T20 World Cup: ఫైనల్కు దూసుకెళ్లిన పాకిస్థాన్.. తొలి సెమీస్లో న్యూజిలాండ్ చిత్తు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T20 World Cup: టీ20 ప్రపంచకప్లో అనూహ్యంగా సెమీస్ బెర్త్ పొందిన పాకిస్థాన్ ఇప్పుడు ఏకంగా ఫైనల్కు దూసుకెళ్లింది. బుధవారం సిడ్నీ వేదికగా జరిగిన తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్పై 7 వికెట్ల తేడాతో పాకిస్థాన్ ఘన విజయం సాధించింది. 153 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. మరో 5 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని సొంతం చేసుకుంది. కెప్టెన్ బాబర్ ఆజమ్ 42 బంతుల్లో 53 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ రిజ్వాన్ 43 బంతుల్లో 57 పరుగులతో రాణించాడు. ఓపెనర్లు ఇద్దరూ రాణించడంతో పాకిస్థాన్ గెలుపు వైపు సాగింది. చివర్లో న్యూజిలాండ్ బౌలర్లు వికెట్లు తీసినా అప్పటికే పాకిస్థాన్ విజయం ఖరారైంది. న్యూజిలాండ్ బౌలర్లలో బౌల్ట్ రెండు వికెట్లు, మిచెల్ శాంట్నర్ ఓ వికెట్ పడగొట్టారు.
Read Also: T20 World Cup: తొలి సెమీస్లో రాణించిన పాకిస్థాన్ బౌలర్లు.. న్యూజిలాండ్ స్కోరు ఎంతంటే..?
Also Read
- Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం.. 30 బాల్స్లో సెంచరీ.. నంబర్ 1 బ్యాట్స్మెన్గా ప్రపంచ రికార్డు..
- Prithvi Shaw: యువ క్రికెటర్ పృథ్వీ షా–ఆకృతి అగర్వాల్ సంచలన నిర్ణయం.. పెళ్లికి ముందే బ్రేకప్..
- Sanju Samson: ఇక ఫెయిల్ అవ్వడు.. హాఫ్ సెంచరీలే.. సంజు శాంసన్పై సన్నీ కీలక వ్యాఖ్యలు!
- Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
కాగా పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ సరైన సమయంలో ఫామ్లోకి వచ్చాడు. న్యూజిలాండ్తో జరిగిన కీలక సెమీఫైనల్ మ్యాచ్లో బాబర్ ఆజమ్ అదరగొట్టాడు. టోరీలో సూపర్-12 దశలో ఫామ్ కోల్పోయి తంటాలు పడిన బాబర్ ఆజమ్ తొలి సెమీఫైనల్లో 42 బంతుల్లోనే 53 పరుగులు చేశాడు. సూపర్-12లో 5 ఇన్నింగ్స్ల్లో కేవలం 39 పరుగులు మాత్రమే చేసి బాబర్ ఆజమ్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. కానీ ఈరోజు కివీస్పై చెలరేగి జట్టును ఫైనల్కు చేర్చాడు. దీంతో పాకిస్థాన్ అభిమానులు బాబర్పై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు మాత్రం రిజ్వాన్ను వరించింది. గురువారం జరిగే రెండో సెమీఫైనల్ విజేతతో ఈనెల 13న ఫైనల్లో పాకిస్థాన్ టైటిల్ పోరు కోసం పోరాడుతుంది.
తాజావార్తలు
-
Udaya Bhanu: బంగారు తాళిబొట్టు పార్శిల్.. ‘నా శ్రీమతి’ అంటూ లెటర్స్.. భయంతో పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన స్టార్ యాంకర్!
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!