IND vs USA: అమెరికాతో మ్యాచ్.. కోహ్లీ, రోహిత్, సూర్య డుమ్మా!
- అమెరికా-భారత్ మ్యాచ్
- కోహ్లీ-రోహిత్ డుమ్మా
- వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rohit Sharma, Virat Kohli Misses Team India Practice Session: టీ20 ప్రపంచకప్ 2024 గ్రూప్-ఏలో భాగంగా బుధవారం న్యూయార్క్లోని నసావు కౌంటీ స్టేడియంలో అమెరికా, భారత్ జట్లు తలపడనున్నాయి. ఐర్లాండ్, పాకిస్థాన్పై విజయం సాధించిన రోహిత్ సేన రెట్టించిన ఉత్సాహంతో ఉంది. పసికూన అమెరికాను ఓడించాలని భారత్ బరిలోకి దిగుతోంది. మరోవైపు పాకిస్థాన్, కెనడాను ఓడించిన జోష్లో ఉన్న అమెరికా కూడా.. టీమిండియాపై విజయం సాధించాలని చూస్తోంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు గ్రూప్-ఏ నుంచి అధికారికంగా సూపర్-8కు అర్హత సాధించనుంది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే.. ఇరు జట్లకు చెరో పాయింట్ వస్తుంది.
అమెరికా మ్యాచ్ నేపథ్యంలో మంగళవారం నిర్వహించిన టీమిండియా ప్రాక్టీస్ సెషన్కు భారత స్టార్ ఆటగాళ్లు డుమ్మా కొట్టారు. కొందరు ఆటగాళ్లకు ఆప్షనల్ ప్రాక్టీస్ సెషన్ అని చెప్పడంతో.. చాలా మంది ప్లేయర్స్ మైదానంలోకి రాలేదు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ లాంటి ప్లేయర్స్ ప్రాక్టీస్ చేయకుండా.. హోటల్ గదిలకే పరిమితమయ్యారు.
Also Read
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
- Women's T20 World Cup 2026 : పాకిస్తాన్ను చిత్తు చేసిన భారత్.. దీప్తి శర్మ ఐదు వికెట్ల సునామీ.!
Also Read: IND vs USA: భారత్ vs మినీ భారత్.. అమెరికా జట్టులో 8 మంది భారత సంతతి ఆటగాళ్లు!
రిషబ్ పంత్, సంజూ శాంసన్, శివమ్ దూబే, యశస్వి జైస్వాల్, యుజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్లతో పాటు రిసర్వ్ ప్లేయర్స్ మంగళవారం నెట్స్లో ప్రాక్టీస్ చేశారు. నిన్న రెస్ట్ తీసుకున్న ప్లేయర్స్.. నేడు సాధన చేయనున్నారట. మరోవైపు అమెరికా జట్టు సైతం, మంగళవారం ప్రాక్టీస్ చేయలేదు. ఈరోజు మ్యాచ్ ఉన్న నేపథ్యంలో వేశారు సాధన చేయనున్నారు. భారత కాలమానం ప్రకారం.. బుధవారం రాత్రి 8 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. స్టార్ స్పోర్ట్స్, హాట్స్టార్లో మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది.
తాజావార్తలు
-
Kuldeep Yadav: భారత యాజమాన్యం నిర్లక్ష్యం.. కుల్దీప్ యాదవ్ కీలక నిర్ణయం!
-
2027 Movies : క్రేజీ మూవీస్ అన్నీ 2027లోనే.. పోటీలో బాలయ్య, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
Richest Star Kids: హృతిక్ నుంచి అల్లు అర్జున్ వరకు.. 2026లో అత్యంత ధనవంతులైన స్టార్ కిడ్స్ ఎవరో తెలుసా?
-
Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలకు రూ.150 కోట్ల నిధులు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ట్రెండింగ్
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Samsung కొత్త స్మార్ట్వాచ్లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి