IND vs PAK: భారత్-పాకిస్థాన్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్.. తుది జట్టులోకి కుల్దీప్ యాదవ్ వచ్చేనా..?
- భారత్-పాకిస్థాన్ మ్యాచ్కు ముందు జట్టులో మార్పులపై ఆసక్తికర చర్చ..
- టీమిండియాలో పలు మార్పులు చేయాలని సూచించిన మాజీ క్రికెటర్ గవాస్కర్..
- పాక్ తో జరిగే మ్యాచ్లో కుల్దీప్ యాదవ్ ప్లేయింగ్ ఎలెవన్లో ఉంటాడని గవాస్కర్ అంచనా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs PAK: టీ20 వరల్డ్ కప్లో భారత్- పాకిస్థాన్ మధ్య జరిగే హై వోల్టేజ్ మ్యాచ్కు ముందు టీమిండియాలో మార్పులపై ఆసక్తికర చర్చ మొదలైంది. మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్తో జరిగే మ్యాచ్లో పేసర్ అర్ష్దీప్ సింగ్ స్థానంలో లెగ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను తీసుకునే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎందుకంటే, నమీబియాతో జరిగిన మ్యాచ్లో అర్ష్దీప్ భారీగా పరుగులు ఇచ్చాడు. నాలుగు ఓవర్లు పూర్తి చేయలేదని గుర్తు చేశారు. మిగతా బౌలర్లు వికెట్లు సాధించారు. ఈ పరిణామాలు పాకిస్థాన్ మ్యాచ్ ని దృష్టిలో పెట్టుకుని జట్టు వ్యూహం మార్చవచ్చనే సంకేతాలు ఉన్నాయని గవాస్కర్ చెప్పారు.
Also Read
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
- Women's T20 World Cup 2026 : పాకిస్తాన్ను చిత్తు చేసిన భారత్.. దీప్తి శర్మ ఐదు వికెట్ల సునామీ.!
అయితే, శ్రీలంక పిచ్లు స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటాయని, భారత్ ముగ్గురు స్పిన్నర్లతో ఆడిన చరిత్ర ఉందని సునీల్ గవాస్కర్ గుర్తు చేశారు. కొలంబోలో జరిగే పాక్ మ్యాచ్లో కుల్దీప్ యాదవ్ ప్లేయింగ్ ఎలెవన్లో ఉంటాడని అంచనా వేశారు. ఇక, భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బౌలింగ్ మార్పులు కూడా దాయాది జట్టును దృష్టిలో పెట్టుకుని చేశారని ఆయన విశ్లేషించారు. హార్దిక్ పాండ్యా మొదటి ఓవర్ వేయడం అర్ష్దీప్ స్థానంపై సందేహాలు వస్తున్నాయి. అలాగే, వరుణ్ చక్రవర్తి నాలుగు ఓవర్లు వేసి ఉంటే ఐదు లేదా ఆరు వికెట్లు తీసేవాడని పేర్కొన్నారు. అక్షర్ పటేల్ మూడు ఓవర్లలో రెండు వికెట్లు తీయడం కూడా మంచి పరిణామం అని మాజీ క్రికెటర్ సునీల్ తెలిపారు.
Read Also: Bhopal: ప్రేమికుల రోజున దుర్వార్త.. ప్రేమికురాలిని చంపి సెప్టిక్ ట్యాంక్లో పడేసిన ప్రియుడు
ఇక, బ్యాటర్ సంజూ శాంసన్ ఆటపై కూడా గవాస్కర్ మాట్లాడుతూ.. అనారోగ్యంతో ఉన్న అభిషేక్ శర్మ స్థానంలో వచ్చిన సంజూ, 8 బంతుల్లో 22 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.. అతను క్రీజ్లో చాలా లోతుగా వెళ్లి ఫ్లిక్ షాట్ ఆడడం సాంకేతిక సమస్యగా మారుతోంది.. కొత్త బంతితో ఓపెనింగ్ చేసే సమయంలో మరింత జాగ్రత్తగా ఆడాల్సిన అవసరమని సూచించారు. అయితే, నమీబియా బౌలర్లు సంజూ కోసం ప్రత్యేక ఫీల్డింగ్ సెట్టింగ్ పెట్టారు.. అయినప్పటికీ కొన్ని అద్భుత షాట్లు ఆడటం అతనికి ఆత్మవిశ్వాసం ఇస్తుందన్నారు. పాక్ మ్యాచ్లో అవకాశం వస్తే క్రీజ్లో ఎక్కువ సమయం గడపాలని సునీల్ గవాస్కర్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
AA23 Update: లోకేష్ స్టైల్ రెడీ.. అల్లు అర్జున్ అభిమానులకు త్వరలో బిగ్ సర్ప్రైజ్!
-
Lenin: థియేటర్లకు ముందే ‘లెనిన్’ జాక్పాట్.. నాన్ థియేట్రికల్ రైట్స్తో రూ.34 కోట్ల వసూళ్లు!
-
IND vs ZIM: మ్యాచ్ విన్నర్లకు నో ఛాన్స్.. ఒక్క వికెట్ తీయని ఆటగాడికి చోటు!
-
టూరిస్టులకు గుడ్ న్యూస్.. ఒక్క రోజులో 5 అద్భుత గమ్యస్థానాలు.! TSTDC అదిరిపోయే టూర్ ప్యాకేజీ.!
-
Ahmedabad Serial Blasts Case: వరుస బాంబు పేలుళ్ల కేసులో సంచలన తీర్పు.. 38 మందికి ఉరిశిక్ష ఖరారు
ట్రెండింగ్
-
7,200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Vivo నుంచి కొత్త G5i, G5z స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
Black Jamun Jam: ప్రిజర్వేటివ్స్ అవసరం లేకుండానే.. 6 నెలలు నిల్వ ఉండే ‘నేరేడు జామ్’ ఇంట్లోనే చేయండి ఇలా.!
-
TGPSC Recruitment: ఉద్యోగార్థులకు గుడ్న్యూస్.. టీజీపీఎస్సీ నుంచి రెండు నోటిఫికేషన్లు విడుదల.!
-
Telangana Drought Alert: వాన జాడే లేదు.. కరువు కోరల్లోకి తెలంగాణ.. రైతుల్లో పెరుగుతున్న ఆందోళన!
-
Sanju Samson: జింబాబ్వే టూర్లో నో ఛాన్స్.. సంజు కెరీర్ అప్పుడే ముగియలేదు.. ముందుంది మరో సూపర్ ఛాన్స్!