Telangana: కీలక నిర్ణయం దిశగా తెలంగాణ ప్రభుత్వం.. పదో తరగతి మార్కుల ఆధారంగా ఒకొక్కరికీ రూ.2500..
- విద్యార్థులకు స్కూటర్ పంపిణీ ప్రతిపాదన..
- 10వ తరగతి విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్ పథకం..
- దివ్యాంగులకు రవాణా సౌకర్యం ఏర్పాటు చేసే యోచనలో విద్యాశాఖ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుకునే విద్యార్థులకు మరింత ప్రోత్సాహం అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. విద్యార్థుల చదువులకు రవాణా ఇబ్బందులు అడ్డుకాకూడదని, అలాగే ప్రతిభ గల విద్యార్థులను ఆర్థికంగా ఆదుకోవాలనే లక్ష్యంతో విద్యాశాఖ రెండు సరికొత్త పథకాలపై కసరత్తు చేస్తోంది. ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపితే.. వచ్చే విద్యా సంవత్సరం నుండి వేల సంఖ్యలో విద్యార్థులు లబ్ధి పొందనున్నారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల కోసం విద్యాశాఖ ఒక వినూత్న ప్రతిపాదనను సిద్ధం చేసింది. ముఖ్యంగా సమాజంలో వెనుకబడిన లేదా శారీరక ఇబ్బందులు ఎదుర్కొంటున్న దివ్యాంగ (Disabled) విద్యార్థులకు, అలాగే ట్రాన్స్జెండర్ విద్యార్థులకు రవాణా సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది. వీరికి ప్రత్యేకంగా రూపొందించిన స్కూటర్లను పంపిణీ చేయడం ద్వారా వారు కళాశాలకు సులభంగా చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. వీటితో పాటు మెరిట్ సాధించిన విద్యార్థులకు కూడా ఈ స్కూటర్లను అందజేసే ఆలోచనలో విద్యాశాఖ ఉంది.
Also Read
- Vijayawada: భక్తులకు సువర్ణావకాశం.. ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ఉచిత యోగా శిక్షణ
- Prashant Kishor: రూ.10 వేలతో ఓట్లు కొని గెలిచారు.. నితీష్కుమార్పై మరోసారి ప్రశాంత్ కిషోర్ విమర్శలు
- Rama Nandana: యూట్యూబర్స్ ‘గలీజ్ దందా’ స్కామ్.. రంగంలోకి దిగిన తెలంగాణ పోలీస్..
- Sourav Ganguly: మమతకు మద్దతుగా యూసుఫ్ పఠాన్ను గంగూలీ రాజీనామా చేయమన్నారా..? ఇదిగో క్లారిటీ..
Also Read:Gas Cylinder: గృహ వినియోగదారులకు శుభవార్త.. కేంద్రం కీలక ప్రకటన
పదో తరగతి మెరిట్ విద్యార్థులకు ఆర్థిక భరోసా..
కేవలం రవాణా సౌకర్యమే కాకుండా.. పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఆర్థికంగా అండగా నిలవాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రతీ ఏటా ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి పూర్తి చేసి.. మెరిట్ సాధించిన సుమారు 40 వేల మంది విద్యార్థులను ఎంపిక చేయనున్నారు. వీరికి స్కాలర్షిప్ కింద ప్రతీ ఏడాది రూ. 2,500 చొప్పున అందించే దిశగా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఈ నగదు నేరుగా విద్యార్థుల ఉన్నత చదువుల ఖర్చులకు ఉపయోగపడనుంది.
ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ డిగ్రీ , బీటెక్ విద్యార్థినుల కోసం ఒక కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ కాలేజీల్లో చదువుకునే విద్యార్థినులకు ఉచితంగా ‘ఎలక్ట్రిక్ (EV) స్కూటీలు’ అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇప్పుడు విద్యాశాఖ ప్రతిపాదించిన కొత్త పథకాలు కూడా దీనికి తోడైతే, ప్రభుత్వ విద్యా సంస్థల పట్ల విద్యార్థుల్లో మరింత ఆసక్తి పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు పథకాలు ప్రతిపాదన దశలో ఉన్నాయి. ప్రభుత్వం వీటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, బడ్జెట్లో నిధులు కేటాయిస్తే వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలులోకి రానున్నాయి. ఈ నిర్ణయం వల్ల వేల మంది పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది.
తాజావార్తలు
-
Vijayawada: భక్తులకు సువర్ణావకాశం.. ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ఉచిత యోగా శిక్షణ
-
Prashant Kishor: రూ.10 వేలతో ఓట్లు కొని గెలిచారు.. నితీష్కుమార్పై మరోసారి ప్రశాంత్ కిషోర్ విమర్శలు
-
Rama Nandana: యూట్యూబర్స్ ‘గలీజ్ దందా’ స్కామ్.. రంగంలోకి దిగిన తెలంగాణ పోలీస్..
-
Sourav Ganguly: మమతకు మద్దతుగా యూసుఫ్ పఠాన్ను గంగూలీ రాజీనామా చేయమన్నారా..? ఇదిగో క్లారిటీ..
-
IND Vs AFG: అదరగొట్టిన భారత బ్యాటర్లు.. తొలిరోజే రెండు సెంచరీలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!