Virat Kohli కోహ్లీ స్పీచ్ తో ఆర్సీబీ అమ్మాయిల్లో జోష్.. సానియాపై సెటైర్లు వేస్తున్న నెటిజన్స్..
మహిళల ప్రీమియర్ లీగ్ లో వరుసగా ఐదు ఓటముల ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తూ స్మృతి మంధాన సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు సీజన్ లో బోణీ కొట్టింది. ఈ మ్యాచ్ కు ముందు టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లీ మాట్లాడిన మాటలు.. ఆర్సీబీ అమ్మాయిలకు వెయ్యి ఏణుగుల బలాన్నిచ్చాయి. గెలుపోటముల సంగతి తర్వాత.. ముందైతే పోరాడండి.. అంటూ కోహ్లీ చెప్పిన మాటలు మంధాన అండ్ టీమ్ కు టానిక్ లా పనిచేశాయి. అయితే కోహ్లీ స్పీచ్ ఆర్సీబీ అమ్మాయిలకు కొత్త ఉత్తేజానివ్వగా.. ఫ్యాన్స్ మాత్రం ఆ జట్టు మోంటార్ గా నియమితురాలైన సానియా మీర్జాను నెట్టింట ఓ ఆట ఆడుకుంటున్నారు.
Also Read : Australia Couple Lottery: అదృష్టమంటే ఇది.. భార్య అలిగింది, 16 కోట్ల లాటరీ తగిలింది
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- India Women vs SA Women: ఛేదనలో బొక్కబోర్లా పడ్డ టీమిండియా.. 4-1తో సిరీస్ ఓటమి.!
- RCB vs DC: ఒక్క మ్యాచ్ కే ఇంత తేడానా.? అప్పుడేమో 264.. ఇప్పుడు 75కే ఖేల్ ఖతం..!
యూపీ వారియ్స్ తో మ్యాచ్ కు కొద్దిసేపు ముందు విరాట్ కోహ్లీ.. ఆర్సీబీ క్యాంప్ కు వెళ్లాడు. ఆస్ట్రేలియాతో రేపు( శుక్రవారం) జరుగబోయే తొలి వన్డేకు ముందు వాంఖేడ్ స్టేడియానికి కోహ్లీ వెళ్లాడు. అక్కడే ఉన్న ఆర్సీబీ ప్లేయర్స్ ను కలిశాడు. వారిని ఓదార్చుతూరు ఆటగాళ్లలో స్పూర్తినిచ్చే విధంగా స్పీచ్ ఇచ్చాడు. కోహ్లీ మాట్లాడుతూ తాను 15 ఏండ్లుగా ఆడుతున్నాను.. ఇప్పటిదాకా మేం ఐపీఎల్ లో ట్రోఫీ గెలవలేదు.. అయినా కూడా అది తనను ఆపలేదు.. ప్రతి ఏడాది ఉత్సాహంతో బరిలోకి దిగుతుంటా.. ప్రతి మ్యాచ్, ప్రతి టోర్నీలో శాయశక్తులా శ్రమిస్తా.. ఒకవేళ నేను గెలిస్తే చాలా గ్రేట్.. కానీ అలా జరుగలేదు.. అయినా సరే అవకాశాల కోసం ఎదురుచూస్తునే ఉంటానని కోహ్లీ అన్నారు.
Also Read : Aadhar Card : ఆధార్ కార్డు ఉందా.. అయితే మీకో గుడ్ న్యూస్
ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకూ ఒక్క ట్రోఫీ నెగ్గకున్నా మనకు ప్రపంచంలో ఓ జట్టుకూ లేని అభిమానగణం ఉన్నారని విరాట్ కోహ్లీ అన్నారు. అత్యుత్తమ అభిమానుల మద్దతు ఉన్న జట్టు ఏదైనా ఉందంటే అది మన ఆర్సీబీ మాత్రమే అని కోహ్లీ చెప్పుకొచ్చారు. ప్లే ఆఫ్ కు వెళ్లేందుకు మీకు అవకాశాలు ఒక్కశాతం మాత్రమే ఉన్నాయి.. కానీ ఆ ఛాన్స్ కూడా చాలా కీలకం.. వాటిని మెరుగుపరుచుకోవాలని కోహ్లీ వెల్లడించారు. కోహ్లీ మాటలు ఆర్సీబీ అమ్మాయిల్లో స్పూర్తినింపాయి. గత ఐదు మ్యాచ్ లలో లేని విధంగా యూపీ వారియర్స్ తో బెంగళూరు టీమ్ అన్ని విభాగాల్లోనూ సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది. కాగా కోహ్లీ స్పీచ్ నెట్టిట వైరల్ కావడంతో ఆర్సీబీ అభిమానులు ఆ జట్టు మెంటార్ సానియా మీర్జాను ట్రోల్ చేస్తున్నారు.
Also Read : SRH : మారిన ఆరెంజ్ ఆర్మీ డ్రెస్.. మరి ఫేట్ మారేనా..?
జట్టుకు మెంటార్ గా చేయడమంటే డగౌట్ లో కూర్చుని ఇంటర్య్వూలు ఇవ్వడం కాదని.. జట్టులో స్పూర్తి నింపాలని కామెంట్స్ చేస్తున్నారు. టెన్నిస్ ఆడే వ్యక్తిని తీసుకొచ్చి క్రికెటర్లకు మెంటార్ గా నియమించడం ఆర్సీబీ చేసిన బుద్ది తక్కువ పని అంటూ నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. 20 రోజులుగా మెంటార్ గా ఉండి సానియా మిర్జా టీమ్ కు ఒక్క విజయాన్ని కూడా అందివ్వలేకపోయిందని.. కోహ్లీ ఒక్క స్పీచ్ తో అదరగొట్టాడని కామెంట్స్ చేస్తున్నారు. ఆర్సీబీకి రియల్ మెంటార్ అంటే విరాట్ కోహ్లీ అని టెన్నిస్ ప్లేయర్ కాదని ట్రోల్ చేస్తున్నారు.
- Tags
- cricket
- ipl
- RCB
- Sania Mirza
- VIRAT KOHLI
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!