DCvsGT : చివరి బంతి థ్రిల్..! ఒక్క పరుగుతో గెలిచిన గుజరాత్… రాహుల్ హీరోయిజం వృథా!
- గుజరాత్ vs ఢిల్లీ.. హై స్కోరింగ్ థ్రిల్లర్
- వాషింగ్టన్ సుందర్, గిల్ మెరుపులతో భారీ స్కోర్
- కేఎల్ రాహుల్ అద్భుత ఇన్నింగ్స్… సెంచరీకి అడుగు దూరంలో ఆగింది
- చివరి బంతి డ్రామా… ఒక్క పరుగు తేడాతో గుజరాత్ విజయం
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన పోరు క్రికెట్ చరిత్రలోనే అత్యంత ఉత్కంఠభరితమైన మ్యాచ్లలో ఒకటిగా నిలిచిపోయింది. అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ హై-స్కోరింగ్ మ్యాచ్లో చివరి బంతి వరకు విజయం ఎవరిని వరిస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోరును సాధించింది. ముఖ్యంగా వాషింగ్టన్ సుందర్ తన కెరీర్లో అద్భుతమైన ఫామ్ను కనబరుస్తూ మొదటి అర్థ సెంచరీతో జట్టుకు భారీ స్కోరును అందించగా, గిల్ తనదైన శైలిలో మెరుపులు మెరిపించారు. 211 పరుగుల క్లిష్టమైన లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఆరంభంలోనే నిస్సాంకా వేగంగా పరుగులు రాబట్టి ఆశలు రేకెత్తించాడు.
అయితే ఈ మ్యాచ్కు అసలైన ఆకర్షణ కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్. బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడిన రాహుల్, కేవలం 52 బంతుల్లోనే 11 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 92 పరుగులు చేసి జట్టును దాదాపు విజయతీరాలకు చేర్చారు. సెంచరీకి అతివలువలో ఉన్న దశలో సిరాజ్ వేసిన అద్భుతమైన బంతికి రాహుల్ పెవిలియన్ చేరడంతో మ్యాచ్ ఒక్కసారిగా గుజరాత్ వైపు మొగ్గు చూపింది. కానీ, డేవిడ్ మిల్లర్ క్రీజులోకి రావడంతో కథ మళ్ళీ మొదటికి వచ్చింది. గాయంతో ఇబ్బంది పడుతున్నప్పటికీ మిల్లర్ ఆఖరి ఓవర్లలో సిరాజ్ బౌలింగ్ను చీల్చిచెండాడు. సిక్సర్లు , ఫోర్ల వర్షం కురిపించడంతో ఢిల్లీ విజయం ఖాయమని అందరూ భావించారు. ఆఖరి ఓవర్లో ఢిల్లీ గెలవడానికి 13 పరుగులు అవసరమవ్వగా, ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్ బాధ్యతలు చేపట్టారు.
Also Read
- Shreyas Iyer: "నీ వల్ల కాదు అంటే తట్టుకోలేను".. విమర్శకులకు శ్రేయస్ అయ్యర్ స్ట్రాంగ్ కౌంటర్..
- Bhuvneshwar Kumar: విమర్శకులకు వికెట్లతో సమాధానం.. భువనేశ్వర్ గణాంకాలు చూస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే..
- Virat Kohli: ఆకాశమే హద్దుగా కోహ్లీ రికార్డుల వేట.. ఐపీఎల్లో ఈ ఘనత సాధించిన ఏకైక ప్లేయర్ విరాట్..
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
ప్రసిద్ధ్ కృష్ణ వేసిన ఆఖరి ఓవర్ మొదటి బంతికే విప్రజ్ నిగమ్ ఫోర్ కొట్టడంతో స్టేడియం మొత్తం హోరెత్తిపోయింది. అయితే రెండో బంతికి నిగమ్ అవుట్ కావడంతో ఉత్కంఠ పరాకాష్టకు చేరింది. ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ సింగిల్ తీసి స్ట్రైకింగ్ను మిల్లర్కు ఇచ్చాడు. నాలుగో బంతిని మిల్లర్ స్టేడియం వెలుపలకు పంపడంతో ఢిల్లీ విజయానికి చివరి రెండు బంతుల్లో కేవలం రెండు పరుగులు మాత్రమే అవసరమయ్యాయి. ఆ ఐదో బంతిని మిల్లర్ వదిలేయడం మ్యాచ్ను మలుపు తిప్పింది. ఆఖరి బంతికి రెండు పరుగులు చేయాల్సిన స్థితిలో మిల్లర్ షాట్ను మిస్ చేయగా, సింగిల్ తీసే క్రమంలో కుల్దీప్ యాదవ్ రన్ అవుట్ అయ్యాడు. అంపైర్లు ఆ బంతిని ఎత్తు కారణంగా నో-బాల్గా పరిగణిస్తారేమోనని కాసేపు ఉత్కంఠ నెలకొన్నప్పటికీ, అది సరైన బంతి అని తేలడంతో గుజరాత్ టైటాన్స్ కేవలం ఒక్క పరుగు తేడాతో అపురూప విజయాన్ని సొంతం చేసుకుంది. రాహుల్ , మిల్లర్ శ్రమ వృథా అయినప్పటికీ, ఈ మ్యాచ్ అభిమానులకు అసలైన క్రికెట్ వినోదాన్ని పంచింది.
తాజావార్తలు
-
యష్ ‘టాక్సిక్’కు ఓటీటీ టెన్షన్..
-
Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
-
Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
-
Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
-
Ashu Reddy: హైకోర్టును ఆశ్రయించిన అషురెడ్డి ..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!