IND vs PAK: భారత్-పాకిస్థాన్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్.. తుది జట్టులోకి కుల్దీప్ యాదవ్ వచ్చేనా..?
- భారత్-పాకిస్థాన్ మ్యాచ్కు ముందు జట్టులో మార్పులపై ఆసక్తికర చర్చ..
- టీమిండియాలో పలు మార్పులు చేయాలని సూచించిన మాజీ క్రికెటర్ గవాస్కర్..
- పాక్ తో జరిగే మ్యాచ్లో కుల్దీప్ యాదవ్ ప్లేయింగ్ ఎలెవన్లో ఉంటాడని గవాస్కర్ అంచనా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs PAK: టీ20 వరల్డ్ కప్లో భారత్- పాకిస్థాన్ మధ్య జరిగే హై వోల్టేజ్ మ్యాచ్కు ముందు టీమిండియాలో మార్పులపై ఆసక్తికర చర్చ మొదలైంది. మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్తో జరిగే మ్యాచ్లో పేసర్ అర్ష్దీప్ సింగ్ స్థానంలో లెగ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను తీసుకునే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎందుకంటే, నమీబియాతో జరిగిన మ్యాచ్లో అర్ష్దీప్ భారీగా పరుగులు ఇచ్చాడు. నాలుగు ఓవర్లు పూర్తి చేయలేదని గుర్తు చేశారు. మిగతా బౌలర్లు వికెట్లు సాధించారు. ఈ పరిణామాలు పాకిస్థాన్ మ్యాచ్ ని దృష్టిలో పెట్టుకుని జట్టు వ్యూహం మార్చవచ్చనే సంకేతాలు ఉన్నాయని గవాస్కర్ చెప్పారు.
Also Read
- T20 Rankings: టీ20 ర్యాంకింగ్స్ విడుదల.. ఈ సారి టీమిండియా ర్యాంక్ ఎంతో తెలుసా..
- Shubman Gill Instagram Post Creates Stir: శుభ్మన్ గిల్ పోస్ట్పై దుమారం.. ఆటాడుకుంటున్న క్రికెట్ ఫ్యాన్స్..
- Arshdeep Singh and Daryl Mitchell Controversy: అర్ష్దీప్ సింగ్ను వెనకేసుకొచ్చిన గంభీర్.. మిచెల్కు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు..!
- Prize Money : టీ20 వరల్డ్ కప్ లో.. జట్ల వారీగా ప్రైజ్ మనీ ఎంతెంతంటే....?
అయితే, శ్రీలంక పిచ్లు స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటాయని, భారత్ ముగ్గురు స్పిన్నర్లతో ఆడిన చరిత్ర ఉందని సునీల్ గవాస్కర్ గుర్తు చేశారు. కొలంబోలో జరిగే పాక్ మ్యాచ్లో కుల్దీప్ యాదవ్ ప్లేయింగ్ ఎలెవన్లో ఉంటాడని అంచనా వేశారు. ఇక, భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బౌలింగ్ మార్పులు కూడా దాయాది జట్టును దృష్టిలో పెట్టుకుని చేశారని ఆయన విశ్లేషించారు. హార్దిక్ పాండ్యా మొదటి ఓవర్ వేయడం అర్ష్దీప్ స్థానంపై సందేహాలు వస్తున్నాయి. అలాగే, వరుణ్ చక్రవర్తి నాలుగు ఓవర్లు వేసి ఉంటే ఐదు లేదా ఆరు వికెట్లు తీసేవాడని పేర్కొన్నారు. అక్షర్ పటేల్ మూడు ఓవర్లలో రెండు వికెట్లు తీయడం కూడా మంచి పరిణామం అని మాజీ క్రికెటర్ సునీల్ తెలిపారు.
Read Also: Bhopal: ప్రేమికుల రోజున దుర్వార్త.. ప్రేమికురాలిని చంపి సెప్టిక్ ట్యాంక్లో పడేసిన ప్రియుడు
ఇక, బ్యాటర్ సంజూ శాంసన్ ఆటపై కూడా గవాస్కర్ మాట్లాడుతూ.. అనారోగ్యంతో ఉన్న అభిషేక్ శర్మ స్థానంలో వచ్చిన సంజూ, 8 బంతుల్లో 22 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.. అతను క్రీజ్లో చాలా లోతుగా వెళ్లి ఫ్లిక్ షాట్ ఆడడం సాంకేతిక సమస్యగా మారుతోంది.. కొత్త బంతితో ఓపెనింగ్ చేసే సమయంలో మరింత జాగ్రత్తగా ఆడాల్సిన అవసరమని సూచించారు. అయితే, నమీబియా బౌలర్లు సంజూ కోసం ప్రత్యేక ఫీల్డింగ్ సెట్టింగ్ పెట్టారు.. అయినప్పటికీ కొన్ని అద్భుత షాట్లు ఆడటం అతనికి ఆత్మవిశ్వాసం ఇస్తుందన్నారు. పాక్ మ్యాచ్లో అవకాశం వస్తే క్రీజ్లో ఎక్కువ సమయం గడపాలని సునీల్ గవాస్కర్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
RCB vs GT : గుజరాత్పై ఆర్సీబీ ‘రాయల్’ విక్టరీ.. ఏకంగా 92 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్లోకి..!
-
OTR : తెలంగాణ బీజేపీ నాయకులకు ఢిల్లీ అధిష్టానం వార్నింగ్ ఇచ్చిందా?
-
Siddaramaiah: కర్ణాటకలో ఉత్కంఠకు తెర.. గురువారం గుడ్బై చెప్పనున్న సిద్ధరామయ్య!
-
Khaja Mohijuddin: వక్ఫ్ బోర్డు భూముల పోరాటమే ప్రాణం తీసిందా? సెకండ్ హ్యాండ్ ‘స్కార్పియో’తో లాయర్ను లేపేసిన కిల్లర్స్!
-
Vizag Bhimili Murder: ప్రియుడి మోజులో పచ్చని సంసారంలో నిప్పులు.. భర్తను చున్నీతో చంపేసిన ఇల్లాలు!
ట్రెండింగ్
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!
-
వాతావరణం మారితే కలర్ మారుతున్న ఫోన్.. 12 కలర్ వేరియంట్స్, సరికొత్త AI ఫీచర్లతో Infinix HOT 70 లాంచ్.!
-
Nitish Kumar Reddy Birthday: టెక్నిక్ + టాలెంట్ + టెంపరమెంట్.. విశాఖ కుర్రాడి జర్నీ.!
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!