No Entry Rule: రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో కొత్త రూల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్నూలు జిల్లాలో రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో డాక్యుమెంట్ రైటర్లకు నో ఏ ఎంట్రీ నిబంధన వివాదాస్పదంగా మారింది. రిజిస్ట్రేషన్ అధికారులు డాక్యుమెంట్ రైటర్ల ద్వారా అక్రమాలకు పాల్పడుతున్నారని రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతోపాటు డాక్యుమెంట్ రైటర్లకు ఎంట్రీ లేదని చెప్పడం వివాదంగా మారింది.
కర్నూలు జిల్లాలో రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో గత నెలలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కర్నూలు, కల్లూరు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లలో దాడులు నిర్వహించి డాక్యుమెంట్ రైటర్ల నుంచి అనధికార నగదు స్వాధీనం చేసుకున్నారు. కల్లూరు రిజస్ట్రేషన్ ఆఫీస్ లో రూ. 55,660, కర్నూలు రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో 40,470 అనధికార నగదు స్వాధీనం చేసుకున్నారు. కల్లూరులో 12 మంది, కర్నూలులో డాక్యుమెంట్ రైటర్లు 15 మంది నుంచి నగదు స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు. ఈ పరిణామాల నేపథ్యంలో అక్రమాలు అడ్డుకట్ట వేసేందుకు జిల్లాలోని 24 రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. డాక్యుమెంట్ రైటర్లపై ఆంక్షలు విధించారు.
Also Read
- CM Chandrababu : గోవా ప్లస్గా సూర్యలంక బీచ్.. త్వరలో బాపట్ల మాస్టర్ ప్లాన్
- Job Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. 12,256 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
- Mahanadu : 'స్త్రీ శక్తి' థీమ్తో టీడీపీ మహానాడు.. 20 కీలక తీర్మానాలకు పొలిట్ బ్యూరో ఆమోదం.!
- YS Jagan: ఇంధన పొదుపు అంటూ ప్రజల చెవిలో పువ్వులు.. మీరు మాత్రం ప్రైవేట్ చాపర్స్లో షికారు..!
రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు డాక్యుమెంట్ రైటర్లను ప్రోత్సహించి వారి చేత ధరలు నిర్ణయించి అక్రమాలకు పాల్పడుతున్నారనేది ఏసీబీ ప్రధాన ఆరోపణ. అక్రమాల నివారణకు డాక్యుమెంట్ రైటర్లు ఆఫీస్ లోకి ఎంట్రీ లేకుండా చేయాలని నిర్ణయించి ఆమేరకు ఆదేశాలు జారీ చేశారు. ఆస్తుల రిజిస్ట్రేషన్ సమయంలో అమ్మకం, కొనుగోలుదారులు, సాక్షులు మాత్రమే ఆఫీస్ లోకి వెళ్లాలని ఆంక్షలు విధించారు. ఈ ఆదేశాలు అమలయ్యేందుకు వీలుగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి రిజిస్ట్రేషన్ల ప్రక్రియను రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్ వీక్షించేలా చర్యలు చేపట్టారు. ఏవైనా అక్రమాలు బయటపడినపుడు సీసీ ఫుటేజీ ఆధారంగా చర్యలు తీసుకోవాలన్నది అధికారుల ఉద్దేశం. రిజిస్ట్రేషన్ నమూనా వెబ్ సైట్ లో ఉంచి తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో డాక్యుమెంట్లు తయారు చేసుకొని సామాన్యులు కూడా సొంతంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నది అధికారుల ఉద్దేశం.
రిజిస్ట్రేషన్ శాఖ అమలు చేస్తున్న విధానాన్ని డాక్యుమెంట్ రైటర్లు వ్యతిరేకిస్తున్నారు. డాక్యుమెంట్ రైటర్లను అక్రమార్కులుగా ముద్ర వేస్తున్నారని ఆరోపిస్తున్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవచ్చని, డాక్యుమెంట్ రైటర్లకు అనుమతి లేదని చెప్పడాన్ని వ్యతిరేకిస్తున్నారు. అమ్మకాలు, కొనుగోలు చేసే వారికి అవగాహన వుండదని, డాక్యుమెంట్లు రాయడం ద్వారా సర్వీస్ చేసి అందుకు చార్జీ మాత్రమే వసూలు చేస్తున్నామని డాక్యుమెంట్ రైటర్ల వాదన. డాక్యుమెంట్ రైటర్లకు 2002 నుంచి లైసెన్సులు లేవని, ముందుగా లైసెన్సులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అక్రమాలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకున్నా సహకరిస్తామని, లోపలికి ఎంట్రీ లేదనడంలో అర్థం లేదంటున్నారు డాక్యుమెంట్ రైటర్లు.
డాక్యుమెంట్ రైటర్లు ఆఫీసుల్లోకి రాకూడదన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకు సిద్ధమవుతున్నారు. డాక్యుమెంట్ రైటర్ల వ్యవస్థ లేకుంటే ప్రజలే ఇబ్బందులు పడతారని డాక్యుమెంట్ రైటర్లు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Cockroach Janta Party: “కాక్రోచ్ జనతా పార్టీ” ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
-
CSK Vs GT: చెన్నైపై గుజరాత్ టైటాన్స్ వీర బాదుడు.. ముగ్గురు బ్యాట్స్మెన్స్ హాఫ్ సెంచరీలు.. టార్గెట్ ఎంతంటే..
-
New York Floods: న్యూయార్క్లో ఆకస్మిక వరదలు.. కొట్టుకుపోయిన మహిళ.. వీడియో వైరల్
-
CM Chandrababu : గోవా ప్లస్గా సూర్యలంక బీచ్.. త్వరలో బాపట్ల మాస్టర్ ప్లాన్
-
BJP: 20 ఏళ్లు బీజేపీదే హవా, కాంగ్రెస్ కష్టమే: యాక్సిస్ మై ఇండియా చీఫ్..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!