Delhi Air Pollution: దేశ రాజధాని ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యాన్ని అదుపు చేసేందుకు ఢిల్లీ ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది. నిన్న ఏయిర్ పొల్యూషన్పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. కాలుష్యంపై హర్యానా, పంజాబ్, ఉత్తర్ప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. పంట వ్యర్థాల కాల్చివేతను ఎలాగైనా అడ్డుకోవాల్సిందే అని నాలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు స్పష్టం చేసింది. దీంతో పాటే ఢిల్లీలో యాప్ బేస్డ్ క్యాబులపై నిషేధం విధించాలని ఆప్ ప్రభుత్వానికి సూచించింది.
Arvind Kejriwal: వచ్చే ఏడాది హర్యానా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. పంజాబ్ లో 117 స్థానాలకు గానూ 92 సీట్లు గెలుచుకుని అధికారంలోకి వచ్చినట్లే హర్యానలో కూడా పాగా వేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) చూస్తోంది. ఈ నేపథ్యంలో ఆదివారం ఆప్ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆ రాష్ట్రంలో పర్యటించారు. హర్యానాలోని రోహ్తక్లో జరిగిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు.
Supreme Court: సెలెక్ట్ కమిటీ వ్యవహారంలో పార్లమెంట్ నుంచి సస్పెన్షన్ ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దాకు సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. ఈ విషయంలో రాజ్యసభ ఛైర్మన్ని క్షమాపణలు కోరాలని అత్యున్నత న్యాయస్థానం సూచించింది. రాఘవ్ చద్దా సస్పెన్షన్ కేసులో ఈ రోజు కోర్టు విచారణ జరిపింది. ఎంపీ క్షమాపణలను సానుభూతితో పరిగణించాలని రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ని సుప్రీం సూచించింది. విచారణ సమయంలో రెండు పక్షాలు ముందుకు వెళ్లే…
ED Raid: సివిల్ లైన్స్లోని ఢిల్లీ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రాజ్ కుమార్ ఆనంద్ అధికారిక నివాసంపై ఈడీ దాడులు చేసింది. దిగుమతులపై కస్టమ్ డ్యూటీని ఆదా చేసేందుకు ఈడీకి తప్పుడు ప్రకటనలు ఇచ్చిన రాజ్కుమార్ ఆనంద్ ఇంటిపై మనీలాండరింగ్ చర్య తీసుకోబడింది.
Arvind Kejriwal : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ఈడీ నోటీసులు పంపింది. నవంబర్ 2న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆయనను విచారణకు పిలిచింది.
Mamata Banerjee: బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బుధవారం బీజేపీపై విరుచుకుపడ్డారు. వచ్చే నెలలో రాష్ట్రాల ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికల ముందు ప్రతిపక్ష పార్టీల నేతలను అరెస్ట్ చేయడానికి బీజేపీ కుట్ర పన్నుతోందని ఆరోపించారు. ఇందుకు ఆప్ నేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నుంచే అరెస్టులు ప్రారంభించారని ఆమె ఆరోపించారు.
ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించడంపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) యోచిస్తోంది.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భారతీయ జనతా పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. దేశ పురోగతికి బీజేపీ ఒక్క పని కూడా చేయలేదని అన్నారు. అంతేకాకుండా.. బీజేపీకి ప్రత్యామ్నాయంగా భారత్ కూటమిని ప్రజలు చూస్తున్నారని తెలిపారు. నేడు దేశం మూడు సమస్యలను ఎదుర్కొంటోందని కేజ్రీవాల్ అన్నారు. అందులో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, అవినీతి ఉన్నాయని తెలిపారు.
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎంపీ సంజయ్ సింగ్ని ఈడీ అరెస్ట్ చేసింది. ఈ కేసులో ఇప్పటి వరకు ముగ్గురు కీలక ఆప్ నేతలు జైళ్లలో ఉన్నారు. సత్యేంద్ర జైన్, మనీష్ సిసోడియాల తర్వాత ఇప్పుడు సంజయ్ సింగ్ జైలులోకి వెళ్లారు.