Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Pulwama Attack 2019 40 Crpf Martyrs Names Black Day India

Pulwama Attack 2019: జవాన్ల త్యాగం.. భారత చరిత్రలో చెరగని ముద్ర.. 40 మంది పుల్వామా అమరుల పేర్లు ఇవే..

Published Date :February 14, 2026 , 8:33 am
By RAMAKRISHNA KENCHE
Pulwama Attack 2019: జవాన్ల త్యాగం.. భారత చరిత్రలో చెరగని ముద్ర.. 40 మంది పుల్వామా అమరుల పేర్లు ఇవే..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Pulwama Attack 2019: ఫిబ్రవరి 14, 2019 దేశం మొత్తం ఒక్కసారిగా కుదేలైంది. భారతీయులు 40 మంది సైనికులను కోల్పోయింది. సరిగ్గా ఏడేళ్ల కిందట ఫిబ్రవరి 14న జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ సైనిక వాహన శ్రేణిపై పాకిస్థాన్‌కు చెందిన జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు ఆత్మాహుతికి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్)కి చెందిన 40 సైనికులు బలయ్యారు. జమ్మూ- శ్రీనగర్ జాతీయ రహదారిపై లేత్‌పుర (అవంతిపురా సమీపం)లో 2019 ఫిబ్రవరి 14న సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ ఘాతుకం చోటుచేసుకుంది. ఈ దాడి అనంతరం దేశవ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీలు, శత్రు మూఖలను కఠినంగా శిక్షించాలని నినాదాలతో మార్మోగింది. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఏటా బ్లాక్ డేగా భారతీయులు జరుపుకొంటారు. జవాన్లకు నివాళులర్పిస్తారు. వాస్తవానికి ఏటా ఫిబ్రవరి 14 రోజున ప్రేమికుల దినోత్సవం జరుపుకుంటారు. కానీ భారత్‌లో మాత్రం ఇది బ్లాక్ డే. 2019 నుంచి ఫిబ్రవరి 14ను పుల్వామాలో వీరమరణం పొందిన జవాన్లను స్మరించుకునే రోజుగా గుర్తిస్తున్నారు. ప్రేయసికి ఇచ్చే పూలకు బదులుగా.. వీరమరణం పొందిన జవాన్లు వద్ద పుష్పాలు, కొవ్వొత్తులు ఉంచి నివాళి తెలియజేస్తున్నారు. పుల్వామా ఎలా జరిగింది? ఆ దాడిలో మరణించిన జవాన్ల పేర్లు, తదితర వివరాలను పూర్తిగా తెలుసుకుందాం..

READ MORE: T20 World Cup 2026: ఎవరు ధైర్యం చేస్తారో చూడాలి.. పాక్ స్పిన్నర్ తారిక్ బౌలింగ్పై అశ్విన్ కామెంట్స్ వైరల్!

ఏడేళ్ల క్రితం ఇదేరోజున సీఆర్‌పీఎఫ్‌ కాన్వాయ్ జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి గుండా వెళుతోంది. ఆ రోజు సీఆర్‌పీఎఫ్‌కు చెందిన 2,547 మంది సిబ్బంది 60కి పైగా వాహనాల్లో ప్రయాణిస్తున్నారు. సైనికులు ఉన్న ఈ కాన్వాయ్‌లో అధికంగా బస్సులు ఉన్నాయి. కాన్వాయ్‌ పుల్వామా వద్దకు చేరుకోగానే అటువైపు నుంచి వచ్చిన ఓ కారు కాన్వాయ్‌లోని ఓ బస్సును ఢీకొంది. బస్సును ఢీకొన్న ఆ కారులో పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు ఉన్నాయి. దీంతో వెంటనే పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 40 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు వీరమరణం పొందారు. అయితే.. ఈ దాడికి పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మొహమ్మద్ బాధ్యత వహించింది. తామే చంపేశామని ప్రకటించింది. ఈ ఘటన భారతదేశాన్ని తీవ్రంగా కుదిపేసింది. దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైంది. అమాయకంగా విధులు నిర్వర్తిస్తున్న జవాన్లపై ఇలాంటి దాడి జరగడం అందరినీ కలిచివేసింది. పుల్వామాలో ఉగ్రదాడి అనంతరం భారత్.. పాకిస్థాన్‌కు తగిన గుణపాఠం చెప్పేందుకు కఠిన చర్యలు అవలంబించింది. ఫలితంగా పాకిస్తాన్‌కు తీవ్ర నష్టం వాటిల్లింది.

