Team India: బార్బడోస్ లో చిక్కుకున్న టీం ఇండియా..అసలేం జరిగిందంటే?
- బార్బడోస్ ను వణికిస్తున బెరిల్ తుపాను
- బార్బడోస్లో బలమైన గాలులు నిరంతర వర్షం
- నగరంలో కర్ఫ్యూ లాంటి పరిస్థితి
- ఈ నేపథ్యంలో అక్కడి విమానాశ్రయాన్ని మూసివేసిన అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీ20 వరల్డ్ కప్ 2024 ఫైనల్లో భారత జట్టు 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి టైటిల్ సొంతం చేసుకుంది. బార్బడోస్లోని కెన్సింగ్టన్ ఓవల్ మైదానంలో రోహిత్ శర్మ ట్రోఫీని తీసుకున్నారు. 140 కోట్ల మంది దేశప్రజల ఆనందానికి అవధులు లేవు. అయితే ఇప్పుడు బార్బడోస్ ను వణికించిన బెరిల్ తుపాను టీమ్ ఇండియా కష్టాలను మరింత పెంచింది. బృందం ఈరోజు ఇంటికి తిరిగి రావాల్సి ఉంది. కానీ తుఫాను కారణంగా ఇది జరగలేదు. ఇప్పుడు టీమ్ని భారత్కు రప్పించేందుకు బీసీసీఐ ప్లాన్ బీ ని రూపొందించింది. బెరిల్ హరికేన్ కారణంగా.. బార్బడోస్లో బలమైన గాలులు నిరంతర వర్షం కురుస్తోంది. నగరంలో కర్ఫ్యూ లాంటి పరిస్థితి నెలకొంది. రోహిత్ శర్మ అండ్ టీం శనివారం రాత్రే చార్టర్ ప్లేన్లో ముంబైకి తీసుకురావాలని బీసీసీఐ, ఐసీసీ ముందుగా ప్లాన్ చేశాయి. కానీ అది సాధ్యపడలేదు. బెరిల్ హరికేన్ బార్బడోస్ తీరాన్ని తాకనుంది. ఈ నేపథ్యంలో అక్కడి విమానాశ్రయాన్ని మూసివేశారు. అన్ని విమానాలు రద్దు చేయబడ్డాయి.
READ MORE: Monsoon: అలర్ట్.. రేపటి నుంచి ఏపీలోని పలు చోట్ల భారీ వర్షాలు..
Also Read
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
- Women's T20 World Cup 2026 : పాకిస్తాన్ను చిత్తు చేసిన భారత్.. దీప్తి శర్మ ఐదు వికెట్ల సునామీ.!
బార్బడోస్లో కర్ఫ్యూ లాంటి పరిస్థితి నెలకొంది. ఇంట్లో నుంచి ఎవరినీ బయటకు రానివ్వడం లేదు. ఇది రెండవ అత్యంత తీవ్రమైన తుఫానుగా వాతావరణ శాఖ ప్రకటించింది. ఇలాంటి పరిస్థితుల్లో భారత జట్టుతో పాటు అభిమానులు, మీడియా కూడా బార్బడోస్లో ఇరుక్కుపోయారు. జూలై 3లోగా జట్టు భారత్కు రావచ్చు. పరిస్థితి సద్దుమణిగిన తర్వాత జట్టు బార్బడోస్ నుంచి నేరుగా ఢిల్లీకి చేరుకుంటుందని బీసీసీఐ అధికారులు చెబుతున్నారు. ఈ బృందాన్ని చార్టర్ విమానంలో ఢిల్లీకి తీసుకురావచ్చు. ఢిల్లీలో భారత బృందం ప్రధాని నరేంద్ర మోడీని కలవనుంది. దేశప్రజలు కూడా జట్టుకు స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారు. భారత జట్టు, సహాయక సిబ్బంది, బిసీసీఐ అధికారులు, ఆటగాళ్ల కుటుంబాలతో సహా దాదాపు 70 మంది ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ ద్వారా న్యూయార్క్ చేరుకోవలసి ఉంది. అక్కడి నుంచి ఢిల్లీ బయలుదేరుతారు.
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!