Arvind Kejriwal: మోడీపై సోషల్ మీడియా పోస్టులు.. ప్రియాంకాగాంధీ, కేజ్రీవాల్కి ఈసీ షోకాజ్ నోటీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arvind Kejriwal: ప్రధాని నరేంద్రమోడీకి వ్యతిరేకంగా కించపరిచేలా, అవమానకరమైన పోస్టులను షేర్ చేసినందుకు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సోషల్ మీడియా పోస్టుల్లో ప్రధానికి వ్యతిరేకంగా చేసిన ప్రకటనపై గురువారం లోగా వివరణ ఇవ్వాలని ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కి నోటీసులు ఇచ్చింది. ఇలాంటి నోటీసులే కాంగ్రెస్ నేత ప్రియాంకాగాంధీకి కూడా ఈసీ పంపింది. మధ్యప్రదేశ్ ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోడీకి వ్యతిరేకంగా తప్పుడు, నిర్థారించని వ్యాఖ్యలు చేశారని ప్రియాంకాగాంధీపై బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. గురువారం రాత్రి 8 గంటలలోపు ఆమె ప్రకటనలపై వివరణ ఇవ్వానలి ఈసీ కోరింది.
Read Also: PM Modi: “మూర్ఖులకు రాజు”.. రాహుల్ గాంధీ ‘మేడ్ ఇన్ చైనా’ వ్యాఖ్యలపై ప్రధాని ఫైర్..
Also Read
- Maruti Suzuki: బిగ్ అలర్ట్.. కారు కొనాలనుకుంటే ఇప్పుడే కొనేయండి.. భారీగా పెరగనున్న ధరలు..
- Preity Zinta Support Student Protests: విద్యార్థుల ఉద్యమానికి మద్దతు.. ప్రీతి జింటా చేసిన వ్యాఖ్యలు వైరల్
- CJP Protest: పేద-ధనిక భేదం లేకుండా విద్యార్థుల పోరు.. 2012 నిర్భయ ఘటన తర్వాత ఢిల్లీలో మళ్లీ ఆ స్థాయి విప్లవం!
- TVK: నీట్ను పూర్తిగా రద్దు చేయాలి.. టీవీకే పార్టీ సంచలన డిమాండ్
నోటీసు ప్రకారం.. బీజేపీ నాయకులు చేసిన ఫిర్యాదులో ఆప్ ఎక్స్(ట్విట్టర్)లో రెండు పోస్టుల్లో బీజేపీ స్టార్ క్యాంపెనర్ ప్రధాని మోడీని కించపరిచేలా, అవమాకరమైనవిధంగా పరువు నష్టం కలిగించే విధంగా చిత్రీకరించాయని పేర్కొంది. ఎన్నికల్లో పోటీ చేసే బీజేపీ నేతల అభ్యర్థిత్వానికి ప్రతికూలంగా ప్రభావితం చేసేలా దురుద్దేశంతో పోస్టులను షేర్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘‘రాష్ట్ర ఎన్నికల్లో అభ్యర్థులకు వ్యతిరేకంగా ప్రత్యారోపణలు, దూషణల ద్వారా ఎన్నిలక నియమావళిని ఉల్లంఘించినందుకు తగిన చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలని, నిర్ణీత సమయంలో మీనుంచి స్పందన రాని పక్షంలో, ఎన్నికల సంఘం మీకు తదుపరి సూచన చేయకుండా తగిన చర్యలు తీసుకుంటుందని ఆప్కి పోల్ ప్యానెల్ తెలిపింది.
నవంబర్ 10న బీజేపీ ఎన్నికల కమిషన్(ఈసీ)ని ఆశ్రయించింది. ప్రధాని మోడీపై సోషల్ మీడియాలో అనైతిక వీడియోల క్లిప్స్, వ్యాఖ్యలు పోస్ట్ చేసింనదుకు ఆప్ పై చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ, పార్టీ జాతీయ మీడియా ఇన్ఛార్జ్ మరియు రాజ్యసభ ఎంపీ అనిల్ బలూనీ, పార్టీ నాయకుడు ఓం పాఠక్లతో కూడిన బీజేపీ ప్రతినిధి బృందం ఈ అంశంపై పోల్ ప్యానెల్ను సంప్రదించింది.
తాజావార్తలు
-
Karimnagar: అర్ధరాత్రి దొంగల బీభత్సం.. కత్తులు, తుపాకులతో బెదిరించి.. రూ. 50 లక్షలు అపహరణ.!
-
Maruti Suzuki: బిగ్ అలర్ట్.. కారు కొనాలనుకుంటే ఇప్పుడే కొనేయండి.. భారీగా పెరగనున్న ధరలు..
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
Preity Zinta Support Student Protests: విద్యార్థుల ఉద్యమానికి మద్దతు.. ప్రీతి జింటా చేసిన వ్యాఖ్యలు వైరల్
ట్రెండింగ్
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్టాప్లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!