Virat Kohli కోహ్లీ స్పీచ్ తో ఆర్సీబీ అమ్మాయిల్లో జోష్.. సానియాపై సెటైర్లు వేస్తున్న నెటిజన్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహిళల ప్రీమియర్ లీగ్ లో వరుసగా ఐదు ఓటముల ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తూ స్మృతి మంధాన సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు సీజన్ లో బోణీ కొట్టింది. ఈ మ్యాచ్ కు ముందు టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లీ మాట్లాడిన మాటలు.. ఆర్సీబీ అమ్మాయిలకు వెయ్యి ఏణుగుల బలాన్నిచ్చాయి. గెలుపోటముల సంగతి తర్వాత.. ముందైతే పోరాడండి.. అంటూ కోహ్లీ చెప్పిన మాటలు మంధాన అండ్ టీమ్ కు టానిక్ లా పనిచేశాయి. అయితే కోహ్లీ స్పీచ్ ఆర్సీబీ అమ్మాయిలకు కొత్త ఉత్తేజానివ్వగా.. ఫ్యాన్స్ మాత్రం ఆ జట్టు మోంటార్ గా నియమితురాలైన సానియా మీర్జాను నెట్టింట ఓ ఆట ఆడుకుంటున్నారు.
Also Read : Australia Couple Lottery: అదృష్టమంటే ఇది.. భార్య అలిగింది, 16 కోట్ల లాటరీ తగిలింది
Also Read
- CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
- IPL 2026 Playoff Tickets: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ టిక్కెట్స్ షెడ్యూల్ వచ్చేసింది.. ఇక్కడ బుక్ చేసుకోండిలా..
- CSK vs SRH: ధోని లేకుండానే బరిలోకి CSK.. మొదటి బ్యాటింగ్ ఎవరిదంటే.!
- IPL: ‘నన్ను అస్సలు పట్టించుకోలేదు’.. కేకేఆర్పై బంగ్లాదేశ్ స్టార్ లిటన్ దాస్ సంచలన వ్యాఖ్యలు..
యూపీ వారియ్స్ తో మ్యాచ్ కు కొద్దిసేపు ముందు విరాట్ కోహ్లీ.. ఆర్సీబీ క్యాంప్ కు వెళ్లాడు. ఆస్ట్రేలియాతో రేపు( శుక్రవారం) జరుగబోయే తొలి వన్డేకు ముందు వాంఖేడ్ స్టేడియానికి కోహ్లీ వెళ్లాడు. అక్కడే ఉన్న ఆర్సీబీ ప్లేయర్స్ ను కలిశాడు. వారిని ఓదార్చుతూరు ఆటగాళ్లలో స్పూర్తినిచ్చే విధంగా స్పీచ్ ఇచ్చాడు. కోహ్లీ మాట్లాడుతూ తాను 15 ఏండ్లుగా ఆడుతున్నాను.. ఇప్పటిదాకా మేం ఐపీఎల్ లో ట్రోఫీ గెలవలేదు.. అయినా కూడా అది తనను ఆపలేదు.. ప్రతి ఏడాది ఉత్సాహంతో బరిలోకి దిగుతుంటా.. ప్రతి మ్యాచ్, ప్రతి టోర్నీలో శాయశక్తులా శ్రమిస్తా.. ఒకవేళ నేను గెలిస్తే చాలా గ్రేట్.. కానీ అలా జరుగలేదు.. అయినా సరే అవకాశాల కోసం ఎదురుచూస్తునే ఉంటానని కోహ్లీ అన్నారు.
Also Read : Aadhar Card : ఆధార్ కార్డు ఉందా.. అయితే మీకో గుడ్ న్యూస్
ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకూ ఒక్క ట్రోఫీ నెగ్గకున్నా మనకు ప్రపంచంలో ఓ జట్టుకూ లేని అభిమానగణం ఉన్నారని విరాట్ కోహ్లీ అన్నారు. అత్యుత్తమ అభిమానుల మద్దతు ఉన్న జట్టు ఏదైనా ఉందంటే అది మన ఆర్సీబీ మాత్రమే అని కోహ్లీ చెప్పుకొచ్చారు. ప్లే ఆఫ్ కు వెళ్లేందుకు మీకు అవకాశాలు ఒక్కశాతం మాత్రమే ఉన్నాయి.. కానీ ఆ ఛాన్స్ కూడా చాలా కీలకం.. వాటిని మెరుగుపరుచుకోవాలని కోహ్లీ వెల్లడించారు. కోహ్లీ మాటలు ఆర్సీబీ అమ్మాయిల్లో స్పూర్తినింపాయి. గత ఐదు మ్యాచ్ లలో లేని విధంగా యూపీ వారియర్స్ తో బెంగళూరు టీమ్ అన్ని విభాగాల్లోనూ సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది. కాగా కోహ్లీ స్పీచ్ నెట్టిట వైరల్ కావడంతో ఆర్సీబీ అభిమానులు ఆ జట్టు మెంటార్ సానియా మీర్జాను ట్రోల్ చేస్తున్నారు.
Also Read : SRH : మారిన ఆరెంజ్ ఆర్మీ డ్రెస్.. మరి ఫేట్ మారేనా..?
జట్టుకు మెంటార్ గా చేయడమంటే డగౌట్ లో కూర్చుని ఇంటర్య్వూలు ఇవ్వడం కాదని.. జట్టులో స్పూర్తి నింపాలని కామెంట్స్ చేస్తున్నారు. టెన్నిస్ ఆడే వ్యక్తిని తీసుకొచ్చి క్రికెటర్లకు మెంటార్ గా నియమించడం ఆర్సీబీ చేసిన బుద్ది తక్కువ పని అంటూ నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. 20 రోజులుగా మెంటార్ గా ఉండి సానియా మిర్జా టీమ్ కు ఒక్క విజయాన్ని కూడా అందివ్వలేకపోయిందని.. కోహ్లీ ఒక్క స్పీచ్ తో అదరగొట్టాడని కామెంట్స్ చేస్తున్నారు. ఆర్సీబీకి రియల్ మెంటార్ అంటే విరాట్ కోహ్లీ అని టెన్నిస్ ప్లేయర్ కాదని ట్రోల్ చేస్తున్నారు.
- Tags
- cricket
- ipl
- RCB
- Sania Mirza
- VIRAT KOHLI
తాజావార్తలు
-
Ram Pothineni: ‘రామ్ 23’ కోసం శ్రీనిధితో చర్చలు..!
-
IPL 2026 Playoff Scenarios: ఒక్క ప్లేఆఫ్స్ బెర్తు, ఐదు జట్ల మధ్య పోటీ.. ఆ లక్కీ టీమ్ ఎదో మరి!
-
Rishikesh Train Accident: రిషికేశ్లో తృటిలో తప్పిన ఘోర ప్రమాదం.. దేవుడిలా కాపాడిన ఆ ఒక్క కారణం ఏంటో తెలుసా?
-
Petrol and Diesel Prices Hike: వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రో ధరలు
-
Astrology: మే 19 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!