Telangana University: తెలంగాణ వర్సిటీలో ఏసీబీ దూకుడు.. నియామకాల్లో అక్రమాలపై విచారణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana University: నిజామాబాద్ తెలంగాణ యూనివర్సిటీ లో ఏసీబీ దర్యాప్తు కొనసాగుతుంది. భిక్నూర్ సౌత్ క్యాంపస్ లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ఏసీబీ అధికారులు విచారించారు. వీసీ రవీందర్ గుప్తా అక్రమాలపై ఏసీబీ దూకుడు పెంచింది. నియామకాల్లో భారీగా అక్రమ వసూళ్లు జరిగినట్లు ఫిర్యాదులు అందడంతో ఏసీబీ దర్యాప్తు చేస్తుంది. ఈసీని కలవకుండా, సమావేశాలకు హాజరుకాకుండా వివాదాస్పద రీతిలో వ్యవహరిస్తున్న తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రవీందర్ గుప్తా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి చిక్కిన విషయం తెలిసిందే. అదనపు పరీక్షా కేంద్రాన్ని అనుమతించేందుకు ఈనెల 17వ తేదీ ఉదయం హైదరాబాద్ లోని తన నివాసంలో రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. హైదరాబాద్లో ఈసీ సమావేశం జరిగిన రోజే ఆయన అరెస్ట్ తెలంగాణ యూనివర్సిటీలో కలకలం రేపింది.
ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ మాట్లాడుతూ.. రవీందర్ గుప్తా రూ. 50 వేలు డిమాండ్ చేశారు. దీంతో దాసరి శంకర్ ఈ నెల 14న ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈనెల 17న (శనివారం) ఉదయం తార్నాకలోని గుప్తా నివాసం పరిసరాలకు ఏసీబీ అధికారులు చేరుకున్నారు. దాసరి శంకర్ నుంచి రూ.50 వేలు తీసుకుని గుప్తా ఇంట్లోకి ప్రవేశించాడు. మాస్టర్ బెడ్రూమ్లోని అల్మారాలో దాచిన రూ. 50 వేలు గుర్తించారు. ఇంట్లో చాలా సేపు వెతికారు. ఏసీబీకి చెందిన మరో బృందం తెలంగాణ యూనివర్సిటీకి వెళ్లి తనిఖీలు నిర్వహించింది. హైదరాబాద్లోని పరీక్షల నియంత్రణాధికారిని క్యాంపస్కు పిలిపించి వివరాలు సేకరించారు. గుప్తాను అరెస్టు చేసి ఏసీబీ కేసుల నిమిత్తం ప్రత్యేక కోర్టుకు తరలించారు. అంతకుముందు మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు గుప్తా ‘నో కామెంట్’ అన్నారు. గుప్తా ఆస్తులపై విచారణ జరుపుతామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు.
Also Read
- Hyderabad: అమీర్పేట్లో భారీ అగ్ని ప్రమాదం.. పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న మంటలు
- Ramchander Rao: కాక్రోచ్ పార్టీ వెనుక ఉన్నది వాళ్లే.. బీజేపీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు..
- Telangana Heatwave: మండిపోతున్న ఎండలు.. వడదెబ్బతో ఆ జిల్లాలో ఒకే రోజు ముగ్గురు మృతి..
- Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. భుజంగరావుకు 14 రోజుల రిమాండ్
కాగా, రెండు నెలలుగా ఈసీ సమావేశాలకు వీసీ హాజరుకావడం లేదు. యాదగిరిని రిజిస్ట్రార్గా నియమించేందుకు నిరుడు ఈసీ సభ్యులు తమ సమావేశంలో నిర్ణయించగా గుప్తా అంగీకరించలేదు. నెలల తరబడి వర్సిటీలో జీతాలు, ఇతర చెల్లింపులను వీసీ నిలిపివేయడంతో ఔట్ సోర్సింగ్ సిబ్బంది, విద్యార్థులు ఆందోళనకు దిగారు. వీసీ యాదగిరిని రిజిస్ట్రార్గా నియమిస్తూ జూన్ 16న శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈనేపథ్యంలో తాజాగా వీసీ రవీందర్ గుప్తా లంచం తీసుకుంటూ ఏసీబీకీ పట్టుబడటం గమనార్హం.
Mega Princess: మెగా ప్రిన్సెస్ కి గ్రాండ్ వెల్కమ్…
తాజావార్తలు
-
Electricity Bill: ఇంట్లో ఈ పరికరాలే మీ కరెంట్ బిల్లును పెంచుతున్నాయా? అసలు నిజం ఇదే
-
Chiranjeevi: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న చిరంజీవి ట్వీట్..’తండ్రిగా మాత్రమే కాదు.. నటుడిగా కూడా గర్వపడుతున్నా’
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Crime Thriller OTT : నమ్మిన వాళ్లే వెన్నుపోటు పొడిస్తే… ఓటీటీలోకి గూస్ బంప్స్ తెప్పించే కన్నడ క్రైమ్ థ్రిల్లర్
-
Hyderabad: అమీర్పేట్లో భారీ అగ్ని ప్రమాదం.. పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న మంటలు
ట్రెండింగ్
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!