Arvind Kejriwal: మోడీపై సోషల్ మీడియా పోస్టులు.. ప్రియాంకాగాంధీ, కేజ్రీవాల్కి ఈసీ షోకాజ్ నోటీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arvind Kejriwal: ప్రధాని నరేంద్రమోడీకి వ్యతిరేకంగా కించపరిచేలా, అవమానకరమైన పోస్టులను షేర్ చేసినందుకు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సోషల్ మీడియా పోస్టుల్లో ప్రధానికి వ్యతిరేకంగా చేసిన ప్రకటనపై గురువారం లోగా వివరణ ఇవ్వాలని ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కి నోటీసులు ఇచ్చింది. ఇలాంటి నోటీసులే కాంగ్రెస్ నేత ప్రియాంకాగాంధీకి కూడా ఈసీ పంపింది. మధ్యప్రదేశ్ ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోడీకి వ్యతిరేకంగా తప్పుడు, నిర్థారించని వ్యాఖ్యలు చేశారని ప్రియాంకాగాంధీపై బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. గురువారం రాత్రి 8 గంటలలోపు ఆమె ప్రకటనలపై వివరణ ఇవ్వానలి ఈసీ కోరింది.
Read Also: PM Modi: “మూర్ఖులకు రాజు”.. రాహుల్ గాంధీ ‘మేడ్ ఇన్ చైనా’ వ్యాఖ్యలపై ప్రధాని ఫైర్..
Also Read
- Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
- West Bengal: అక్రమ బంగ్లాదేశీయుల బహిష్కరణ.. బెంగాల్లో సీఏఏ స్టార్ట్..
- Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో ఎన్ఐఏ సంచలన ఛార్జిషీట్.. ఆ ఇద్దరి గైడ్స్ ఎంత పని చేశారంటే..!
- Congress: డీఎంకే వల్ల కాలేదు, 59 ఏళ్ల కాంగ్రెస్ కోరిక తీర్చిన విజయ్..
నోటీసు ప్రకారం.. బీజేపీ నాయకులు చేసిన ఫిర్యాదులో ఆప్ ఎక్స్(ట్విట్టర్)లో రెండు పోస్టుల్లో బీజేపీ స్టార్ క్యాంపెనర్ ప్రధాని మోడీని కించపరిచేలా, అవమాకరమైనవిధంగా పరువు నష్టం కలిగించే విధంగా చిత్రీకరించాయని పేర్కొంది. ఎన్నికల్లో పోటీ చేసే బీజేపీ నేతల అభ్యర్థిత్వానికి ప్రతికూలంగా ప్రభావితం చేసేలా దురుద్దేశంతో పోస్టులను షేర్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘‘రాష్ట్ర ఎన్నికల్లో అభ్యర్థులకు వ్యతిరేకంగా ప్రత్యారోపణలు, దూషణల ద్వారా ఎన్నిలక నియమావళిని ఉల్లంఘించినందుకు తగిన చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలని, నిర్ణీత సమయంలో మీనుంచి స్పందన రాని పక్షంలో, ఎన్నికల సంఘం మీకు తదుపరి సూచన చేయకుండా తగిన చర్యలు తీసుకుంటుందని ఆప్కి పోల్ ప్యానెల్ తెలిపింది.
నవంబర్ 10న బీజేపీ ఎన్నికల కమిషన్(ఈసీ)ని ఆశ్రయించింది. ప్రధాని మోడీపై సోషల్ మీడియాలో అనైతిక వీడియోల క్లిప్స్, వ్యాఖ్యలు పోస్ట్ చేసింనదుకు ఆప్ పై చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ, పార్టీ జాతీయ మీడియా ఇన్ఛార్జ్ మరియు రాజ్యసభ ఎంపీ అనిల్ బలూనీ, పార్టీ నాయకుడు ఓం పాఠక్లతో కూడిన బీజేపీ ప్రతినిధి బృందం ఈ అంశంపై పోల్ ప్యానెల్ను సంప్రదించింది.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!