READ MORE: Ranveer Singh : సల్మాన్ తర్వాత ఇప్పుడు రణవీర్? గ్యాంగ్ వార్నింగ్‌తో వణికిపోతున్న బాలీవుడ్!

2019, ఫిబ్రవరి 26న భారత వైమానిక దళం పాకిస్థాన్‌లోని బాలాకోట్‌లోకి ప్రవేశించి వైమానిక దాడులతో పాక్‌లోని ఉగ్రవాదుల శిబిరాలను ధ్వంసం చేసింది. దీంతో ఫిబ్రవరి 27న పాకిస్థాన్ వైమానిక దళం జమ్మూ, కశ్మీర్‌లోకి చొరబడి భారతదేశంపై వైమానిక దాడులకు పాల్పడింది. దీనికి ప్రతిస్పందనగా భారత వైమానిక దళం దాడులు చేపట్టిన సమయంలో భారత్‌కు చెందిన యుద్ధ విమానం ‘మిగ్-21’ పాకిస్థాన్ సైన్యం దాడికి గురై, అక్కడే పడిపోయింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ సైనికులు ‘మిగ్-21’ పైలట్ అభినందన్ వర్థమాన్‌ను పట్టుకున్నారు. 2019, మార్చి ఒకటిన అమెరికాతో పాటు ఇతర దేశాల ఒత్తిడి మేరకు పాకిస్థాన్ సైన్యం అభినందన్ వర్థమాన్‌ను విడుదల చేసింది. పుల్వామా ఉగ్రదాడి అనంతరం భారత్‌ అప్పటివరకూ పాక్‌తో ఉన్న అన్ని వాణిజ్య సంబంధాలను రద్దు చేసుకుంది. ఫలితంగా పాకిస్తాన్‌ ఆర్థికంగా తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. పాకిస్థాన్‌ను బ్లాక్‌లిస్ట్‌లో చేర్చేందుకు మనీలాండరింగ్‌పై ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్‌ఏటీఎఫ్)ను కూడా భారత ప్రభుత్వం కోరింది.

