Arvind Kejriwal: మోడీపై సోషల్ మీడియా పోస్టులు.. ప్రియాంకాగాంధీ, కేజ్రీవాల్కి ఈసీ షోకాజ్ నోటీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arvind Kejriwal: ప్రధాని నరేంద్రమోడీకి వ్యతిరేకంగా కించపరిచేలా, అవమానకరమైన పోస్టులను షేర్ చేసినందుకు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సోషల్ మీడియా పోస్టుల్లో ప్రధానికి వ్యతిరేకంగా చేసిన ప్రకటనపై గురువారం లోగా వివరణ ఇవ్వాలని ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కి నోటీసులు ఇచ్చింది. ఇలాంటి నోటీసులే కాంగ్రెస్ నేత ప్రియాంకాగాంధీకి కూడా ఈసీ పంపింది. మధ్యప్రదేశ్ ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోడీకి వ్యతిరేకంగా తప్పుడు, నిర్థారించని వ్యాఖ్యలు చేశారని ప్రియాంకాగాంధీపై బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. గురువారం రాత్రి 8 గంటలలోపు ఆమె ప్రకటనలపై వివరణ ఇవ్వానలి ఈసీ కోరింది.
Read Also: PM Modi: “మూర్ఖులకు రాజు”.. రాహుల్ గాంధీ ‘మేడ్ ఇన్ చైనా’ వ్యాఖ్యలపై ప్రధాని ఫైర్..
Also Read
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
- Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
నోటీసు ప్రకారం.. బీజేపీ నాయకులు చేసిన ఫిర్యాదులో ఆప్ ఎక్స్(ట్విట్టర్)లో రెండు పోస్టుల్లో బీజేపీ స్టార్ క్యాంపెనర్ ప్రధాని మోడీని కించపరిచేలా, అవమాకరమైనవిధంగా పరువు నష్టం కలిగించే విధంగా చిత్రీకరించాయని పేర్కొంది. ఎన్నికల్లో పోటీ చేసే బీజేపీ నేతల అభ్యర్థిత్వానికి ప్రతికూలంగా ప్రభావితం చేసేలా దురుద్దేశంతో పోస్టులను షేర్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘‘రాష్ట్ర ఎన్నికల్లో అభ్యర్థులకు వ్యతిరేకంగా ప్రత్యారోపణలు, దూషణల ద్వారా ఎన్నిలక నియమావళిని ఉల్లంఘించినందుకు తగిన చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలని, నిర్ణీత సమయంలో మీనుంచి స్పందన రాని పక్షంలో, ఎన్నికల సంఘం మీకు తదుపరి సూచన చేయకుండా తగిన చర్యలు తీసుకుంటుందని ఆప్కి పోల్ ప్యానెల్ తెలిపింది.
నవంబర్ 10న బీజేపీ ఎన్నికల కమిషన్(ఈసీ)ని ఆశ్రయించింది. ప్రధాని మోడీపై సోషల్ మీడియాలో అనైతిక వీడియోల క్లిప్స్, వ్యాఖ్యలు పోస్ట్ చేసింనదుకు ఆప్ పై చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ, పార్టీ జాతీయ మీడియా ఇన్ఛార్జ్ మరియు రాజ్యసభ ఎంపీ అనిల్ బలూనీ, పార్టీ నాయకుడు ఓం పాఠక్లతో కూడిన బీజేపీ ప్రతినిధి బృందం ఈ అంశంపై పోల్ ప్యానెల్ను సంప్రదించింది.
తాజావార్తలు
-
Shah Ghouse: గుట్కా బిర్యానీ..! బయటపడ్డ టాప్ రెస్టారెంట్ బండారం.. హైదరాబాద్లో అసలేం తినలేమా?
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి మిశ్రమ ఫలితాలు!
-
Sambarala Yeti Gattu: క్లైమాక్స్కు చేరుకున్న సాయి దుర్గ తేజ్ పాన్ ఇండియా మూవీ.. చివరి షెడ్యూల్తో భారీ అప్డేట్!
-
Hormonal Imbalance in Women: తెలియకుండా చేసే ఈ అలవాట్లు మహిళల హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తాయి.. ఈరోజే మార్చుకోండి!
-
US Airstrike on Iran: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రం.. 24 గంటల్లో రెండోసారి ఇరాన్పై అమెరికా వైమానిక దాడి
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!