Telangana University: తెలంగాణ వర్సిటీలో ఏసీబీ దూకుడు.. నియామకాల్లో అక్రమాలపై విచారణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana University: నిజామాబాద్ తెలంగాణ యూనివర్సిటీ లో ఏసీబీ దర్యాప్తు కొనసాగుతుంది. భిక్నూర్ సౌత్ క్యాంపస్ లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ఏసీబీ అధికారులు విచారించారు. వీసీ రవీందర్ గుప్తా అక్రమాలపై ఏసీబీ దూకుడు పెంచింది. నియామకాల్లో భారీగా అక్రమ వసూళ్లు జరిగినట్లు ఫిర్యాదులు అందడంతో ఏసీబీ దర్యాప్తు చేస్తుంది. ఈసీని కలవకుండా, సమావేశాలకు హాజరుకాకుండా వివాదాస్పద రీతిలో వ్యవహరిస్తున్న తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రవీందర్ గుప్తా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి చిక్కిన విషయం తెలిసిందే. అదనపు పరీక్షా కేంద్రాన్ని అనుమతించేందుకు ఈనెల 17వ తేదీ ఉదయం హైదరాబాద్ లోని తన నివాసంలో రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. హైదరాబాద్లో ఈసీ సమావేశం జరిగిన రోజే ఆయన అరెస్ట్ తెలంగాణ యూనివర్సిటీలో కలకలం రేపింది.
ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ మాట్లాడుతూ.. రవీందర్ గుప్తా రూ. 50 వేలు డిమాండ్ చేశారు. దీంతో దాసరి శంకర్ ఈ నెల 14న ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈనెల 17న (శనివారం) ఉదయం తార్నాకలోని గుప్తా నివాసం పరిసరాలకు ఏసీబీ అధికారులు చేరుకున్నారు. దాసరి శంకర్ నుంచి రూ.50 వేలు తీసుకుని గుప్తా ఇంట్లోకి ప్రవేశించాడు. మాస్టర్ బెడ్రూమ్లోని అల్మారాలో దాచిన రూ. 50 వేలు గుర్తించారు. ఇంట్లో చాలా సేపు వెతికారు. ఏసీబీకి చెందిన మరో బృందం తెలంగాణ యూనివర్సిటీకి వెళ్లి తనిఖీలు నిర్వహించింది. హైదరాబాద్లోని పరీక్షల నియంత్రణాధికారిని క్యాంపస్కు పిలిపించి వివరాలు సేకరించారు. గుప్తాను అరెస్టు చేసి ఏసీబీ కేసుల నిమిత్తం ప్రత్యేక కోర్టుకు తరలించారు. అంతకుముందు మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు గుప్తా ‘నో కామెంట్’ అన్నారు. గుప్తా ఆస్తులపై విచారణ జరుపుతామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు.
Also Read
- Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
- Uber: గుడ్ న్యూస్.. హైదరాబాద్ లో ఉబెర్ సంస్థ భారీ విస్తరణ..
- Former Maoist leader: 42 ఏళ్ల తర్వాత మళ్లీ విద్యార్థిగా మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ.. ఇంటర్ పరీక్షకు సిద్ధం!
- Hyderabad: మరోసారి నేపాలీ గ్యాంగ్ హల్చల్.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, పక్కా ప్లాన్తో దోపిడీ!
కాగా, రెండు నెలలుగా ఈసీ సమావేశాలకు వీసీ హాజరుకావడం లేదు. యాదగిరిని రిజిస్ట్రార్గా నియమించేందుకు నిరుడు ఈసీ సభ్యులు తమ సమావేశంలో నిర్ణయించగా గుప్తా అంగీకరించలేదు. నెలల తరబడి వర్సిటీలో జీతాలు, ఇతర చెల్లింపులను వీసీ నిలిపివేయడంతో ఔట్ సోర్సింగ్ సిబ్బంది, విద్యార్థులు ఆందోళనకు దిగారు. వీసీ యాదగిరిని రిజిస్ట్రార్గా నియమిస్తూ జూన్ 16న శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈనేపథ్యంలో తాజాగా వీసీ రవీందర్ గుప్తా లంచం తీసుకుంటూ ఏసీబీకీ పట్టుబడటం గమనార్హం.
Mega Princess: మెగా ప్రిన్సెస్ కి గ్రాండ్ వెల్కమ్…
తాజావార్తలు
-
Karuppu Release : ఆర్థిక ఇబ్బందుల కారణంగా ‘కరుప్పు’ రిలీజ్ వాయిదా.. టికెట్ డబ్బులు వాపస్
-
నేడే ఏపీ Cabinet Meeting.. రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులకు గ్రీన్సిగ్నల్.. పొదుపు చర్యలపై కీలక చర్చ!
-
Sarah Taylor: చారిత్రక నిర్ణయం.. పురుషుల జట్టుకు తొలి మహిళా కోచ్ గా సారా టేలర్..
-
Thursday Horoscope: ఆ రాశి వారు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాల్సిందే.. లేదా తిప్పలు తప్పవ్..!
-
Israeli base in Iraq: ప్రపంచ రాజకీయాల్లో భారీ ప్రకంపనలు.. ఇరాక్లో ఇజ్రాయెల్ రహస్య స్థాపరం..!
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!