Virat Kohli కోహ్లీ స్పీచ్ తో ఆర్సీబీ అమ్మాయిల్లో జోష్.. సానియాపై సెటైర్లు వేస్తున్న నెటిజన్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహిళల ప్రీమియర్ లీగ్ లో వరుసగా ఐదు ఓటముల ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తూ స్మృతి మంధాన సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు సీజన్ లో బోణీ కొట్టింది. ఈ మ్యాచ్ కు ముందు టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లీ మాట్లాడిన మాటలు.. ఆర్సీబీ అమ్మాయిలకు వెయ్యి ఏణుగుల బలాన్నిచ్చాయి. గెలుపోటముల సంగతి తర్వాత.. ముందైతే పోరాడండి.. అంటూ కోహ్లీ చెప్పిన మాటలు మంధాన అండ్ టీమ్ కు టానిక్ లా పనిచేశాయి. అయితే కోహ్లీ స్పీచ్ ఆర్సీబీ అమ్మాయిలకు కొత్త ఉత్తేజానివ్వగా.. ఫ్యాన్స్ మాత్రం ఆ జట్టు మోంటార్ గా నియమితురాలైన సానియా మీర్జాను నెట్టింట ఓ ఆట ఆడుకుంటున్నారు.
Also Read : Australia Couple Lottery: అదృష్టమంటే ఇది.. భార్య అలిగింది, 16 కోట్ల లాటరీ తగిలింది
Also Read
- Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
- Shubman Gill: "నా చేతుల్లో ఏం లేదు.. ఆటపైనే దృష్టి పెడతా".. రోహిత్ రిటైర్మెంట్ వేళ కెప్టెన్ గిల్ కీలక వ్యాఖ్యలు..
- IND vs ENG 3rd ODI: రోహిత్ శర్మను భయపెడుతున్న లార్డ్స్ గ్రౌండ్.. మరీ ఇంత దారుణమా!
- PV Sindhu History: పీవీ సింధు సరికొత్త చరిత్ర.. తొలి భారత షట్లర్గా అరుదైన ఘనత!
యూపీ వారియ్స్ తో మ్యాచ్ కు కొద్దిసేపు ముందు విరాట్ కోహ్లీ.. ఆర్సీబీ క్యాంప్ కు వెళ్లాడు. ఆస్ట్రేలియాతో రేపు( శుక్రవారం) జరుగబోయే తొలి వన్డేకు ముందు వాంఖేడ్ స్టేడియానికి కోహ్లీ వెళ్లాడు. అక్కడే ఉన్న ఆర్సీబీ ప్లేయర్స్ ను కలిశాడు. వారిని ఓదార్చుతూరు ఆటగాళ్లలో స్పూర్తినిచ్చే విధంగా స్పీచ్ ఇచ్చాడు. కోహ్లీ మాట్లాడుతూ తాను 15 ఏండ్లుగా ఆడుతున్నాను.. ఇప్పటిదాకా మేం ఐపీఎల్ లో ట్రోఫీ గెలవలేదు.. అయినా కూడా అది తనను ఆపలేదు.. ప్రతి ఏడాది ఉత్సాహంతో బరిలోకి దిగుతుంటా.. ప్రతి మ్యాచ్, ప్రతి టోర్నీలో శాయశక్తులా శ్రమిస్తా.. ఒకవేళ నేను గెలిస్తే చాలా గ్రేట్.. కానీ అలా జరుగలేదు.. అయినా సరే అవకాశాల కోసం ఎదురుచూస్తునే ఉంటానని కోహ్లీ అన్నారు.
Also Read : Aadhar Card : ఆధార్ కార్డు ఉందా.. అయితే మీకో గుడ్ న్యూస్
ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకూ ఒక్క ట్రోఫీ నెగ్గకున్నా మనకు ప్రపంచంలో ఓ జట్టుకూ లేని అభిమానగణం ఉన్నారని విరాట్ కోహ్లీ అన్నారు. అత్యుత్తమ అభిమానుల మద్దతు ఉన్న జట్టు ఏదైనా ఉందంటే అది మన ఆర్సీబీ మాత్రమే అని కోహ్లీ చెప్పుకొచ్చారు. ప్లే ఆఫ్ కు వెళ్లేందుకు మీకు అవకాశాలు ఒక్కశాతం మాత్రమే ఉన్నాయి.. కానీ ఆ ఛాన్స్ కూడా చాలా కీలకం.. వాటిని మెరుగుపరుచుకోవాలని కోహ్లీ వెల్లడించారు. కోహ్లీ మాటలు ఆర్సీబీ అమ్మాయిల్లో స్పూర్తినింపాయి. గత ఐదు మ్యాచ్ లలో లేని విధంగా యూపీ వారియర్స్ తో బెంగళూరు టీమ్ అన్ని విభాగాల్లోనూ సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది. కాగా కోహ్లీ స్పీచ్ నెట్టిట వైరల్ కావడంతో ఆర్సీబీ అభిమానులు ఆ జట్టు మెంటార్ సానియా మీర్జాను ట్రోల్ చేస్తున్నారు.
Also Read : SRH : మారిన ఆరెంజ్ ఆర్మీ డ్రెస్.. మరి ఫేట్ మారేనా..?
జట్టుకు మెంటార్ గా చేయడమంటే డగౌట్ లో కూర్చుని ఇంటర్య్వూలు ఇవ్వడం కాదని.. జట్టులో స్పూర్తి నింపాలని కామెంట్స్ చేస్తున్నారు. టెన్నిస్ ఆడే వ్యక్తిని తీసుకొచ్చి క్రికెటర్లకు మెంటార్ గా నియమించడం ఆర్సీబీ చేసిన బుద్ది తక్కువ పని అంటూ నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. 20 రోజులుగా మెంటార్ గా ఉండి సానియా మిర్జా టీమ్ కు ఒక్క విజయాన్ని కూడా అందివ్వలేకపోయిందని.. కోహ్లీ ఒక్క స్పీచ్ తో అదరగొట్టాడని కామెంట్స్ చేస్తున్నారు. ఆర్సీబీకి రియల్ మెంటార్ అంటే విరాట్ కోహ్లీ అని టెన్నిస్ ప్లేయర్ కాదని ట్రోల్ చేస్తున్నారు.
- Tags
- cricket
- ipl
- RCB
- Sania Mirza
- VIRAT KOHLI
తాజావార్తలు
-
Nurse Murder Case: ఆపరేషన్ థియేటర్లో నర్సు హత్య.. విషం ఇంజెక్ట్ చేసి చంపిన ప్రియుడు..
-
Donkey Wedding: వర్షాలు కురవాలని గాడిదలకు ఘనంగా పెళ్లి.. కళ్యాణదుర్గంలో వినూత్న సంప్రదాయం!
-
Horror Movie: మైత్రి మూవీ మేకర్స్ నుంచి తొలి హారర్ మూవీ.. ‘418’తో భయపెట్టేందుకు సిద్ధం!
-
Home Guard: 5 నెలలుగా జీతం లేదు.. కన్నీటి పర్యంతమైన మహిళా హోంగార్డు
-
CM Revanth Reddy: పదవుల కోసం గాంధీ భవన్కు రావొద్దు.. పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!