పశ్చిమ టర్కీలో భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత 6.1గా నమోదైంది. ఇస్తాంబుల్, బుర్సా, మనీసా, ఇజ్మీర్ ప్రావిన్సుల్లో భూకంపం సంభవించింది. ప్రకంపనలు కారణంగా పలు భవనాలు కూలిపోయాయి. మూడు భవనాలు కూలిపోయాయని అధికారులు తెలిపారు. అయితే ప్రాణనష్టంపై మాత్రం ఎలాంటి సమాచారం లేదని చెప్పారు.
ఆదివారం ఇరాన్లోని బొగ్గు గనిలో మీథేన్ గ్యాస్ లీకేజీ కారణంగా భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 51 మంది మృతి చెందారు. అంతేకాకుండా.. 20 మంది గాయపడ్డారు. గత కొన్నేళ్లుగా దేశంలో జరిగిన ఘోర ప్రమాదాల్లో ఇదొకటి అని ప్రభుత్వ మీడియా పేర్కొంది. ఇరాన్లోని దక్షిణ ఖొరాసన్ ప్రావిన్స్లో ఈ పేలుడు సంభవించింది.