ఏఈ అవినాష్ కి 15 వేలు, వర్క్ ఇన్స్పెక్టర్ కృపానంద రెడ్డికి రూ. 3500 ఇచ్చాడు. లంచం ఇచ్చినా కూడా ఇద్దరు అధికారుల వేధింపులు ఆగలేదు. మరో రూ.10 వేలు ఇవ్వాలంటూ వేధింపులు కొనసాగించారు. దీంతో బాధితుడు భాస్కర్ రెడ్డి ఏసీబీకి ఫిర్యాదు చేశారు. మంగళవారం ఉదయం 9 గంటలకు ఏఈ అవినాష్ , లైన్ ఇన్స్పెక్టర్ కృపానంద రెడ్డి కి 10 వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇద్దరు అధికారులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ఏసీబీ అధికారులు
Also Read
తాజావార్తలు
-
ViewSonic Google TV Series: భారత్లో ViewSonic కొత్త Google TV సిరీస్ లాంచ్.. Android 14, HDR, Dolby Audio
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
Kishan Reddy: ‘తెలుగును తొక్కిపెట్టి ఉర్దూను రుద్దారు’..! విమోచన వేడుకల్లో కీలక వ్యాఖ్యలు..
-
Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
-
US Russia Sanctions Bill Passed: అమెరికాలో రష్యా ఆంక్షల బిల్లు ఆమోదంపై భారత్ తొలి స్పందన.. ఇంధన భద్రతపై కీలక ప్రకటన
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!