No Entry Rule: రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో కొత్త రూల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్నూలు జిల్లాలో రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో డాక్యుమెంట్ రైటర్లకు నో ఏ ఎంట్రీ నిబంధన వివాదాస్పదంగా మారింది. రిజిస్ట్రేషన్ అధికారులు డాక్యుమెంట్ రైటర్ల ద్వారా అక్రమాలకు పాల్పడుతున్నారని రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతోపాటు డాక్యుమెంట్ రైటర్లకు ఎంట్రీ లేదని చెప్పడం వివాదంగా మారింది.
కర్నూలు జిల్లాలో రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో గత నెలలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కర్నూలు, కల్లూరు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లలో దాడులు నిర్వహించి డాక్యుమెంట్ రైటర్ల నుంచి అనధికార నగదు స్వాధీనం చేసుకున్నారు. కల్లూరు రిజస్ట్రేషన్ ఆఫీస్ లో రూ. 55,660, కర్నూలు రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో 40,470 అనధికార నగదు స్వాధీనం చేసుకున్నారు. కల్లూరులో 12 మంది, కర్నూలులో డాక్యుమెంట్ రైటర్లు 15 మంది నుంచి నగదు స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు. ఈ పరిణామాల నేపథ్యంలో అక్రమాలు అడ్డుకట్ట వేసేందుకు జిల్లాలోని 24 రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. డాక్యుమెంట్ రైటర్లపై ఆంక్షలు విధించారు.
Also Read
- Bhuma Akhila Priya: అహోబిలం అంశంపై స్పందించిన భూమా అఖిలప్రియ.. ‘వాస్తవాలు వెలుగులోకి రావాలి’
- Cheating: కేటుగాళ్లు కంత్రీ స్కెచ్.. ‘తల్లికి వందనం’ డబ్బులు బురిడీ
- Vallabhaneni Vamsi vs Yarlagadda Venkatrao: ఎమ్మెల్యే యార్లగడ్డకు వల్లభనేని లీగల్ నోటీసు
- YS Jagan Srikakulam Visit: వైఎస్ జగన్ శ్రీకాకుళం పర్యటనపై ఉత్కంఠ.. పోలీసుల ఆంక్షలు.. ర్యాలీలు, సభలకు నో పర్మిషన్..
రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు డాక్యుమెంట్ రైటర్లను ప్రోత్సహించి వారి చేత ధరలు నిర్ణయించి అక్రమాలకు పాల్పడుతున్నారనేది ఏసీబీ ప్రధాన ఆరోపణ. అక్రమాల నివారణకు డాక్యుమెంట్ రైటర్లు ఆఫీస్ లోకి ఎంట్రీ లేకుండా చేయాలని నిర్ణయించి ఆమేరకు ఆదేశాలు జారీ చేశారు. ఆస్తుల రిజిస్ట్రేషన్ సమయంలో అమ్మకం, కొనుగోలుదారులు, సాక్షులు మాత్రమే ఆఫీస్ లోకి వెళ్లాలని ఆంక్షలు విధించారు. ఈ ఆదేశాలు అమలయ్యేందుకు వీలుగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి రిజిస్ట్రేషన్ల ప్రక్రియను రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్ వీక్షించేలా చర్యలు చేపట్టారు. ఏవైనా అక్రమాలు బయటపడినపుడు సీసీ ఫుటేజీ ఆధారంగా చర్యలు తీసుకోవాలన్నది అధికారుల ఉద్దేశం. రిజిస్ట్రేషన్ నమూనా వెబ్ సైట్ లో ఉంచి తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో డాక్యుమెంట్లు తయారు చేసుకొని సామాన్యులు కూడా సొంతంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నది అధికారుల ఉద్దేశం.
రిజిస్ట్రేషన్ శాఖ అమలు చేస్తున్న విధానాన్ని డాక్యుమెంట్ రైటర్లు వ్యతిరేకిస్తున్నారు. డాక్యుమెంట్ రైటర్లను అక్రమార్కులుగా ముద్ర వేస్తున్నారని ఆరోపిస్తున్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవచ్చని, డాక్యుమెంట్ రైటర్లకు అనుమతి లేదని చెప్పడాన్ని వ్యతిరేకిస్తున్నారు. అమ్మకాలు, కొనుగోలు చేసే వారికి అవగాహన వుండదని, డాక్యుమెంట్లు రాయడం ద్వారా సర్వీస్ చేసి అందుకు చార్జీ మాత్రమే వసూలు చేస్తున్నామని డాక్యుమెంట్ రైటర్ల వాదన. డాక్యుమెంట్ రైటర్లకు 2002 నుంచి లైసెన్సులు లేవని, ముందుగా లైసెన్సులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అక్రమాలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకున్నా సహకరిస్తామని, లోపలికి ఎంట్రీ లేదనడంలో అర్థం లేదంటున్నారు డాక్యుమెంట్ రైటర్లు.
డాక్యుమెంట్ రైటర్లు ఆఫీసుల్లోకి రాకూడదన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకు సిద్ధమవుతున్నారు. డాక్యుమెంట్ రైటర్ల వ్యవస్థ లేకుంటే ప్రజలే ఇబ్బందులు పడతారని డాక్యుమెంట్ రైటర్లు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Off The Record: కందుకూరు పాలిటిక్స్లో కొత్త ట్విస్ట్.. మానుగుంట మహీధర్ రెడ్డి మళ్లీ రంగంలోకి?
-
OTR : హైకోర్టు తీర్పుతో BRSకు బ్రహ్మాస్త్రమా? HYDRAపై కొత్త వ్యూహంతో గ్రేటర్ ఎన్నికలే టార్గెట్!
-
Sleeping Less Than 5 Hours?: రోజుకు 5 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
-
CM Vijay: మెట్రోలో ప్రయాణించిన సీఎం విజయ్.. ప్రయాణికులతో సంభాషణ.. అభిమానులు కేరింతలు
-
China: అమెరికా శత్రువులతో చైనా ఒప్పందం.. ప్రపంచం ముందు మరో సంక్షోభం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్టాప్లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!