Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
- నేడు ఇంగ్లండ్, భారత్ జట్ల మధ్య చివరి వన్డే
- రోహిత్ శర్మ రిటైర్మెంట్పై ఊహాగానాలు
- తెరపైకి విరాట్ కోహ్లీ పాత వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli Warning to BCCI: ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత్ నేడు (జూలై 19) కీలక సమరానికి సిద్ధమైంది. చారిత్రాత్మక లార్డ్స్ మైదానం వేదికగా ఇంగ్లండ్, భారత్ జట్ల మధ్య చివరి వన్డే మ్యాచ్ జరగనుంది. మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ప్రస్తుతం 1-1తో సమంగా ఉండటంతో.. మూడో మ్యాచ్ డిసైడర్గా మారింది. ఈ మ్యాచ్ గెలిచి ట్రోఫీని కైవసం చేసుకోవాలని టీమిండియా చూస్తోంది. ఇప్పటికే టీ20 సిరీస్ 4-0తో గెలిచిన ఇంగ్లీష్ జట్టు.. వన్డే సిరీస్ కూడా గెలవాలని పట్టుదలగా ఉంది.
రోహిత్ రిటైర్మెంట్పై ఊహాగానాలు:
మూడో వన్డే మ్యాచ్కు ముందు టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ గురించి సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. రోహిత్కు ఇదే చివరి అంతర్జాతీయ మ్యాచ్ అంటూ సాగుతున్న ప్రచారం అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. దీనిపై బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా ఇప్పటికే క్లారిటీ ఇచ్చినా.. హిట్మ్యాన్ రిటైర్మెంట్పై వస్తున్న ఊహాగానాలకు మాత్రం బ్రేక్ పడటం లేదు.
Also Read
- Joe Root: రిక్కీ పాంటింగ్ రికార్డు చెల్లాచెదురు.. జో రూట్ అరుదైన ఘనత..
- Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
- Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
- Mithali Raj: 'నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు'.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
తెరపైకి కోహ్లీ పాత వ్యాఖ్యలు:
రోహిత్ శర్మ రిటైర్మెంట్ అంశం హాట్ టాపిక్గా మారిన తరుణంలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గతంలో చేసిన వ్యాఖ్యలు మళ్లీ తెరపైకి వచ్చాయి. ఐపీఎల్ 2026 సీజన్ సమయంలో ఆర్సీబీ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో కోహ్లీ బీసీసీఐ సెలెక్టర్లను ఉద్దేశించి చేసిన సంచలన వ్యాఖ్యల వీడియోను అభిమానులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఒకవేళ మేనేజ్మెంట్ రోహిత్ను బలవంతంగా జట్టు నుంచి తప్పుకునేలా చేస్తే.. కోహ్లీ కూడా అంతర్జాతీయ క్రికెట్కు దూరం కాక తప్పదని అభిమానులు హెచ్చరిస్తున్నారు.
కోహ్లీ ఏమన్నాడంటే?:
‘నా దృక్పథం చాలా స్పష్టంగా ఉంటుంది. జట్టుకు నా వల్ల ఉపయోగం ఉందని భావిస్తేనే నేను టీంలో భాగమవుతా. అలా కాకుండా ప్రతీసారి నన్ను నేను నిరూపించుకోవాల్సిన పరిస్థితి వస్తే మాత్రం క్రికెట్ను వదిలేస్తా. నా ప్రిపరేషన్, కమిట్మెంట్ విషయంలో నేను ఎప్పుడూ నిజాయితీగా వ్యవహరిస్తా. కష్టపడే విషయంలో అస్సలు వెనక్కి తగ్గను. వన్డేల్లో 50 ఓవర్ల పాటు మైదానంలో ప్రతీ బంతిని నా చివరి బంతిగా భావించి ఆడతా. జట్టు కోసం నా సాయశక్తులా కృషి చేస్తా. ఇంత చేసినా కూడా నా స్థానం కోసం నేను నిరూపించుకోవాల్సి వస్తే ఆట నుంచి తప్పుకోవడానికే మొగ్గు చూపుతా. నేను సిరీస్కు మూడు వారాల ముందు మాత్రమే సిద్ధమయ్యే వ్యక్తిని కాదు. ఏడాదంతా శ్రమిస్తా. భారత్ తరపున వరల్డ్ కప్ ఆడటం ఎప్పుడూ అద్భుతమే.. కానీ ఆ ప్రయాణంలో ఇరువైపులా గౌరవం ఉండాలి. పరిస్థితులను సంక్లిష్టంగా మార్చాలని చూస్తే.. నేను తప్పుకోవడానికి వెనుకాడను’ అని బీసీసీఐ సెలెక్టర్లకు కోహ్లీ సూటిగా వార్నింగ్ ఇచ్చాడు.
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!