IND VS ENG: చిత్తుగా ఓడిన ఇంగ్లండ్.. భారత్ ఘనవిజయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ద ఒవల్ స్టేడియం వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన తొలి వన్డే మ్యాచ్లో భారత్ ఘనవిజయం సాధించింది. ఇంగ్లండ్ కుదిర్చిన స్వల్ప లక్ష్యాన్ని (111) ఒక్క వికెట్ కోల్పోకుండానే భారత్ చేధించింది. ఓపెనర్లుగా వచ్చిన రోహిత్ శర్మ (76*), శిఖర్ ధవన్ (31*).. తొలుత ఆచితూచి ఆడారు. ఆ తర్వాత వీలు చిక్కినప్పుడల్లా భారీ షాట్లు బాదడంతో.. 18.4 ఓవర్లోనే భారత్ విజయం సాధించింది. ముఖ్యంగా.. కెప్టెన్ రోహిత్ శర్మ చెలరేగిపోయి ఆడాడు.
తొలుత టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంపిక చేసుకోవడంతో.. బ్యాటింగ్ చేసేందుకు ఇంగ్లండ్ రంగంలోకి దిగింది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడంతో.. ఇంగ్లండ్ బ్యాట్స్మన్లు కనీస షాట్లు కూడా ఆడలేకపోయారు. ఒకరి తర్వాత మరొకరు పెవిలియన్ చేరారు. బుమ్రా (7.2 ఓవర్లలో 19 పరుగులిచ్చి 3 మెయిడెన్, 6 వికెట్లు) అయితే స్వింగ్ మ్యాజిక్తో ఇంగ్లండ్ ఆటగాళ్లకి చుక్కలు చూపించాడు.
Also Read
- IND Vs ENG 3rd ODI: లార్డ్స్ ఫైనల్ ఫైట్.. సుందర్ స్థానంలో యువ సంచలనానికి లక్కీ ఛాన్స్..
- Aakash Chopra: కుల్దీప్ యాదవ్ను ఎందుకు బలిపశువును చేస్తున్నారు.. మాజీ క్రికెటర్ సూటి ప్రశ్న..
- ENG Vs IND 3rd ODI: మెన్ ఇన్ బ్లూ టార్గెట్ లార్డ్స్.. 22 ఏళ్ల నిరీక్షణకు తెరదించే సమయం వచ్చేసింది..
- Rohit Sharma Retirement: బిగ్ షాక్.. సెలక్టర్లకు ఎదురుతిరిగిన రోహిత్ శర్మ.. జైస్వాల్ కోసం గిల్ త్యాగం!
మహమ్మద్ షమీ (7 ఓవర్లలో 31 పరుగులు, 3 వికెట్లు) సైతం తన మాయాజాలంతో కన్ఫ్యూజ్ చేసేశాడు. ఏకంగా నలుగు బ్యాట్స్మన్లు సున్నా పరుగులకే ఔటయ్యారు. కెప్టెన్ జాస్ బట్లర్ (32 బంతుల్లో 30 పరుగులు), డేవిడ్ విల్లీ (26 బంతుల్లో 21) మాత్రమే కొంచెం రాణించారు. మిగతా వాళ్లంతా దారుణ ప్రతిభ కనబర్చారు. భారత బౌలర్ల దెబ్బకు ఇంగ్లండ్ 25.2 ఓవర్లలోనే 110 పరుగులకి కుప్పకూలింది.
ఇక ఇంగ్లండ్ నిర్దేశించిన 111 పరుగుల్ని ఛేదించడం కోసం బరిలోకి దిగిన భారత బౌలర్లు.. చలాకీగా రాణించి, వికెట్ కోల్పోకుండానే రప్ఫాడించారు. తొలుత ఇంగ్లండ్ బౌలర్లు భారత ఆటగాళ్లకి కట్టడి చేసేందుకు ప్రయత్నించారు కానీ, ఓపెనర్లు తెలివిగా రాణించి, ఆ తర్వాత దూకుడు ప్రదర్శించారు. ఫలితంగా 18.4 ఓవర్లలోనే మ్యాచ్ కైవసం చేసుకున్నారు. దీంతో.. మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భారత్ 1-0 తేడాతో ఆధిక్యంలో ఉంది.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!