Mumbai Indians: ప్లే ఆఫ్స్ ఛాన్సెస్ లేవు కాబట్టి.. కనీసం ఆ పనైనా చేయండి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jasprit Bumrah Needs Rested For T20 World Cup Said Wasim Jaffer: ఐపీఎల్ 2024లో ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ దారుణ ప్రదర్శన చేస్తోంది. ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్లలో కేవలం మూడు విజయాలు మాత్రమే సాధించి.. ఏకంగా 8 పరాజయాలను ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం పట్టికలో 9వ స్థానంలో ఉంది. మిగిలిన మూడు మ్యాచ్లలో గెలిచినా ప్లేఆఫ్స్ చేరే అవకాశాలు లేవు. ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్ 2024ను దృష్టిలో ఉంచుకుని.. ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్కు టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ కీలక సూచన చేశాడు.
ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్కు ప్లే ఆఫ్స్ వెళ్లే ఛాన్సెస్ ఎలాగూ లేవు కాబట్టి.. కనీసం ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలని వసీం జాఫర్ సూచించాడు. ఈఎస్పీఎన్-క్రిక్ఇన్ఫోతో జాఫర్ మాట్లాడుతూ… ‘ఇంకో మ్యాచ్ తర్వాత ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్కు చేరదని నిర్ధారణ అయితే.. జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి. ఇది టీమిండియాకు చాలా మంచిది. విశ్రాంతి తీసుకుంటే.. బుమ్రా మరింత మెరుగ్గా బౌలింగ్ చేసి అవకాశాలు ఉంటాయి. ఈ విషయాన్ని ముంబై మేనేజ్మెంట్, బీసీసీఐ గమనించాలి’ అని అన్నాడు. ఐపీఎల్ 2024లో బుమ్రా 11 మ్యాచ్ల్లో 6.25 ఎకానమీ రేట్తో 17 వికెట్లు పడగొట్టి సూపర్ ఫామ్లో ఉన్నాడు.
Also Read
- IPL 2027: కోహ్లీ, రోహిత్తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
- Hardik Pandya: ఐపీఎల్ ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్యా ఢిల్లీకా? చెన్నైకా? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Also Read: Chennai Super Kings: చెన్నై సూపర్ కింగ్స్కు బిగ్ షాక్.. ఇక కష్టమే!
జూన్ 2 నుంచి అమెరికా, వెస్టిండీస్ వేదికగా టీ20 ప్రపంచకప్ 2024 ఆరంభం కానుంది. జూన్ 5న భారత్ తన జైత్రయాత్ర ప్రారంభించనుంది. మెగా టోర్నీ కోసం ఇంకా నెల రోజుల సమయం మాత్రమే ఉంది. భారత్ చివరి సరిగా 2013లో ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. అప్పటి నుంచి టీమిండియా ఖాతాలో మరో ట్రోఫీ లేదు. దాంతో ఈసారి కప్ కొట్టాలనే లక్ష్యంతో రోహిత్ సేన బరిలోకి దిగుతోంది. 2007లో ఎంఎస్ ధోనీ సారథ్యంలో భారత్ టీ20 ప్రపంచకప్ను గెలుచుకున్న విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!