Rohit Sharma: రోహిత్ శర్మ కీలక నిర్ణయం.. ఆ టెస్టు తర్వాతే రిటైర్మెంట్!
- టెస్టుల్లో ఫామ్ లేమితో తీవ్ర ఇబ్బందులు పడుతున్న రోహిత్ శర్మ..
- సిడ్నీ టెస్టు మ్యాచ్ తర్వాత టెస్టులకు గుడ్ బై చెప్పనున్న రోహిత్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గత కొంతకాలంగా టెస్టుల్లో ఫామ్ లేమితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్వదేశంలో కివీస్తో జరిగిన మూడు టెస్టుల సిరీస్లో నిరాశపర్చిన రోహిత్.. ప్రస్తుతం ఆసీస్ తో జరుగుతున్న బోర్డర్ – గావస్కర్ టోర్నీలోనూ పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ నేపథ్యంలో రోహిత్ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాలని డిమాండ్లు చేస్తున్నారు. దీంతో అతను కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగే ఐదో టెస్టు మ్యాచ్ తర్వాత టెస్టు కెరీర్కు గుడ్ బై చెప్పాలని టీమిండియా సారథి రోహిత్ డిసైడ్ అయినట్లు తెలుస్తుంది..
Read Also: Flight Accident: రన్వేపై ఓ విమానం ఉండగానే మరో ఫ్లైట్ టేకాఫ్.. తృటిలో తప్పిన ప్రమాదం..
Also Read
- Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
- New Country: ఐసీసీ సభ్యత్వం పొందిన మరో దేశం.. మొత్తం 111కు చేరిన సంఖ్య..
- Ben Stokes Returns: 'క్రికెట్పై మళ్లీ ఆసక్తి వచ్చింది'.. రీఎంట్రీకి సిద్ధమైన స్టార్ ఆల్రౌండర్
- India U-19 vs Sri Lanka U-19: చరిత్ర సృష్టించిన భారత యువ ఓపెనర్లు.. రికార్డుల మోత
అయితే, ఈ విషయం తెలుసుకున్న బీసీసీఐ పెద్దలు, సెలక్టర్లు రోహిత్ శర్మతో మాట్లాడినట్లు తెలుస్తుంది. కానీ, రోహిత్ తన మనసు మార్చుకునే ఛాన్స్ లేదని సమాచారం. ఒకవేళ అదృష్టం కలిసొచ్చి భారత జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరితే ఆ మ్యాచ్ వరకు తన నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలని సెలక్టర్లు రోహిత్ను ఒప్పించే అవకాశం ఉంది. దీన్ని బట్టి టీమిండియా ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కు అర్హత సాధించకపోతే.. సిడ్నీలో కంగారులతో జరిగే ఐదో టెస్టు రోహిత్ శర్మకు కెరీర్లో చివరి టెస్టు కానుంది.
Read Also: Gold Rate Today: న్యూ ఇయర్ ధమాకా.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
ఇక, డబ్ల్యూటీసీ ఫైనల్ కు భారత్ చేరాలంటే అదృష్టం కలిసి రావాలి. టీమిండియా ప్రపంచ ఛాంపియన్షిప్ ఫైనల్ రేసులో ఉండాలంటే ఆసీస్ను సిడ్నీలో జరిగే చివరి టెస్టులో ఓడించాలి. ఈ మ్యాచ్ లో ఓడినా లేదా డ్రా చేసుకున్నా భారత్ డబ్ల్యూటీసీ రేసు నుంచి వైదులుగుతుంది. అలాగే, సిడ్నీ టెస్టులో ఇండియా గెలిచినా ఇతర జట్ల ఫలితాలపై పూర్తిగా ఆధారపడి ఉంది.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!