  1. హెడ్ ​​కానిస్టేబుల్ నసీర్ అహ్మద్ (జమ్మూ కశ్మీర్)
  2. కానిస్టేబుల్ సుఖ్జీందర్ సింగ్ (పంజాబ్)
  3. హెడ్ ​​కానిస్టేబుల్ జైమల్ సింగ్ (పంజాబ్)
  4. కానిస్టేబుల్ రోహితాష్ లాంబా (రాజస్థాన్)
  5. కానిస్టేబుల్ తిలక్ రాజ్ (హిమాచల్ ప్రదేశ్)
  6. హెడ్ ​​కానిస్టేబుల్ విజయ్ సోరెంగ్ (జార్ఖండ్)
  7. కానిస్టేబుల్ వసంత కుమార్ వివి (కేరళ)
  8. కానిస్టేబుల్ సుబ్రమణ్యం జి (తమిళనాడు)
  9. కానిస్టేబుల్ మనోజ కుమార్ బెహెరా (ఒడిశా)
  10. కానిస్టేబుల్ GD గురు హెచ్ (కర్ణాటక)
  11. హెడ్ ​​కానిస్టేబుల్ నారాయణ్ లాల్ గుర్జార్ (రాజస్థాన్)
  12. కానిస్టేబుల్ మహేష్ కుమార్ (ఉత్తర ప్రదేశ్)
  13. కానిస్టేబుల్ ప్రదీప్ కుమార్ (ఉత్తరప్రదేశ్)
  14. హెడ్ ​​కానిస్టేబుల్ హేమ్‌రాజ్ మీనా (రాజస్థాన్)
  15. హెడ్ ​​కానిస్టేబుల్ పీకే సాహూ (ఒడిశా)
  16. కానిస్టేబుల్ రమేష్ యాదవ్ (ఉత్తరప్రదేశ్)
  17. హెడ్ ​​కానిస్టేబుల్ సంజయ్ రాజ్‌పుత్ (మహారాష్ట్ర)
  18. కానిస్టేబుల్ కౌశల్ కుమార్ రావత్ (ఉత్తరప్రదేశ్)
  19. కానిస్టేబుల్ ప్రదీప్ సింగ్ (ఉత్తరప్రదేశ్)
  20. కానిస్టేబుల్ శ్యామ్ బాబు (ఉత్తరప్రదేశ్)
  21. కానిస్టేబుల్ అజిత్ కుమార్ ఆజాద్ (ఉత్తరప్రదేశ్)
  22. కానిస్టేబుల్ మణిందర్ సింగ్ అత్రి (పంజాబ్)
  23. హెడ్ ​​కానిస్టేబుల్ బబ్లూ సంత్రా (పశ్చిమ బెంగాల్)
  24. కానిస్టేబుల్ అశ్వని కుమార్ కావోచి (మధ్యప్రదేశ్)
  25. కానిస్టేబుల్ రాథోడ్ నితిన్ శివాజీ (మహారాష్ట్ర)
  26. కానిస్టేబుల్ భగీరథ్ సింగ్ (రాజస్థాన్)
  27. కానిస్టేబుల్ వీరేంద్ర సింగ్ (ఉత్తరాఖండ్)
  28. హెడ్ ​​కానిస్టేబుల్ అవధేష్ కుమార్ యాదవ్ (ఉత్తర ప్రదేశ్)
  29. కానిస్టేబుల్ రతన్ కుమార్ ఠాకూర్ (బీహార్)
  30. కానిస్టేబుల్ పంకజ్ కుమార్ త్రిపాఠి (ఉత్తరప్రదేశ్)
  31. కానిస్టేబుల్ జీత్ రామ్ (రాజస్థాన్)
  32. కానిస్టేబుల్ అమిత్ కుమార్ (ఉత్తర ప్రదేశ్)
  33. కానిస్టేబుల్ విజయ్ Kr. మౌర్య (ఉత్తర ప్రదేశ్)
  34. కానిస్టేబుల్ కుల్విందర్ సింగ్ (పంజాబ్)
  35. హెడ్ ​​కానిస్టేబుల్ మణేశ్వర్ సుమతారి (అస్సాం)
  36. అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ మోహన్ లాల్ (ఉత్తరాఖండ్)
  37. హెడ్ ​​కానిస్టేబుల్ సంజయ్ కుమార్ సిన్హా (బీహార్)
  38. హెడ్ ​​కానిస్టేబుల్ రామ్ వకీల్ (ఉత్తరప్రదేశ్)
  39. కానిస్టేబుల్ సుదీప్ బిస్వాస్ (పశ్చిమ బెంగాల్)
  40. కానిస్టేబుల్ శివచంద్రన్ (తమిళనాడు)

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 40 CRPF martyrs names list
  • Abhinandan Varthaman MiG 21
  • Balakot airstrike 2019
  • CRPF convoy attack details
  • February 14 Black Day India

తాజావార్తలు

  • 25 అప్‌డేట్లతో మార్కెట్‌లోకి Hyundai Verna.. ధర, ఫీచర్స్‌..

  • PV Sindhu: EBG ఫౌండేషన్ అంబాసిడర్‌గా పీవీ సింధు..

  • Shoaib Akhtar: పీసీబీ పరువు తీసిన షోయబ్ అక్తర్! భారత క్రికెట్ వ్యవస్థకు సలాం అంటూ షాకింగ్ కామెంట్స్..

  • Rajya Sabha Members : తెలంగాణ నుంచి రాజ్యసభకు సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి.. ఏకగ్రీవ ఎన్నిక పూర్తి..!

  • Russia Support Iran: ‘ఇరాన్‌కు సంపూర్ణ మద్దతు ఇస్తాం’.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ సంచలన వ్యాఖ్యలు..

ట్రెండింగ్‌

  • Late Night Hunger : అర్ధరాత్రి ఆకలి వేస్తుందా..? కారణం ఇదే అంటున్న డాక్టర్లు..!

  • Black Hair Tips : ఇక రంగు వేయాల్సిన పనిలేదు.. ఈ చిన్న విషయం తెలుసుకుంటే చాలు…!

  • Jasprit Bumrah Bowling: పిసినారి ‘బుమ్రా’.. భారత్ ఫైనల్ చేరడానికి కారణం ఆ మూడు ఓవర్లే!

  • 8.12 అంగుళాల డిస్‌ప్లే, Snapdragon 8 Elite Gen 5 చిప్‌సెట్‌ తో వచ్చేస్తున్న OPPO Find N6..!

  • Stock Market: ఇన్వెస్టర్ల 14 లక్షల కోట్ల సంపద ఆవిరి.. మార్కెట్ పతనానికి ప్రధాన కారణాలు ఇవే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions