IND vs PAK: టీ20 వరల్డ్ కప్లో భారత్- పాకిస్థాన్ మధ్య జరిగే హై వోల్టేజ్ మ్యాచ్కు ముందు టీమిండియాలో మార్పులపై ఆసక్తికర చర్చ మొదలైంది. మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్తో జరిగే మ్యాచ్లో పేసర్ అర్ష్దీప్ సింగ్ స్థానంలో లెగ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను తీసుకునే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు.