NTV Telugu Site icon

IND vs USA: అమెరికాతో మ్యాచ్.. కోహ్లీ, రోహిత్, సూర్య డుమ్మా!

Team India Practies

Team India Practies

Rohit Sharma, Virat Kohli Misses Team India Practice Session: టీ20 ప్రపంచకప్‌ 2024 గ్రూప్-ఏలో భాగంగా బుధవారం న్యూయార్క్‌లోని నసావు కౌంటీ స్టేడియంలో అమెరికా, భారత్ జట్లు తలపడనున్నాయి. ఐర్లాండ్, పాకిస్థాన్‌పై విజయం సాధించిన రోహిత్ సేన రెట్టించిన ఉత్సాహంతో ఉంది. పసికూన అమెరికాను ఓడించాలని భారత్ బరిలోకి దిగుతోంది. మరోవైపు పాకిస్థాన్, కెనడాను ఓడించిన జోష్‌లో ఉన్న అమెరికా కూడా.. టీమిండియాపై విజయం సాధించాలని చూస్తోంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు గ్రూప్-ఏ నుంచి అధికారికంగా సూపర్-8కు అర్హత సాధించనుంది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే.. ఇరు జట్లకు చెరో పాయింట్ వస్తుంది.

అమెరికా మ్యాచ్ నేపథ్యంలో మంగళవారం నిర్వహించిన టీమిండియా ప్రాక్టీస్ సెషన్‌కు భారత స్టార్ ఆటగాళ్లు డుమ్మా కొట్టారు. కొందరు ఆటగాళ్లకు ఆప్షనల్ ప్రాక్టీస్ సెషన్ అని చెప్పడంతో.. చాలా మంది ప్లేయర్స్ మైదానంలోకి రాలేదు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ లాంటి ప్లేయర్స్ ప్రాక్టీస్‌ చేయకుండా.. హోటల్ గదిలకే పరిమితమయ్యారు.

Also Read: IND vs USA: భారత్ vs మినీ భారత్.. అమెరికా జట్టులో 8 మంది భారత సంతతి ఆటగాళ్లు!

రిషబ్ పంత్, సంజూ శాంసన్, శివమ్ దూబే, యశస్వి జైస్వాల్, యుజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్‌లతో పాటు రిసర్వ్ ప్లేయర్స్ మంగళవారం నెట్స్‌లో ప్రాక్టీస్ చేశారు. నిన్న రెస్ట్ తీసుకున్న ప్లేయర్స్.. నేడు సాధన చేయనున్నారట. మరోవైపు అమెరికా జట్టు సైతం, మంగళవారం ప్రాక్టీస్ చేయలేదు. ఈరోజు మ్యాచ్ ఉన్న నేపథ్యంలో వేశారు సాధన చేయనున్నారు. భారత కాలమానం ప్రకారం.. బుధవారం రాత్రి 8 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. స్టార్‌ స్పోర్ట్స్, హాట్‌స్టార్‌లో మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది.