Hardik Pandya: టీ20ల్లో రికార్డు సృష్టించిన హార్దిక్ పాండ్యా.. గర్ల్ ఫ్రెండ్ పోస్ట్ వైరల్!
- అంతర్జాతీయ టీ20 క్రికెట్లో చరిత్ర సృష్టించిన హార్ధిక్ పాండ్యా..
- టీ20 ఫార్మాట్లో 1000 పరుగులు, 100 వికెట్లు, 100 సిక్సులు కొట్టిన పాండ్యా..
- హార్దిక్ పాండ్యా గర్ల్ ఫ్రెండ్ మాహికా శర్మ ఇన్స్టాగ్రామ్ స్టోరీ వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hardik Pandya: భారత ఆల్రౌండర్ హార్ధిక్ పాండ్యా అంతర్జాతీయ టీ20 క్రికెట్లో చరిత్ర సృష్టించాడు. సౌతాఫ్రికాతో ఆదివారం జరిగిన మ్యాచ్లో తక్కువ మ్యాచుల్లో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో 1000కి పైగా పరుగులు, 100కు పైగా సిక్సర్లు, 100కు పైగా వికెట్లు తీసిన ఆటగాళ్ల క్లబ్లో చేరాడు. ఈ ఘనత సాధించిన తొలి ఆల్రౌండర్గా హార్దిక్ నిలవడం విశేషం. ఈ జాబితాలో ఆయనతో పాటు జింబాబ్వే ఆటగాడు సికందర్ రజా, అఫ్గానిస్తాన్కు చెందిన మహమ్మద్ నబీ, మలేషియాకు చెందిన వీరందీప్ సింగ్ ఉన్నారు.
Read Also: Geeta Arts : లెజెండరీ సింగర్ బయోపిక్ కు అల్లు అరవింద్ శ్రీకారం
Also Read
- CSK Vs LSG: లక్నో గ్రౌండ్లో కార్తీక్ శర్మ వీరవిహారం.. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై భారీ స్కోరు..
- ICC: పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు ఐసీసీ డబుల్ షాక్.. ఆటగాళ్లపై 40 శాతం జరిమానా.. కారణం ఇదే..
- T20 Captain: భారత టీ20 కెప్టెన్గా కొత్త సారథి.. సంజూ శాంసన్కు అవకాశం..?
- Ambati Rayudu: IPL 2026లో తోపు కెప్టెన్ అతనే..
అయితే, భారత జట్టు తరఫున టీ20ల్లో 100 వికెట్లు సాధించిన మూడో బౌలర్గా హార్దిక్ పాండ్యా రికార్డు సృష్టించాడు. అంతకు ముందు ఈ ఘనతను అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా సాధించారు. హార్దిక్ ఇప్పటి వరకు 123 అంతర్జాతీయ టీ20 మ్యాచ్లలో 26.78 సగటుతో 100 వికెట్లు తీయగా, అతని అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన 4/16గా ఉంది. నిన్న జరిగిన మ్యాచ్లో మూడు ఓవర్లలో 23 రన్స్ మాత్రమే ఇచ్చి ఒక వికెట్ పడగొట్టిన హార్దిక్, 122 మ్యాచ్లలో 1,939 పరుగులు, 141.53 స్ట్రైక్రేట్, 101 సిక్సర్లు కొట్టాడు.
Read Also: TDP vs YSRCP: గన్నవరంలో టీడీపీ వర్సెస్ వైసీపీ.. వల్లభనేని వంశీని కలిసినందుకు దాడి..!?
ఇక, ఈ ఘనత సాధించిన హార్దిక్కు సోషల్ మీడియాలో అభినందనల వెల్లువెత్తగా, ఆయన గర్ల్ఫ్రెండ్ మాహికా శర్మ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో భావోద్వేగపూరిత సందేశాన్ని పంచుకుంది. అయితే, ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ ముందుగా బౌలింగ్ ఎంచుకోగా, అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు. దక్షిణాఫ్రికా జట్టు కెప్టెన్ ఏడెన్ మార్క్రమ్ (61) ఒంటరిగా పోరాడినా, జట్టు 20 ఓవర్లలో 117 పరుగులకే పరిమితమైంది. లక్ష్య ఛేదనలో భారత్ 15.5 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయం సాధించడంతో.. ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత్ 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..