Telangana University: తెలంగాణ వర్సిటీలో ఏసీబీ దూకుడు.. నియామకాల్లో అక్రమాలపై విచారణ
Telangana University: నిజామాబాద్ తెలంగాణ యూనివర్సిటీ లో ఏసీబీ దర్యాప్తు కొనసాగుతుంది. భిక్నూర్ సౌత్ క్యాంపస్ లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ఏసీబీ అధికారులు విచారించారు. వీసీ రవీందర్ గుప్తా అక్రమాలపై ఏసీబీ దూకుడు పెంచింది. నియామకాల్లో భారీగా అక్రమ వసూళ్లు జరిగినట్లు ఫిర్యాదులు అందడంతో ఏసీబీ దర్యాప్తు చేస్తుంది. ఈసీని కలవకుండా, సమావేశాలకు హాజరుకాకుండా వివాదాస్పద రీతిలో వ్యవహరిస్తున్న తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రవీందర్ గుప్తా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి చిక్కిన విషయం తెలిసిందే. అదనపు పరీక్షా కేంద్రాన్ని అనుమతించేందుకు ఈనెల 17వ తేదీ ఉదయం హైదరాబాద్ లోని తన నివాసంలో రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. హైదరాబాద్లో ఈసీ సమావేశం జరిగిన రోజే ఆయన అరెస్ట్ తెలంగాణ యూనివర్సిటీలో కలకలం రేపింది.
ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ మాట్లాడుతూ.. రవీందర్ గుప్తా రూ. 50 వేలు డిమాండ్ చేశారు. దీంతో దాసరి శంకర్ ఈ నెల 14న ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈనెల 17న (శనివారం) ఉదయం తార్నాకలోని గుప్తా నివాసం పరిసరాలకు ఏసీబీ అధికారులు చేరుకున్నారు. దాసరి శంకర్ నుంచి రూ.50 వేలు తీసుకుని గుప్తా ఇంట్లోకి ప్రవేశించాడు. మాస్టర్ బెడ్రూమ్లోని అల్మారాలో దాచిన రూ. 50 వేలు గుర్తించారు. ఇంట్లో చాలా సేపు వెతికారు. ఏసీబీకి చెందిన మరో బృందం తెలంగాణ యూనివర్సిటీకి వెళ్లి తనిఖీలు నిర్వహించింది. హైదరాబాద్లోని పరీక్షల నియంత్రణాధికారిని క్యాంపస్కు పిలిపించి వివరాలు సేకరించారు. గుప్తాను అరెస్టు చేసి ఏసీబీ కేసుల నిమిత్తం ప్రత్యేక కోర్టుకు తరలించారు. అంతకుముందు మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు గుప్తా ‘నో కామెంట్’ అన్నారు. గుప్తా ఆస్తులపై విచారణ జరుపుతామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు.
Also Read
- BRS: కవిత కొత్త పార్టీపై బీఆర్ఎస్ సెటైర్.. డూప్లికేట్ కోల్గేట్, బిస్లెరీ ఫొటోలతో ట్వీట్..
- Kavitha: కవిత 'TRS' పార్టీ 5 భారీ హామీలు ఇవే.. విద్య, వైద్యం ఉచితం.. 4 లక్షల ఉద్యోగాలే లక్ష్యం!
- Kalvakuntla Kavitha: గుంట నక్కల మధ్య బందీ అయిన మనిషి కేసీఆర్.. కవిత సంచలన వ్యాఖ్యలు
- Kavitha New Party Launch: కవిత కొత్త పార్టీ పేరు ప్రకటన.. బీఆర్ఎస్కు బిగ్ షాక్..
కాగా, రెండు నెలలుగా ఈసీ సమావేశాలకు వీసీ హాజరుకావడం లేదు. యాదగిరిని రిజిస్ట్రార్గా నియమించేందుకు నిరుడు ఈసీ సభ్యులు తమ సమావేశంలో నిర్ణయించగా గుప్తా అంగీకరించలేదు. నెలల తరబడి వర్సిటీలో జీతాలు, ఇతర చెల్లింపులను వీసీ నిలిపివేయడంతో ఔట్ సోర్సింగ్ సిబ్బంది, విద్యార్థులు ఆందోళనకు దిగారు. వీసీ యాదగిరిని రిజిస్ట్రార్గా నియమిస్తూ జూన్ 16న శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈనేపథ్యంలో తాజాగా వీసీ రవీందర్ గుప్తా లంచం తీసుకుంటూ ఏసీబీకీ పట్టుబడటం గమనార్హం.
Mega Princess: మెగా ప్రిన్సెస్ కి గ్రాండ్ వెల్కమ్…
తాజావార్తలు
-
Viral Video: అంత్యక్రియల్లో అశ్లీల డ్యాన్స్లు.. అవాక్కైన నెటిజన్లు
-
Minister Dola Bala Veera Anjaneya Swamy: విజయసాయి రెడ్డికి మంత్రి డోలా కౌంటర్.. పగటి కలలు మానుకో..!
-
BRS: కవిత కొత్త పార్టీపై బీఆర్ఎస్ సెటైర్.. డూప్లికేట్ కోల్గేట్, బిస్లెరీ ఫొటోలతో ట్వీట్..
-
Ajit Doval: ‘‘మనమంతా ఒకే పడవలోని ప్రయాణికులం’’.. ముస్లిం మేధావులతో అజిత్ దోవల్ కీలక భేటీ
-
Reliance Q4 FY26 Results: రిలయన్స్ ఇన్వెస్టర్లకు షాక్.. ఆదాయం పెరిగినా లాభం ఎందుకు తగ్గింది? అంబానీ రిపోర్ట్ కార్డ్ ఇదే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!